Wednesday, January 28, 2009

ఆషాఢభూతులు

ఇవాళ (28-01-2009) మన పాకిస్థాన్ నిపుణ కాలమిస్ట్ యేమన్నాడో చూశారా?

“…..పాక్ చర్యలు తీసుకోవాలి. పాక్ ఎన్ని దురాగతాలకు పాల్పడినా తప్పించుకు పోగలుగుతోందంటూ భారత్ లో పాక్ పై నెలకొన్న అభిప్రాయాన్ని మార్చడానికి ఆ తరహా చర్యలు దోహదపదతాయి. ఆందుకు భిన్నం గా పాకిస్థాన్ గతం లో మాదిరే మళ్ళీ తూతూమంత్రం గా దర్యాప్తు జరిపిస్తే, ఆ దేశం పట్ల భారత్ కుగల అపనమ్మకం మరింత పెరిగిపోతుంది. ఉభయ దేశాల మధ్య సంఘర్షణలు ఉండకపోవచ్చు అలాగని, శాంతియుత వాతావరణమూ ఉండదు. ఇరుదేశాలూ పరస్పరం కత్తులు దూసుకోకపోవచ్చు అలాగని, రెండు దేశాల నడుమ సామరస్యపూరిత వాతావరణమూ నెలకొనదు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కావడం ఇటు ఇండియాకూ మంచిది కాదు, అటు పాకిస్థాన్ కూ మంచిది కాదు.” (ఒత్తి పలికింది నేను మాత్రమే—మన నిపుణ మిత్రుడు కాదు!)

ధ్వని యేమని వినబడుతోంది? తూతూమంత్రం చేస్తే చాలని పాక్ కి సూచిస్తున్నట్టు లేదూ? రెండు దేశాలకీ మంచిదికాదు (ముఖ్యంగా భారత్ కి మంచిది కాదు) కాబట్టి, భారత్ నోరు మూసుకు కూర్చోవాలని ఉపదేశం కాదూ?

అసలు గుండె రగిలి పోతూ వుంటే, ‘శాంతియుత’ ‘సామరస్య’ వాతావరణం కోసం భారత్ లో యెవడు యేడుస్తున్నాడండీ? (ఒక్క కాంగీరేసులు తప్ప)

ఒకసారి ‘సమాచారం మాత్రమే’ ఇచ్చారు అనీ, ఇంకోసారి మా దర్యాప్తుకి ‘ఆధారాలు’ ఇచ్చారు అనీ, ‘సాక్ష్యాలు’ యేమీ మాకు అందలేదు అనీ—భారత్ ఇచ్చిన సాక్ష్యాల గురించి మాట్లాడేవాడిది నాలుకా? తాటి పట్టా?

వీళ్ళతో సామరస్యం యేమిటి?

వాడెవరో అన్నట్టు, భారత ప్రజలందరూ పాకిస్థాన్ వైపు తిరిగి గట్టిగా ఖాండ్రించి ఉమ్మేస్తే, దక్షిణ పాకిస్థాన్ అంతా అరేబియాసముద్రంలో కలిసి పోదూ?

ఆణు బూచిని చూపిస్తారా? కమాన్! 'మొదటి ప్రయోగం మేము చెయ్యం' అనే ఒట్టు తీసి ఒక్క నిమిషం గట్టున పెడదాం! ఇంకా వాళ్ళకి చాన్స్ వుంది అంటారా, ఓకే! మా జనభా తగ్గడానికి కూడా మాకు సమ్మతమే! మా దేశం ఓ ఇరవయ్యేళ్ళు--కాదు కాదు అరవై రెండేళ్ళు వెనక్కి వెళ్ళినా, పక్కలో బళ్ళేలు లేకుండా వుండడం మాకు సమ్మతమే--అని మనం అంటే?

ఇదిగో—ఇలాంటివాళ్ళ గురించే శ్రీ సూర్య ప్రకాష్ వ్రాసింది!

ఇలాంటివాళ్ళని దేశ సరిహద్దులవరకూ తరిమి కొడితే తప్ప………!

Tuesday, January 27, 2009

నిర్వాకాలు

మన ప్రభుత్వాల నిర్వాకాన్ని గమనించండి!

ఈ రోజుకూడా, (మన మాజీ విత్త), హోం మంత్రి పాకిస్థాన్ ని హెచ్చరిస్తున్నాడు—“మరోసారి ఇలాంటి సాహసం చేస్తే, పరిణామాలు తీవ్రంగా వుంటాయి!” అని! (ముంబాయి దాడుల విషయంలో)
ఇదెలాగుందంటారు?

“నేను లేస్తే మనిషిని కాను! తెలుసా?” అన్నట్టు లేదూ?

 1947 లో పాక్ దాడి లో 30,000 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని కోల్పోయిన విషయాన్ని భారత్ మరిచిపోకుండా ఉండి ఉంటే, 1965 యుద్ధం జరిగి వుండేది కాదు!

 1965 యుద్ధానంతరం మనం స్థిరంగా ధైర్యంగా వ్యవహరించివుంటే, 1971 లో మన మీద దాడి చేయగల సాహసానికి పాక్ ఒడిగట్టి ఉండేదే కాదు!

 1971 నాటి యుద్ధం దరిమిలా, 93,000 మంది పాక్ యుద్ధ ఖైదీలు మన చేతుల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా కొరడా ఝళిపించి వుంటే, 1999 లో కార్గిల్ దురాక్రమణకి పాక్ కలలో కూడా దిగి వుండేది కాదు!

 కార్గిల్ చొరబాటుని భారత్ మరిచిపోయి వుండకపోతే, 2001 లో భారత పార్లమెంట్ పై దాడి జరిగి వుండేది కాదు! ఆ దాడినీ భారత్ మరిచిపోయి పాక్ ని క్షమించి వుండకపోతే,(కనీసం అఫ్జల్ గురు ని ఉరి తీసి వుంటే)(బ్రాకెట్లమధ్య వ్రాసినది నేను) ఇటీవలి ముంబాయి ఘోరం చోటు చేసుకునేదే కాదు!

ఈ మాటలతో యేకీభవించని పిచ్చి వెధవలెవరైనా వుంటారంటారా?

(ఇవి ఈనాడు 04-01-2009 నాటి ఎ. సూర్య ప్రకాష్ వ్యాసంలోని మాటలు.)

మరి ‘ఏ బూచి’ కి భయ పడ్డాయి మన ప్రభుత్వాలు?

ఇంకెవరు? మన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగీరేసులు, పుట్టించి, పెంచి, పోషిస్తున్న ప్రత్యేక జాతి ‘ముస్లిం సోదరులు’ అనే ఓటు బ్యాంకు అనే బూచి కాదా?