Thursday, November 27, 2008

తాజా స్థితి

సాయంత్రం 4.00 గంటలకి వార్త యేమిటంటే, ముంబాయి లోని ప్రసిద్ధ హోటళ్ళు తాజ్, ఒబెరాయ్, మారియట్ లు ఇంకా మండుతూ, అంతస్తులు పేలుతూనే వున్నాయని!

ఈ రోజు రాత్రి 8.00 గం. ల నించి ఇప్పటివరకూ, టీవీ రావటంలేదు! ఇదేమైనా యాదృఛ్ఛికమా, లేక సెన్సారా? అసలు దేశంలో 'ఇప్పుడు' యేమౌతోంది? అని నా వర్రీ!

మన కేంద్ర హోం మంత్రి

మన కేంద్ర హోం మంత్రి “ఇంటెలిజెన్స్”


“తీవ్రవాదులు ‘అణ్వాయుధాలతోనూ, జీవ, రసాయన ఆయుధాలతోను’ దాడి చేసే అవకాశం వుంది” అంటాడోరొజు!

(దొంగాణ్ణి పెళ్ళాం గట్టిగా పట్ట్లుకుంటే, మొగుడు అన్నాడట “ఒసే! వాడు దొంగాడే! చెయ్యి కొరుకుతాడేమో! జాగ్రత్త!” అన్నాడట! తరవాతేమయ్యిందో అందరికీ తెలుసు!)

మర్నాడు, మన్మోహన్సింగ్ ‘అలాంటిదేమీ లేదు! మనం అప్రమత్తంగా వున్నాం’ అంటాడు!

మళ్ళీ మర్నాడు హోం ‘నన్ను మిస్ కోట్ చేసారు’ అంటాడు! పైగా, 'పోటా' లాంటి చట్టాలు అవసరం లేదు—వున్న చట్టాలు చాలు అంటాడు!

ఆ మర్నాడు మన్మోహన్ ‘తీవ్ర వాదం పెరిగింది! దానికి అడ్డు కట్టవేయడానికి అందరూ పూనుకోవాలి’ అంటాడు!

“తీవ్రవాదానికి ‘మతం’ లేదు!” అంటుంది వాళ్ళ నాయకురాలు (సోనియా) నాగమ్మ!

చిన్న ఒకటి రెండు పిట్ట కథలు—

ఒకాయనకి యెవరో చెప్పారట—మేనమామ చెవుల్లో వెంట్రుకలుంటే, నీకు చాలా అదృష్టం! ఆని. వెంటనే మన వాడు తపస్సు చేశాడట—‘మా మేనమామ చెవుల్లో వెంట్రుకలు తక్షణం మొలవాలని! దేవుడు ప్రత్యక్షమై వరమిచ్చాడట—‘తథాస్తు’ అని! వెంటనే, వాడి మేనమామ చెవుల్లో ‘చెట్లు’ మొలిచాయాయట!

ఆ మేనమామ బాధ భరించలేక ‘ఒరే! సాక్షాత్తూ ఆ దేవుడే ప్రత్యక్షమైనప్పుడు నీ అసలు కోరికలు కోరుకొంటే అవే నిజమౌను గదా, ఇదేం వెర్రి కోరికరా?’ అని యేద్చాడట!

అలా మన కేంద్ర హోం మంత్రి గారి మేనల్లుడేమైనా………..! యేమో!

‘ఫాక్లాండ్ వార్’ లో తెగబడి గెలిచిన బ్రిటన్ ప్రథాని మార్గరెట్ థాచెర్ ని ‘ది లేడీ విత్ రియల్ బాల్స్’ అనే వారు!

మరి ఈ నాడు, మన హోం మంత్రిని “ది లేడీ విత్ రియల్ హెయిర్స్ ఆన్ హర్ ఇయర్స్” అనీ, మన్మోహన్ని “ది లేడీ విత్ రియల్ వైట్ బియర్డ్” అనీ మనం అనొచ్చా?

(నోట్ : నిన్న 26-11-2008 రాత్రి 10.00 గంటలకి మాటీవీ న్యూస్ చూసి, ఈ బ్లాగు పూర్తి చేసి, ‘హమ్మయ్య! ఈ రోజుకి నా దేశం, ప్రజలూ క్షేమం! యెక్కడో బ్యాంకాక్ లో విమానాశ్రయాన్ని వశం చేసుకొన్నారట! పాపం ప్రయాణికులు!’ అనుకొని, కంప్యూటరు, టీవీ ఆపేసి, నిద్రకి ఉపక్రమించాను. కాని—సరిగ్గా అదే సమయంలో తీవ్రవాదులు ముంబాయి నగరంలో విద్రోహ కాండ మొదలు పెట్టారని ఇవాళ (27-11-2008) ప్రొద్దున పేపర్లు చూసాకే తెలిసింది! మరి యెవరిని యేమనాలో మీరే అలోచించండి!)

Sunday, November 16, 2008

బానిస బుద్ధి

బానిస బుద్ధి

మొన్నపేపర్లో ఫోటో చూశారా?

14-11-2008 న ఢిల్లీలో—రాహుల్ గాంధీ బెలూన్లు యెగరేస్తుంటే వెనక్కాలే శివరాజ్ పాటిల్ కూడా బెలూన్లు పట్టుకుని!

మొన్న, బాంబు ప్రేలుళ్ళ తరవాత ఒక్కో ఛానెల్లో ఒక్కో సఫారీ సూట్ మార్చుకొని కనిపించాడని అంటే, నా డ్రెస్ నేను మార్చుకుంటే మీకేమిటి అనీ, నేనందంగా వుండద్దా? అనీ అన్నాడట!

అసలు ఆ చెవులమీద వెంట్రుకలు గొరిగిస్తేగానీ నువ్వు అందంగా కనిపించవు—అని యేవరూ చెప్పలేదేమో!

దానికన్నా ముందు బానిస బుద్ధి ఒదులుకుంటే, ఇంకా బాగుంటావు అని ఇంకెవరైనా చేపితే, ఇంకా బాగుండును!

14-11-2008 నే, శ్రీ అజిత్ కుమార్ పాంజా (సమాచారమో అదేదో మంత్రిగా పని చేశాడిదివరకు!) పరమపదించాడుట. ఈయన టైములోనే రేడియో, దూరదర్శన్ లని సర్వ నాశనం చేశాడంటారు!

అయినా చచ్చినవాడి కళ్ళెప్పుడూ, చేఱడేసే! వార్తలో ఆయనకి వాడిన విశేషణాలు—తృణమూల్ కాంగ్రెస్ నేత, కవీ, రచయితా, నటుడూ—ఇలా!

Wednesday, November 12, 2008

“మీసాలు”

తిరుపతి వేంకట కవులని యెవరో అడిగారట—‘అసలు మీకీ మీసాలు యెందుకండీ’ అని.

చెళ్ళపిళ్ళవారు వెంటనే ఓ పద్యం చెప్పారట—‘ఉభయ భాషలకు మేమె కవీశ్వరులమటంచు పెంచినారమీ మీసలు రెండు…………..(ఈ విద్యలో మమ్మల్ని ఓడించినవారి)……….కాల్మొక్కమే’ అంటూ!

అదీ పౌరుషమంటే! అదీ మీసమంటే!

‘రొయ్యకు లేవా తెగ బారెడు………..’ అన్నారు!

అయినా, ఏ కనుమూరి బాపిరజో తప్ప ఈ మధ్య తెలుగు వాళ్ళు మీసాలు పెంచదమే మానేశారు!

‘మీసాలకు సంపెంగ నూనె రాసుకోవడం’, ‘మీసాలమీద నిమ్మకాయల్ని నిలబెట్టడం’ ‘మీసాల్తొ టన్ను రాళ్ళెత్తడం’ ‘మీసాలకి తాళ్ళు కట్టుకొని విమానాలు లాగడం’—ఇలాంటివి మనం చూస్తూనే వున్నాం!

మరి మీసాల విలువ యేమిటి? యెంత?

Saturday, November 8, 2008

……..కోటీశ్వరులు!


మొన్న అక్టోబరు 30న రాత్రి ఏలూరులో బసచేసి, భోజనం చేసిన మన సీయంగారి ‘అభి-రుచి’ని అనుసరిస్తూ, ‘జిల్లా యంత్రాంగం’ వండించిన ‘మెనూ’ ఇది(ట).

1. చికెన్ కర్రీ (బోన్ లెస్)
2. మటన్ కర్రీ (బోన్ లెస్)
3. వైట్ ఫిష్ పులుసు
4. రొయ్య, జీడిపప్పు (ఫ్రై)
5. బొమ్మిడాయిల పులుసు
6. బెల్లం జున్ను
7. పంచదార జున్ను
8. పూతరేకులు (బెల్లమా పంచదారా లేక రెండూనా—తెలీదు)
9. పుల్కాలు
10. కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి
11. కాజూ పనీరు
12. పప్పూ టమాటా
13. గుత్తి వంకాయ కూర
14. దొండకాయ, జీడిపప్పు కూర
15. ఉలవ చారు
16. సాంబారు
17. కొబ్బరి అన్నం
18. అన్నం
19. పెరుగు
20. అప్పడం
21. ఫ్రూట్ సలాడ్
22. ‘వంటివి’

ఇక మెగా స్టారుగారు, తన ‘ప్రజా అంకిత’ అని పేరు పెట్టుకున్న యాత్రలో, ఆయన మెనూ….

ఉదయం అల్పాహారంగా—రెండు ఇడ్లీ, లేదా రెండు దోశెలు
అదనంగా పండ్ల ముక్కలు, కాఫీ

మధ్యాహ్న భోజనం (సాయంత్రం 4 కి)—వివిధ రకాల పప్పు ధాన్యాలూ బియ్యంతో
చేసిన జావ, ఉడికించిన కూరగాయ ముక్కలు
ఆకు కూరలతో భోజనం.
—అడపాదడపా—కొద్దిగా—చికెన్!
—దీనికి, పెఱుగు అదనం!

రాత్రి భోజనం కూడ, పగలు లాగే—పెఱుగుబదులు మజ్జిగ వుంటుంది.

ఇక, తనతో వచ్చే మిగిలిన వాళ్ళకోసం—ఓ ‘వెయ్యి’ మందికి ప్రతిరోజూ భోజనం వండుతున్నారట!

వీళ్ళ మెనూ యేమిటట?

ఉదయం—‘తప్పనిసరిగా’ ఇడ్లీతోపాటు, పొంగల్, వడ, ఉప్మా వంటి అల్పాహారం.

మధ్యాహ్నం—బిర్యానీలాంటి ఏదో ఒక అన్నం, కూర, పెఱుగు, అరటి పండు, రెండు
కోడి గ్రుడ్లు.

రాత్రి భోజనంలోకి—గ్రుడ్లబదులుగా, ఎదో ఒక మాంసాహారం.

వీటికి అవుతున్న సంబారాలు—రోజూ 300 కేజీల బియ్యం; 160 కేజీల కూరగాయలు; 160
కేజీల పెఱుగు; ‘టీ’ కోసం 50 లీటర్ల పాలు, 120 కేజీల
చికెన్ గాని, మటన్ గాని; చేపలైతే, 175 కేజీలు—ఇవి(ట)!

{ప్రజల దృష్టిలో—మెగాస్టార్ శత కోటీశ్వరుడైతే, సీయం సహస్రకోటీశ్వరుడు! అయినా సీయంగారికి ‘జిల్లా యంత్రాంగం’ ఒక రోజుకి—యేర్పాట్లు చేస్తూంటే, (ప్రతీ రోజూ ఏదో జిల్లానో, రాష్ట్రనో యంత్రాంగం చేస్టూనే వుండాలిగా--అంటారా? నన్నడగకండి!) మెగాస్టార్ కి యెవరు! ఆయన సొంత డబ్బేనంటారా? ఏమో!} మా చిన్నప్పుడు ‘స్టార్లు’ సినిమాకి తీసుకునే పారితోషికం 50% వైట్, 50% బ్లేక్ అని చెప్పుకునేవారు. ఈ రోజుల్లో, వైటే కొన్ని కోట్లు అంటుంటే, ఇక బ్లేక్ 25% + 75% ఉండదంటారా?)

అసలు మెగాస్టార్ తిరుపతి మీటింగులో ఆయన ఆవేశం చూసి, అభిమానుల్ని ‘రేపటినుంచే మీరందరూ కదలండి’ అంటూంటే, ‘ఠాగూర్’ లాగానో, ‘స్టాలిన్’ లాగానో అంటాడేమో, ‘అవినీతిమీద సమరం ప్రకటించండి…..అవినీతిపరులని పట్టించండి’ అని నినదిస్తాడేమో అని చాలా మంది యెదురు చూసారు—కాని—అబ్బే!

పార్టీ ప్రకటించక ముందు, చాలా మంది, పార్టీ పెట్టగానే, “నేను అవినీతి వంటి జాడ్యాలకి వ్యతిరేకం గా ‘లోక్ సత్తా’ పార్టితో కలిసి పోరాడతా’—అని ఆంటాడేమో అని అనుకున్నారు!

కానీ, దాసర్లూ, జోగయ్యలూ పడనివ్వలేదని వినికిడి!

నీరు పల్లమెరుగు………….! అదీసంగతి!

Sunday, November 2, 2008

……..అవునా! నిజమేనా?

1) మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన రావడానికి ముఖ్య కారణం మన ‘ఛత్రపతి శివాజీ’ అంటే నమ్ముతారా?

2) ఆలెగ్జాండరుతో సంధి చేసుకుని, మన దేశంలోకి ఆహ్వానించిన తక్షశిల రాజు ‘అంభి’ తరవాత, దేశానికి అంత ద్రోహం చేసిన వ్యక్తి మన దేవెగౌడ అంటే నమ్ముతారా?