Thursday, May 5, 2011

కబుర్లు - 44

అవీ, ఇవీ, అన్నీ

నేను ఇదివరకు వ్రాసిన ఓ టపాలో వెలిబుచ్చిన భావాలనే ప్రకటిస్తూ, ఎస్ ఎస్ తారాపోర్ (రిజర్వు బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నరు) ఈనాడులో తన "డిపాజిటర్లతో సయ్యాటలా" అనే శీర్షికతో, 25-04-2011 న ఓ వ్యాసం వ్రాశాడు. చదవకపోతే, ఇప్పుడైనా చదవండి.

ఇంక రిజర్వ్ బ్యాంక్, అత్యంత ధైర్యంతో, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసే వుద్దేశ్యంతో, రెపో/రివర్స్ రెపో రేట్లని "యేకంగా" (తుమ్మల కిషోర్ "అంచనాలకు" మించి) అర శాతం పెంచేసింది! సీ ఆర్ ఆర్ ని ముట్టుకో లేదు. బాగానే వుంది.

కానీ, "పెట్రో" ధరలు తక్షణమే పెంచాలని సూచించడం యేమిటి

ఇన్నాళ్లూ మురళీ దేవరా ఆ రేట్లు పెంచాలని ప్రభుత్వానికి లేఖలు వ్రాయడం, మన్మోహన్, మోంటేక్ లు "ఇప్పుడే వద్దు" అనడం, జైపాల్ రెడ్డి కూడా "సమీప భవిష్యత్తు లో పెరగవు" అని హామీలివ్వడం ఇలా జరుగుతూ వస్తోంది.

ఈ విషయం ఆర్బీఐ కి యేమి సంబంధం? ఇదివరకు యెప్పుడూ అలాంటి సలహాలు వాళ్లివ్వలేదే? దువ్వూరివారే యెందుకు ఇచ్చారు? శంఖంలో నీళ్లు పొయ్యమని ఆయనకి యెవరు చెప్పారు?

అలా పెంచకపోతే, ద్రవ్యలోటు రూ.లక్షా యెనభై వేల కోట్లు పెరిగిపోతుందట! ఇంతాజేసి ఓ 2జీ స్కామంతే కదా?! ఆ డబ్బుని ఆ వెధవల దగ్గర వసూలు చేసి, దాంతో "ఆయిల్ పూల్" యేర్పాటు చెయ్యమని యెందుకు "రికమెండ్" చెయ్యరు దువ్వూరివారు? జనాలు లోకువా!

(ద్రవ్యలోటూ, వృధ్ధిరేటూ ప్రభుత్వ తలనొప్పులు. అవి మీకెందుకు? ఇప్పటికీ ద్రవ్యలోటుకి సరిపడా కొత్త కరెన్సీ ప్రింటు చేసి విడుదల చేస్తూనే వున్నారుగా? ఇంకా "డీ మోనెటైజేషన్" కి సంకేతాలు ఇచ్చినట్టు కాదూ?)

(డీ మోనెటైజేషన్ గురించి మరో టపా వ్రాస్తాను త్వరలో).

క్రితంసారి పెంచిన ధరలకే మన చికెన్నారాయణా, నిత్యసంతోషి రాఘవులూ, కిషన్ రెడ్డీ, చంద్రబాబూ అడపాదడపా ఆందోళనలు చేసి, అంతకన్నా "ముఖ్యమైన" విషయాల్లోకి వెళ్లిపోయారు. మరి ఇవాళో రేపో అర్థరాత్రి నుంచీ ఈ రేట్లు "విపరీతంగా" పెరిగితే, అందోళనలు చెయ్యడానికి వీరికి వోపిక వుంటుందా? యేమో!

ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ప్రజలు వీఐపీలు కాదు--వీపీలు (వట్టి పిచ్చాళ్లు!).

మన రాజశేఖర రెడ్డి బాటలోనే, అరుణాచల్ ముఖ్యమంత్రి ఖండు దోర్జీ (ఇదివరకు పత్రికలు ఆయన పేరుని "ఖాండుప్ దోర్జీ" అని వ్రాశేవారనుకుంటా) పైలోకాలకి వెళ్లిపోయిన కొన్ని రోజుల తరవాత ఆ వార్తని ధృవీకరించాయి ప్రభుత్వాలు.

మన చిరంజీవి సైతం నిన్న (04-05-2011) న తను ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ తో సహా దాదాపు ఓ గంటపాటు "మాయం" అయిపోయాడట బెం"గాల్లో"!

బాబూ! బ్రతికుంటే బలుసాకు తినొచ్చు. ఇదివరకోసారి పొలాల్లో దిగిపోయావు అని మరచిపోతే యెలా?

నువ్వు పొత్తు కలుపుకొన్న కి.కు.రె. హెలికాప్టర్లే కాదు, విమానాలు కూడా యెక్కడానికి భయపడుతుంటే, తగుదునమ్మా అని ఇలా చెయ్యడం మనకి అంత "అవసరమా?" అహ.....అవసరమా అని?

బీహార్ తరహా చట్టాలు తేవాలి అంటున్నాడు అసదుద్దీన్--హింసకి వ్యతిరేకంగా! తనదాకా వస్తే.......అని అక్బరుద్దీన్ చెప్పాడు మరి!

2 comments:

said...

1.80 వేల కోట్లు should be 180 వేల కోట్లు ??

Unknown said...

పాయింటు పెట్టడం పొరపాటే. సవరించాను.

ధన్యవాదాలు.