Wednesday, September 28, 2011

కబుర్లు - 75

అవీ, ఇవీ, అన్నీ

"ఆండిముత్తు రాజా"....ఇంత సత్యసంధుడని యెవరూ అనుకోలేదు! ఆయన చెప్పినవన్నీ 'సత్యాలే' అని ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి.

మొన్న ఆగస్ట్ 24న ఆయన కోర్టులో యేమన్నాడో చదవండి--"2జీ స్పెక్ ట్రం ద్వారా ప్రభుత్వానికి యెలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ విషయాన్ని ఋజువు చేసేందుకు ప్రథాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం, ప్రస్తుత టెలికం మంత్రి కపిల్ సిబల్ లను విచారించాలి.....నష్టం వాటిల్లలేదని ప్రథాని, ప్రస్తుత టెలికం మంత్రి పార్లమెంటులోనే ప్రకటించారు. వాళ్లని విచారిస్తే, నష్టం వాటిల్లలేదు అని ఋజువు అవుతుంది. అప్పుడు నామీద కేసేలేదు!" అన్నారు!

ఇప్పుడు వరుసగా బయటికి వస్తున్న "నోట్"లూ, లేఖలూ వగైరాల వల్ల, అంతా ప్రథానికీ, చిదంబరం కీ, ప్రణోబ్ కీ, తెలిసే జరిగింది అని నిరూపితమవుతోంది.

(ఇవి బయటపడడం కూడా స హ చట్టం వల్లేనట! జనలోక్ పాల్ అంటేనే ఈ మంత్రులందరూ యెందుకు వుచ్చలుపోసుకొంటున్నారో అర్థం అవుతోంది కదా?)

బుకాయింపుల పర్వం బాగానే సాగుతోంది. "మా అతివిలువైన సహచరుడు" ని అరెస్టు చెయ్యక్కర్లేదు, విచారించక్కర్లేదు అంటాడొకడు. మా నోట్ గురించి, 'నిపుణుల అభిప్రాయం' తీసుకున్నాకే మాట్లాడతానంటాడు పైగా!

నికమ్మా ప్రథాని అయితే, ఆయనమీద నాకు పూర్తి నమ్మకం వుంది అంటాడు....యెవడడిగాడనో! కాయితాలమీద వున్న విషయం గురించి మాట్లాడమన్నారుగానీ, నీకు యెవరిమీద నమ్మకాలున్నాయి అనడిగారా?

సంకీర్ణధర్మం పేర, అందర్నీ వీలైనంత దోచుకోడానికి చూసీ చూడనట్టు వ్యవహరించడం అనే నేరం చేశారాలేదా? అనడుగుతున్నారు! కరుణానిధికి, "మా తమిళనాడు మంత్రులెవరూ (యేపార్టీ వాళ్లయినా) రాజీనామా చెయ్యాల్సిన అవసరం లేదు. చెయ్యరు." అనే ధైర్యం వాడికి యెలా వచ్చింది?

"ప్రతిపక్షం మధ్యంతర యెన్నికలు రుద్దడానికి ప్రయత్నిస్తోంది(ట)!" వొద్దుబా....బూ! యే యెన్నికలూ వద్దు...మంత్రులందరూ జైళ్లలో కూచున్నా; ఆఫీసులకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నా, పరిపాలనంటూ లేకపోయినా, రైళ్లూ బస్సులూ నడవకపోయినా, యెవరెలా పోయినా, యెన్నికలు మాత్రం వద్దు! మీ కుర్చీలు మీరు వదలొద్దు. అంతే!

ఒక్క నోటీసుతో, దిమ్మతిరిగి పట్టపగలే చుక్కలు కనిపించి, లిఖితపూర్వకంగా క్షమాపణ అడిగాడట--అన్నా హజరేని 'నువ్వు నిలువెల్లా అవినీతిపరుడివి ' అని దూషించిన మనీష్ తివారీ అనే ఓ కాంగీ అధికార ప్రతినిధి! చిరునవ్వుతో క్షమించేశాడట అన్నా! ఇంకెవరెవరు యేమేమి అంటారో చూడాలి.

సినిమాలో తప్ప బయట యెక్కడా వినిపించని పాటలు వున్నట్టు, యెవరూ పట్టించుకోని వార్తలు కొన్ని వుంటాయి--అవి యెంత ముఖ్యమైనవైనా!

ప్రభుత్వం వివిధ సందర్భాల్లో "స్వాధీనం చేసుకున్న ఆయుధాలు" గత పాతికేళ్లలో, 750 మంది "ఎం పీ" లు "కొనుక్కొన్నారు"ట! (ఇది కూడా స హ చట్టం క్రింద ప్రభుత్వం వెల్లడిచేసిన రహస్యమేనట!)

అలాంటి ఆయుధాలని, "సిట్టింగు" ఎంపీలకు మాత్రమే, మొదట అడిగినవారికి మొదట ప్రాతిపదికన "విక్రయించవచ్చు" అని రూలట!

అలా కొనుక్కున్నవాళ్ల లిస్టులో కొన్ని పేర్లు చూడండి.....యూపీ ముఖ్యమంత్రి మాయావతి; కాంగీ నేత జనార్దన్ ద్వివేది; భాజపా నాయకుడు షానవాజ్ హుస్సేన్; కేంద్ర మంత్రులు జయంతీ నటరాజన్; ప్రణీత్ కౌర్; విన్సెంట్ పాలా; మాజీ యెన్నికల ప్రధానాధికారి ఎమ్మెస్ గిల్; ప్రస్తుత సీ ఎం లు భూపీందర్ సింగ్ హుడా; శివరాజ్ సింగ్ చౌహాన్; ఇంకా నాయకులు జగదీష్ టైట్లర్; వీకే మల్ హోత్రా; మదన్ లాల్ ఖురానా; సజ్జన్ కుమార్; సీపీయెం సీనియర్ నేత సుభాషిణీ ఆలీ; ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీలు అతీక్ అహ్మద్; సురేష్ కల్మాడీ; బాబూభాయ్ కటారాలు కూడా అలా కొనుక్కొన్నారట!

మరి వీళ్లకి ప్రజలడబ్బు తగలేసి జడ్ కేటగరీ; జడ్ ప్లస్; జడ్ ప్లస్ ప్లస్ అంటూ భద్రత కల్పించడం యెందుకో?

పోనీ ఆ విషయం ప్రక్కన పెట్టినా; వాళ్లలో యెంతమంది మళ్లీ ఆ ఆయుధాలని ఇతరులకి యెన్ని లక్షలకి విక్రయించారో; ప్రస్తుతం అవి యెవరిదగ్గర వున్నాయో, వాటికి లైసెన్స్ లు వున్నయోలేదో, మళ్లీ అవి యెప్పుడైనా స్వాధీనం అయ్యాయేమో--ఇలాంటి సమాచారం కోసం యెవరైనా ఇంకో స హ దరఖాస్తు చేశారంటారా? చేసే వుంటారు.....!

ప్రథాన యెన్నికల కమీషనరుగా ఎస్ వై ఖురేషీ నియామకమే తప్పుడు వ్యవహారం అన్నారందరూ.

ఇప్పుడు వాడేమంటున్నాడో చూడండి.....హజారే అన్నట్టు ఎంపీల రీకాల్ భారత్ లాంటి పెద్ద దేశం లో ఆచరణ సాధ్యం కాదుట. వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారవుతుందిట. అనేక సమస్యలకి దారి తీస్తుందిట. అలాగే, అభ్యర్థులందరినీ తిరస్కరిస్తున్నాం అని బ్యాలెట్లో ఆప్షన్ ఇస్తే కూడా బోళ్లు సమస్యలు వచ్చేస్తాయట.

ఒకవేళ వోటర్లందరూ అందరు అభ్యర్ధులనీ తిరస్కరిస్తే, యేం చెయ్యాలి అనే సమస్య వస్తుందిట! ఇంటింటికీ తిరిగి చేసే ప్రచారం కూడా మంచిది కాదుట!

పెద్ద దేశం అని యెన్నికలు నిర్వహించడమే మానేస్తామా? వీడి సందేహాలకి చిన్నపిల్లాడు కూడా సమాధానాలు చెప్పగలడు. అయినా సమస్య వచ్చినప్పుడు యేంచెయ్యాలో ఆలోచించచ్చుగా? ముందునుంచీ అన్నీ వ్యతిరేకించడం యెందుకు? "అమ్మ చెప్పిందీ......" గనుకా?

సకలజనుల సమ్మెవల్ల యెవరికైనా యేదైనా మేలు జరిగిందో లేదోగానీ, పరోక్షంగా కొందరికి మేలు జరిగిందేమో అనిపిస్తూంది! యెందుకంటే, "ఏపీబీసీఎల్" డిపోల నుంచి దుకాణాలకి మద్యం సరఫరా నిలిచిపోయిందట! మొత్తం 38 డిపోలుంటే, అందులో 17 తెలంగాణాలో వున్నాయట! అవి మూతపడడంతో, ప్రక్క జిల్లాల నుంచి యెలాగోలా తెప్పించి సరఫరా చేసినా, యేమాత్రం సరిపోవడం లేదట! ఇంక అది కూడా సాధ్యం కాకపోవడంతో, "ప్రభుత్వానికి కోట్లలో నష్టం వస్తూంది....."అనిమాత్రమే....చింతిస్తున్నారట ప్రభుత్వం వారు!

మొన్న జేపీ ఢిల్లీలో అదేదో సంఘం ముందు తన అభిప్రాయాలు వెల్లడించాక, తను చెప్పిన విషయాలు మీడియాకి వెల్లడిస్తే, ఆయన చెప్పిన వాటితోపాటు, "జనలోక్ పాల్" ఓ రాజ్యాంగేతర శక్తి అవుతుంది అనికూడా అన్నాడు అని రిపోర్టు చేశారు--ఈనాడుతో సహా! నిన్న ఆయన నేను అనని మాటలని మీడియా వాళ్లు కావాలనే ప్రచారం చేశారు అన్నాడు! నమ్ముదాం మరి.

వీళ్లకి పదవులివ్వడమే దండగ అనుకొంటే, ప్రతీ వూళ్లోనూ వాళ్లకి సన్మానాలూ, పేపర్లో శుభాకాంక్షల ప్రకటనలూ, కత్తో, గదో, కిరీటమో, యెద్దుకొమ్ములో బహూకరించడాలూ.....ఇవన్నీ అవసరమా??

యేమంటారు?

Wednesday, September 21, 2011

కబుర్లు - 74

అవీ, ఇవీ, అన్నీ

బస్సుల్లో రిజర్వేషన్లకి వెయిటింగ్ లిస్ట్, సగం మంది మిగిలినా ఇంకోబస్సూ--ఇలా సంతోషించినంతసేపు పట్టలేదు--మళ్లీ మెలికలు పెట్టారు. ఇలా ప్రత్యేకంగా వేసిన బస్సుల్లో 50శాతం రుసుం అదనంగా వసూలు చేస్తారట! గరుడ బస్సుల్లో వెయిటింగులిస్ట్ అంటూ 5 టిక్కెట్లే ఇస్తారట. అలా 20 మంది దాటినా గరుడ బస్సులని మాత్రం ప్రత్యేకంగా వేయరట! మరి కేన్సిలేషన్లేవీ లేకపోతే, వెయిటింగ్ లిస్ట్ వాళ్ల గతేమిటో! సూపర్ లగ్జరీలకి అయితే, వాళ్లకి యే బస్సులో సీటు కేటాయించారో, ఎస్ ఎం ఎస్ పంపిస్తారట!

Indian Minerva పొరపాటున Indianrailways.gov.in లోకి వెళ్లి వుంటారు.

అనేకసార్లు "వెబ్ పేజ్ నాట్ అవైలబుల్" అని, యెప్పటికో వోపెన్ అవుతుంది. వెబ్ సైట్ ప్రారంభమైనప్పటినుంచీ, దాదాపు మూడునెలలకిపైగా "ఈ టికెటింగ్ ఫెసిలిటీ హేస్ బీన్ టెంపరరిలీ స్టాప్డ్...." అనే చూపిస్తోంది.

మిగిలిన ప్యాసెంజర్ సర్వీసెస్ లో, జర్నీ ప్లానర్, పీ ఎన్ ఆర్ స్టేటస్, ఎరైవల్/డిపార్చర్ లు బాగానే పని చేస్తాయి మన అదృష్టం బాగుంటే!

టికెట్ రిజర్వేషన్ కి మాత్రం ఇంకా ఐఆర్ సీటీసీనే బాగుంది.

మొన్ననే, కి కు రె మన రాష్ట్రంలో "స్త్రీనిధి" అని ఓ బ్యాంకులాంటిది--1098 కోట్లతో ప్రారంభించాడు. దీని వుద్దేశ్యం--డ్వాక్రా సంఘాల సభ్యులు, సూ ఋ సంస్థల బారిని పడకుండా, తమకి తామే అప్పులు ఇచ్చుకొంటూ, తీర్చుకొంటూ 'అభివృధ్ధి' చెందడానికట.

మరి అభివృధ్ధికల్లా మూలం యేమిటి? ఇంకేమిటి--రాష్ట్ర వ్యాప్తంగా 925 సంఘాలకీ, 925 కోట్లతో "కమ్యూనిటీ" భవనాల నిర్మాణం(ట). మిగిలే కోట్లతో, ఒక్కో సభ్యురాలికీ రూ.15,000/- మాత్రమే ఋణంగా ఇవ్వడం(ట).

లక్షల్లో అప్పులుచేసి, బంగారాలు కొనేసి, వాయిదాలు కట్టడానికి మళ్లీ వాటిని "ముత్తూట్"; "మణుప్పురం" లలో తనఖాపెట్టి, అవీ తీర్చలేక, ఇవీ తీర్చలేక కాదూ--మహిళలు విషవలయం లో చిక్కుకున్నది? వీళ్లకి 15 వేలు యేమూలకి?

ఇంక "వాళ్లేమో" బంగారాన్ని కరిగించేసి, లక్ష్మీదేవి బొమ్మతోనూ, మేరీమాత బొమ్మతోనూ.....ఇలా నాణాలు తయారుచేయించి, (అప్పట్లో తక్కువరేటుకి 'పడేసుకొన్న' బంగారాన్ని, ఇప్పటి యెక్కువరేటుతో అమ్ముకొని,) కొన్ని వందల కోట్లు కేరళకి తరలించుకుపోతున్నారు! ఆర్బీఐ యేమో ఇప్పుడు "ఎన్ బీఎఫ్ సీ"లకి కొన్ని నిబంధనలు విధించడం గురించి ఇంకా 'ఆలోచిస్తూంది!'(ట).

సరేలెండి. బాగానే వుంది కదా.

ఇంక, ఓ "క్రీడాధికారి" మొన్నంటాడూ--క్రీడలకి 'ఇతోధిక' ప్రోత్సాహం ఇవ్వడానికి, 923 కోట్లో యెంతో పెట్టి, అన్ని గ్రామాల్లో, "క్రీడా ప్రాంగణాలు" నిర్మిస్తారట! (ప్రాంగణాలంటే స్టేడియం లు కాదట--ప్రత్యేక భవనాలేమో!)

ఇంకో మంత్రంటాడూ, యేలూరులో యెప్పుడో నిర్మించిన "స్టేడియం" శిధిలమైపోయింది, దాన్ని త్వరలో, కొన్ని కోట్లతో  పునర్నిర్మిస్తాము అని! (ఆ స్టేడియం నిర్మించాక ఒకటో రెండో రంజీ మ్యాచ్ లు తప్ప, అక్కడ యేక్రీడా జరగలేదు--మదన కామ క్రీడలు తప్ప!)

యెవరూ 1000 కోట్ల గురించి మాట్లాడడంలేదు చూడండి! అలా మాట్లాడితే, సీబీఐ వాళ్లు వెంట తరుముతారో యేమో ఖర్మ!

అసలు  ఈ రానాలు మట్టినీ, ఇసుకనీ, సిమెంటునీ, కంకరనీ ఇలా తినేసి, అరిగించేసుకొంటూ, పొట్టలు పెంచేసుకొంటూ వుండగా, గాలో యెవడో ఇనుముని డెభ్భైనాలుగో యెన్నో కిలోల బంగారంగానూ, 23 యెన్నో కోట్ల నగదుగానూ మార్చుకున్నాడని యేడవడం యెందుకు???!!!

ఇంక మన ఆర్ టీ యే లగురించి యెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దశాబ్దాల క్రితమే "బ్రోకర్ల" వ్యవస్థ రద్దు చేసినా, మనం యేదైనా పనిమీద అక్కడికి వెళితే, అక్కడ అసలు వుద్యోగులు వుండరు--వాళ్లు నియమించుకున్నవాళ్లు వాళ్ల పని చేసేస్తూ వుంటారు. వాళ్లు "మీ బ్రోకరు యెవరు? అతన్ని పంపించండి" అంటారు. అక్కడి "హెల్ప్ డెస్క్"లు బ్రోకర్లకీ, వుద్యోగులకీ మధ్య సూపర్ బ్రోకర్లుగా మారాయి!

ఇంక, కోట్లతో టెస్ట్ ట్రాక్ లూ, సిమ్యులేటర్లూ యేర్పాటు చేస్తున్నాం, ఆన్ లైన్ లో అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటారు గానీ, కొన్ని వందల ట్రాఫిక్ సిగ్నల్స్ లో యే రెండో మూడో అడిగి, లైసెన్స్ ఇచ్చేస్తారు! కొన్న బైక్ స్పీడ్ యెంత, సరిగ్గా బ్రేక్ వెయ్యగలడా, పార్కింగ్ చెయ్యడం వచ్చా, ఓవర్ టేకింగ్ యెలా చేస్తున్నాడు--ఇలాంటివన్నీ పరీక్షించరు! అలా జరిగి వుంటే, ఓ "అయాజ్" బలయి వుండేవాడుకాదు పాపం!

అన్నట్టు మన గవర్నరు గారు, స హ చట్టం మంచిదే గానీ, అది దుర్వినియోగం అయిపోతోంది....దానిపేరు చెప్పి అధికారులని బెదిరించేస్తున్నారు....అని వాపోయారట! తోలుమందం అధికారులని అలా "బ్లాక్ మెయిల్" చేసినా తప్పులేదంటాను నేను. మరి ఆయనకి అంత బాధ యెందుకు వచ్చేసిందో!

   

Tuesday, September 20, 2011

కబుర్లు - 73

ఆవీ, ఇవీ, అన్నీ

(పేర్ల మార్పుల గురించి)-- ఇంకా, వుత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం "వుత్తరాంచల్" ని 2007 లో "వుత్తరాఖండ్" గా మార్చారట. ఆంచల్ అన్నా, ఖండ్ అన్నా భాగమేకదా? మరి ఇదెందుకో!

పాండిచ్చేరి పేరుని సుమారు 130 యేళ్లు పాలించిన ఫ్రెంచి వాళ్లు పెట్టారుట. దాన్ని తరువాత పుదుచ్చేరి (కొత్త గ్రామం) అని మార్చారట. ఆ గ్రామం అసలు పేరు అదేననీ, దాన్ని పలకడం ఫ్రెంచివాళ్లు పాండిచ్చేరి అనేవారనీ చెప్పలేదెందుకో! 

"ఆస్సాం" ని అసోం గానూ, "ఓరిస్సా"ని ఒడిశా గానూ మార్చారు. గుజరాత్ లోని "వడోదర" పట్టణాన్ని, ఆంగ్లేయులు నోరు తిరగక, బరోడా అని పిలిచారట. దాన్ని తిరిగి 1974లో వడోదర గా మర్చారట. "వటోదర" అంటే మర్రిచెప్పు పొట్టలొంచి పుట్టిన పట్టణమట! 

కేరళలోని "త్రివేండ్రం" ని అనంత పద్మనాభుని పేరిట, తిరువనంతపురంగా మార్చారట. (అంతకు ముందు దాన్ని "తిరువాన్‌కూరు" అనీ, ఇంగ్లీషువాళ్లు "ట్రేవన్‌కూరు" అనీ; ఇప్పటికీ ఆ రాజులని, వాళ్ల సంస్థానాన్నీ "తిరువాన్‌కూరు" సంస్థానం అనీ యెందుకు వ్యవహరిస్తున్నారో, ఆపేర్లు "గాలికి" యెందుకు కొట్టుకుపోయాయో; కొట్టుకుపోకుండా యెందుకు వున్నాయో--యెవరైనా చెప్పగలరా? జయలలిత తన పేరుని జయలలితా అనే వ్రాయమంటే జీ హుజూర్ అన్న మీడియా, పురందరేశ్వరిని--పురంధేశ్వరి; పురంధరేశ్వరి; పురంధ్రేశ్వరి అనీ ఇలా ఇష్టం వచ్చినట్టు వ్రాయడం యెందుకో--అందుకే!)  

ఇంకా అక్కడి "కొచ్చిన్" ని కొచ్చి గానూ; "కళ్ళికోట" కాలికట్ గా మార్చబడ్డ పట్టణాని కోజికోడ్ అనీ; "అలెప్పీ" ని అళప్పుజ గానూ మార్చారట. తమిళనాడులోని "కంజీవరం" ని కాంచీపురంగానూ, "కేప్ కోమరిన్" ని కన్యాకుమారిగానూ మార్చారట. 

ఇంక మన రాష్ట్రంలో 1970లో ఒంగోలు జిల్లా యేర్పడిందిట. దాన్ని 1972లో ప్రకాశం జిల్లాగా మార్చారట. 

1978లో హైదరాబాదు "రాష్ట్రం" హైదరాబాదు రూరల్; హైదరాబాదు అర్బన్ అనే రెండు జిల్లాలుగా విడిపోతే, రూరల్ కి కొన్ని ఇతర ప్రాంతాలు కలిపి, అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మామగారైన "కే వీ రంగారెడ్డి" జిల్లాగా మార్చారట. అది ఇప్పుడు "రంగారెడ్డి" జిల్లాగా వ్యవహరించబడుతూంది. (ఆయన ప్రఖ్యాత "పిడతల రంగారెడ్డి" కాదు). 

ఇటీవల నెల్లూరు జిల్లాని "పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా" అని మార్చారట. ఇంకానయం, "మనుమసిధ్ధిపాలించిన విక్రమసిమ్హపురం అనే నెల్లూరుని మార్చిన పొట్టి శ్రీరాములు జిల్లా" అనలేదు! 

ఇంకా మొన్నమొన్న, కడపజిల్లా పేరుని "వై ఎస్ ఆర్ కడప జిల్లా" అని మార్చారట! (డిటో....దేవునిగడప అనబడిన కడప అనబడిన వై ఎస్.....అనలేదు!) 

అసలు విషయమేమిటంటే, రాష్ట్రాలు యెన్ని పేర్లు మార్చినా, కొన్ని అప్పటప్పటి "ఆక్ట్"లకి లోబడి, పేర్లు మార్చడం అసాధ్యమట! అందుకే, "బోంబే హైకోర్టు"; "బోంబే స్టాక్ ఎక్స్చేంజి"; "మెడ్రాసు హైకోర్టు"....ఇలా కొనసా....గిస్తున్నారట! 

ఇవన్నీ బాగానే వున్నాయిగానీ, "అల్లాహ్"ఆబాద్; "ఔరంగ్"ఆబాద్; "హైదర్"ఆబాద్; "సికిందర్"ఆబాద్; "నిజాం"ఆబాద్; "ఆదిల్"ఆబాద్;  "తుగ్లక్"ఆబాద్ వగైరాలనీ; "వరంగల్"; "కరీం"నగర్ ఇలాంటి వాటినీ యెందుకు మార్చరు?! (మారిస్తే, కాంగీవారి ఓ జాతికి చెందిన సోదరులు ఆగ్రహిస్తారనీ, వోట్లు వెయ్యరనీ భయమా?! యేమో! మీరే చెప్పాలి.

మిగతా......మరోసారి!

Saturday, September 17, 2011

కబుర్లు - 72

అవీ, ఇవీ, అన్నీ

ఇంక పేర్లమార్పు గురించి మొన్న (11-09-2011) ఈనాడు ఆదివారంలో ఓ వ్యాసం వచ్చింది. 

పోర్చుగీసువాళ్లు వాళ్ల భాషలో, "బోం బహియా" (మంచి తీరం) అని పిలిస్తే, అది "బోంబే" గా మారిందనీ, స్థానికులు పూజించే "ముంబాదేవి" పేరుమీద దాన్ని 1996లో "ముంబాయిగా" మార్చారు అనీ వ్రాశారు. (మొదటిదానికి ఆథారాలేమిటో నాకు తెలీదు).

మద్రాసు అసలుపేరు "మదరాసు" అనీ, ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు అక్కడికి వచ్చాక, సమీపంలో స్థానికులు "చెన్నపట్టణం" యేర్పాటు చేసుకున్నారు అనీ, దాన్నే తమిళులు "చెన్నై" అనేవారనీ, తరవాత, ఆ రెంటినీ కలిపి, మద్రాసు అనే వ్యవహరించేవారు అనీ, తరవాత తమిళతంబిలు దాన్ని "చెన్నై" గా మార్చారు అనీ వ్రాశారు. 

"కాళీకా తా" అంటే కాళీమాత అని అర్థంట. ఆ పేరుమీదే కోల్కతా అని పిలిచేవారట. బ్రిటిష్ వాళ్లు దాని క్యాల్కట్టా అని పలికితే అదే స్థిరపడింది. 2001 లో దాన్ని "కోల్కత్తా" అని మార్చారు మన బంగబంధులు. (వీళ్లకి అనవసరంగా "ఓకారాలు పెట్టడం" ఓ ఆనవాయితీ). దీనికి సంబంధించి ఓ తెలుగు జోకు:

కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ గా వున్న రోజుల్లో, ఓ బంగాయన ఇన్స్ పెక్షన్ కో దేనికో వచ్చి, రెడ్డిగారు ఆయన గదిలో లేకపోవడంతో, "వేరీజ్ రోమలింగారెడ్డి?" అని చిందులు తొక్కుతూంటే, అప్పుడే అక్కడికి వచ్చిన రెడ్డిగారు, "రోమలింగారెడ్డి, యోనివర్సిటీని వదిలి వెళ్లడులెండి!" అని సముదాయించాడట!

అలాగే, మన మంగళంపల్లివారు, దశాబ్దాలుగా మెడ్రాసులో వుంటూ, బాగా సాంబారు తాగడంవల్లేమో, నోరు బాగా సాగదీసుకొని, "పెలుకే బెంగారమాయెరా.....అందాల రేమ...." అని పాడతారు. పాపం అది ఆయన పధ్ధతి!

(ఇదంతా రోమాయణంలో పెడకలవేటలెండి!)

ఇక, బెండకళూరు--అంటే వుడికించిన బీన్స్ (దొరికే ప్రాంతం) కాబట్టి 14వ శతాబ్దంలో ఆ పేరు వచ్చిందిట. అప్పట్లో, హొయసల రాజు "బళ్లాలుడు" ఈ ప్రాంతంలో వేటకు వచ్చి, ఆకలితో అలమటిస్తుంటే, ఒకామె, ఆ బీన్స్ పెట్టిందట. అందుకాయన ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టాడట. (దీనికాథారాలు యేమిటో, తరువాత అది బెంకళూరుగాకాక, బెంగుళూరుగా యెందుకు మారిందో నాకు తెలీదు). దాన్నే ఇప్పుడు బెంగళూరు అని మార్చారు కన్నడ కస్తూరివారు.

నాకయితే, అటు టిప్పు సుల్తాన్ కీ, ఇటు బహమనీ సుల్తానులకీ, ఇటు బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీసు వాళ్లకీ అనేక "బెంగలు" కలిగించినందుకే దాన్ని "బెంగల వూరు" అన్నారనీ, అదే బెంగళూరుగా మారిందనీ ఓ నమ్మకం.

ఇంకా ఆ బళ్లాలుడి అరి అంటే శత్రువు స్థాపించిందే నేటి వార్తల్లో వున్న "బళ్లారి" అనీ, అక్కడ వున్న కోట నిన్నో, మొన్నో కట్టినంత క్రొత్తగా వుంటుంది అనీ నా వుద్దేశ్యం.

మిగతా........మరోసారి! 

Friday, September 16, 2011

కబుర్లు - 71

అవీ, ఇవీ, అన్నీ

నా కబుర్లు - 70 మీద ఓ అన్నోన్ వ్యాఖ్యానించారు--".....రద్దు అనగానే......'సూట్ కేసులు '....." అంటూ. 

నిజానికి ఇప్పుడంత సీన్ లేదండి! రెండేళ్లకి పైగా వ్రాయబడుతున్న టపాల లింకులని కొంతమంది సహృదయులు రైల్వే అధికారులకి పంపించీ, పేపర్లలో వాళ్లని కడిగేసేలా వ్యావాసాలు వచ్చీ, విజిలెన్స్ దాడులూ అవీ జరిగీ, ఇప్పటికి కొంత మంచి జరుగుతోంది. అందుకని, మనం నిర్భయంగా వుండొచ్చు.

ఇంక Indian Minerva, కబుర్లు బాగున్నాయి అంటూ, "విశేషాధికారాలు" గురించి, మిగతా విషయాలగురించీ వ్రాశారు.

మనరాజ్యాంగం, న్యాయసూత్రాలూ ప్రకారం, ఓ ముద్దాయికి "మరణ శిక్షని" ఖాయం అని ఓ న్యాయస్థానం తీర్పు ఇచ్చాక (అది దేశ అత్యున్నత న్యాయస్థానమే అవనక్కరలేదు.), ఆ ఖైదీ రాష్ట్రపతికి క్షమాభిక్షకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రపతి మళ్లీ ఆ దరఖాస్తుని కేంద్ర మంత్రివర్గానికి పంపించి, మీ అభిప్రాయం చెప్పండి అంటారు. 

అక్కడ జరుగుతోంది లండాచోరీ.

మనదేశ ప్రథమ ప్రథాని నెహ్రూ నుంచి, దేవెగౌడ గాడిదాకా, అక్కణ్నించీ మన్మోహన్ దాకా, అందరూ రోజుకి 18 గంటలూ, ఇంకా అత్యవసరమైతే 20 గంటలూ శ్రమపడినా, అంతకు ముందు నానవెయ్యబడిన "రోకళ్లు" యెంతవరకూ నానాయో చూసుకోవడం, ప్రతిరోజూ వచ్చే ఓ పదో యెన్నో రోకళ్లని క్రొత్తగా నానెయ్యడం లాంటి పనులకే ఆ సమయం సరిపోవడంలేదు!

ఇంక కేబినెట్ సమావేశానికి ఆ క్షమాభిక్ష దరఖాస్తు చేరాలంటే, ప్రథానమంత్రి కార్యాలయం నుంచి అది ప్రయాణిస్తూ, హోం శాఖద్వారా, న్యాయ శాఖ ద్వారా, అవసరమైతే విదీశీ వ్యవహారాల శాఖ ద్వారా....ఇలా ప్రయాణించి, చేరాలి.

తీరా అక్కడికి చేరేటప్పటికి, వాళ్లు మళ్లీ దీన్ని ఓ క్రొత్త రోకలిగా నానేస్తారు. అది చర్చకి వచ్చినప్పుడు, ఖైదీ యే అఫ్జల్ గురునో అయితే, మంత్రులకి తమ ఓజాతి సోదరులూ, రాజీవ్ హంతకులు అంటే మరోజాతి సోదరులూ, యే గ్రాహం స్టెయిన్ హంతకులో అంటే, ఇంకోజాతి సోదరులూ, యే తందూరి హత్యాపాతకులో అంటే, వేరేరకం సోదరులూ......ఇలా గుర్తుకు వచ్చి, "రోకలి నాననివ్వండి.....అప్పుడు చూద్దాం!" అనేస్తారు.

ఇలాంటి పెద్దకేసులు కాకుండా, యే ఫేక్షన్ హత్యల కేసో, పరువు హత్యల కేసో అయితే, రోకలి బాగా నానిన తరవాత, "మరణశిక్ష ఖాయం" అని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు.

ఆ దస్త్రం, మళ్లీ వైకుంఠపాళీలో నిచ్చెనలూ, పాములూ దాటుకుంటూ రాష్ట్రపతికి చేరినా, రాష్ట్రపతి కూడా--పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ, అనేక ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకొంటూ, విదేశ అతిథులని ఆహ్వానించడం, బహుమతి ప్రదానోత్సవాలూ, కాన్‌ఫరెన్సుల్లో 'పిలుపులు ఇవ్వడం ' లాంటి కార్యక్రమాలతో, రోజుకి 20 గంటలు పనిచేస్తూ, ఈ దస్త్రం దగ్గరికి రావాలా?

ఈ మధ్యలో, యెప్పుడో ఆదస్త్రం  మీద "ఫలానా తేదీలోపల, జైలువారికి అనుకూలమైన సమయంలో మరణశిక్ష అమలుపరచండి" అనే క్రింది అధికారి నోట్ మీద, రాష్ట్రపతి సంతకం అనే అఫీషియల్ రబ్బర్ స్టాంప్ పడుతుంది. రొటీన్ గా ఆ విషయం పత్రికలవాళ్లకి తెలియజెయ్యబడుతుంది.

అప్పుడు మళ్లీ, "ఆ శిక్ష మీద స్టే మంజూరు చెయ్యాలి" అంటూ పిటిషన్లు దాఖలు అవుతాయి--సుప్రీం కోర్టులో. డిఫెన్సు లాయరు యే రాం జేఠ్మలానీయో అయితే, వెంటనే స్టే లభిస్తుంది. ఆ కేసు, మిగిలిన కొన్నివేలకేసులతోపాటు, కొన్ని సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ పోతూ వుంటుంది!

యేతావాతా తేలేదేమిటంటే, కోటికి పడగెత్తిన ధనవంతుడైనా, అమానుషుడైన హంతకుడైనా, సామాన్యమానవుడైనా, వాడికి భూమ్మీద నూకలు పూర్తిగా చెల్లేంతవరకూ, శివుడాజ్ఞ అవదనీ, అప్పటివరకూ వాళ్లని చీమైనా కుట్టలేదనీ, మన రాజ్యాంగమూ, మనమూ అందరూ నిమిత్తమాత్రులమేననీ!

అదండీ సంగతి!  

మిగతా విషయాలమీద మరోసారి.

Thursday, September 15, 2011

కబుర్లు - 70

అవీ, ఇవీ, అన్నీ

రాజీవ్ హంతకులకి మరణశిక్షని నిలుపుదల చేస్తూ, మద్రాస్ హైకోర్టు స్టే విధించిందట మొన్నెప్పుడో. సుబ్రహ్మణ్యం స్వామి ఆ కేసుని తమిళనాడులో కాకుండా, వేరే రాష్ ట్రంలో విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టుకి వెళతానంటున్నాడు. 

అసలు వీళ్లందరూ మరిచిపోతున్నది--వాళ్లు ఒక్క రాజీవ్ హంతకులే కాదు--గొల్లపూడివారన్నట్టు, మారణహోమం సాగించి, మరో 17 మందినో యెంతమందినో (వాళ్ల పేర్లు కూడా దొరకడం లేదట ఇప్పుడు--ఇదీ ఆయనన్నమాటే!) పొట్టన పెట్టుకొని, కొన్ని పదులమందిని క్షతగాత్రులనీ, వికలాంగులనీ చేసినవాళ్లు అని! (వాళ్ల పేర్లగురించీ, వాళ్ల ప్రస్తుత స్థితిగురించీ తెలుసుకోడానికి యెవరూ ప్రయత్నించినట్టులేదు.)

మా చిన్నప్పుడు హైస్కూల్లో "బాయ్ స్కౌట్స్" "గర్ల్ గైడ్" శిక్షణలుండేవి. (సర్ బేడెన్ పౌల్ అనే ఆయన స్థాపించాడు స్కౌట్స్ ఆర్గనైజేషన్ ని.) ఆ శిక్షణలో భాగంగా, విరామ సమయల్లో "యెల్" అని కొత్త కొత్త రైమ్‌స్ లాంటివి నేర్పించేవారు. (యెల్ అంటే, "కేక"/"పిలుపు" అని అర్థం. అసలు మన తెలుగులో ఓ విచిత్రమైన పదం ఈ కేక. "సాయంత్రం సినిమాకి వెళతాను" అని ఒకడంటే, "నువ్వేళ్లేటప్పుడు కేక పెట్టరా, నేనూ వస్తాను" అంటాడింకోడు!)

ఇంతకీ ఒక యెల్ యెందుకో జ్ఙ్ఞాపకం వచ్చింది. అది:

వర్షమురానీ,
తుఫానురానీ,
ఆటలు ఆడగ,
పాటలు పాడగ,
తయారు మేన్!
హ హ్హ హ్హ హ్హ!

ఇప్పుడదెందుగ్గుర్తొచ్చిందంటారా! వస్తున్నా....అక్కడికే!

వర్షమురానీ,
తుఫానురానీ,
యెండలు మండనీ,
చలిపులి కొరకనీ,
హెలికాప్టరెక్కనునేను,
హ హ్హ హ్హ హ్హ!

అనేశాడు మన కి కు రె. ఇవాళ (15-09-2011) ప గో జి పర్యటనకి బయలుదేరి, ఓ ముష్టి జెట్ ఎయిర్ వేస్ విమానంలో రాజమండ్రి బయలుదేరితే, మధురపూడి విమానాశ్రయంలో మబ్బులు దట్టంగా వుండి, విమానం చాలాసేపు గాలిలో చక్కర్లు కొడుతూ, చివరికి హైదరాబాదు తిరిగివెళ్లిపోమని అదేశాలు అందిన మరుక్షణమే గ్రవుండ్ క్లియరెన్స్ దొరికి, మీడియావాళ్లు చాలాసేపు "వుత్కంఠగా" యెదురు చూసింతరవాత, సురక్షితంగా దిగిందట ఆ విమానం!

రేపణ్నించీ ఆయన "విమానాలు కూడా--జెట్ ఎయిర్లూ, స్పైస్ జెట్లూ, కింగ్ ఫిషర్లూ--యెక్కను" అని ప్రకటిస్తాడేమో!

అది కాదు విశేషం! 

రెండురోజులనించీ, సీ ఆర్ ఆర్ కాలేజీ గ్రవుండులో హెలీపాడ్ వద్ద "ట్రయల్ రన్ లు" చేస్తున్నారట. (రాజమండ్రి నుంచి యేలూరు హెలికాప్టర్లో రావాలి ఆయన!)

అదీ పెద్ద విశేషం కాదు.

"మంత్రి పితాని", సీ ఎంగారూ, పెద్ద నాయకులూ తరచూ యేలూరు వస్తూంటారు కాబట్టి, "శాశ్వత ప్రాతిపదికన" జిల్లాలోని ముఖ్యమైన పట్టణాల్లో హెలీపాడ్లు నిర్మించాలనీ, వాటికి అనువైన స్థలసేకరణ వెంటనే జరిగేలా చూడాలి అనీ, జిల్లా కలెక్టరు కి సూచించారట!!!!!!

బాగుందా??

అన్నట్టు, ఇవాళే మరోచోట ఇంకో ముఖ్యకార్యక్రమం జరగబోతోంది. "తమిళనాడు" లో (అసలు జనాలకి అలవాటైన పేర్లు మార్చేసి, కొత్తపేర్లు పెట్టవలసిన అవసరం యేమైనా వుందా? అనేది వేరే విషయం. ఓ నవాబుగారు ఓ పట్టణానికి "మహబూబ్ నగర్" అని పేరు పెట్టినా, జనాలు అప్పటికీ ఇప్పటికీ దాన్ని "పాలమూరు" గానే వ్యవహరిస్తున్నారు! మనుమసిధ్ధి పాలించిన "విక్రమసిం హపురం" అన్నా, ఆంగ్లేయులు పేరెట్టిన "కో కెనడా" అన్నా యెవరికైనా అర్థం అవుతుందా???) జయలలితా....తన యెన్నికల వాగ్దానాల్లో భాగంగా, అనేక స్థాయుల్లోని పాఠశాలల్లోని విద్యార్థులకి ఓ 68 లక్షల మందికి(!)--నిజంగా నిజం--ల్యాప్ టాప్ లు "వుచితంగా" అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారట! ఈ యేడాది 9 లక్షల 12 వేల "ఎల్ టీ" లు (అంటే ల్యాప్ టాప్ లు--లిబరేషన్ టైగర్స్ కాదండోయ్!) పంపిణీ చేస్తారట. మిగతావి వచ్చే "నాలుగేళ్లలో" అందజేస్తారట. 

మొత్తం ప్రాజెక్ట్ కి రూ.10,200 కోట్లు అవసరం అయితే, తొలివిడతగా రూ.912 కోట్లు కేటాయించారట. ఈ ఎల్ టీ లు ఈసీఐఎల్ అఫ్ తమిళనాడు కి అప్పగించారట.

ఓసారి నేను ఓ టపాలో--అంకోపరి ఒక్కొక్కటీ 35 వేలో యెంతో వుంటుందేమో అంటే, లక్షా ముఫై ఐదువేలు వుంటుంది అన్నాడో నిపుణుడు. మరి ఇప్పుడు 10/15 వేలకే యెలా అందిస్తున్నారో! (అండర్ ఇన్వాయిసింగ్ కాదుకదా?)

జూలై నెలలో భారీ యంత్రపరికరాల విభాగంలో "వ్యతిరేక" వృధ్ధి రేటు నమోదవడంతో, మొత్తం పారిశ్రామిక వృధ్ధి రేటు 3.3 శాతానికే పరిమితమయ్యిందట. కానీ నిపుణులు ఈ గణాంకాలు "నమ్మబుల్" గా లేవు అంటున్నారు!

మన ఆర్టీసీ వారికి బుర్రలో ఓ బల్బు మెరిసిందట ఇన్నాళ్లకి. బస్సులకి రిజర్వేషన్ చేసేటప్పుడు, ఓ బస్సులోని సీట్లు మొత్తం నిండిపోతే, వెయిటింగ్ లిస్ట్ లో కూడా రిజర్వ్ చేస్తారట. ఇంకోబస్సుకి సగం సీట్లు నిండినా, ప్రత్యేక బస్సు వేసి అందులో పంపిస్తారట. యేబస్సుకి రిజర్వ్ చేసుకున్నారో సరిగ్గా అలాంటి బస్సునే పంపిస్తారట. మరి "అలాంటి" బస్సులు సరిపడా తెస్తారా?

అలాగే, రైల్వే వాళ్లకి కూడా ఓ మెరుపు మెరిసి, తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ కి, వుదయం 8 నుంచి 9 వరకూ, యేజంట్ లాగిన్ రద్దుచేశారట! ప్రతీ రైల్వే జోన్ లో 200 నుంచి 500 మంది యేజంట్లు వున్నారట! ఇప్పుడు తత్కాల్ టిక్కెట్లు బాగానే దొరుకుతున్నాయట సామాన్యులకి. సౌత్ సెంట్రల్ రైల్వే లోనైతే యేజంట్ల వ్యవస్థ పూర్తిగా రద్దు చెయ్యాలని నిర్ణయించారట!

హమ్మయ్య!


   

Tuesday, September 13, 2011

కబుర్లు - 69

అవీ, ఇవీ, అన్నీ

ముకేష్ అంబానీ ముంబాయిలో "యాంటిల్లా" పేరుతో నిర్మించిన 27 అంతస్తుల నివాస భవనం లోని పనివాళ్ల సంఖ్య 600 ట. వాళ్ల జీతాలు ఒక్కొక్కరికీ 6000 నించి 6500 మధ్య వుంటాయట. 

(ఇంతకు ముందే 17 అంతస్తులో యెన్నో వున్న నివాస భవనం వుంది కదా, మళ్లీ ఇదెందుకు అని అడిగితే, ఇది మా సంస్థల వున్నతోద్యోగులకి అని జవాబిచ్చాడోసారి--ఈయనేనో, ఇంకో అంబానీనో.)

పుడితే--గాలి గనులతో సంబంధం వున్న ప్రభుత్వ శాఖల్లోనైనా, అంబానీల ఇళ్లలో పనివాళ్లగానైనా పుట్టాలని చాలామంది అనుకుంటున్నారట!

అరుంధతీరాయ్ అని ఒకావిడవుంది. (అధోగతీరాయ్ అని పేరుపెట్టారో బ్లాగరు ఈమెకి!). యెప్పుడో ఓ పుస్తకం వ్రాసి, అదృష్టం బాగుండో, పైరవీలు పనిచేసో దానికి ఓ ఎవార్డు సాధించింది. తరవాత చెయ్యడానికి పనేమీలేక, పేపర్లకి యెక్కుతూ, వుద్యమకారిణి అని వ్యవహరించబడుతోంది.

అన్నా హజారే వుద్యమం "ప్రపంచ బ్యాంకు అజెండా"కి నకలు అనీ, అలాంటి వుద్యమాలని "నిర్మించడానికి" ప్రపంచ బ్యాంకూ, ఫోర్డ్ ఫౌండేషన్ "నిధులు" అందజేస్తాయి అనీ, హజారేను "ఆరాధ్యుడు" గా ప్రచారం చేశారనీ, అది ఆందోళనకరమైన విషయం అనీ, ఆయన బృందం రూపొందించిన జనలోక్ పాల్ బిల్లు పైనా తనకి అనేక సందేహాలున్నాయి అనీ--రెచ్చిపోయిందట ఓ టీవీ ఛానెల్లో!

చూశారా--యెవరికీ తెలియని విషయాలని ఈవిడ యెలా కనిపెట్టి ప్రచారం చేసేస్తోందో? జనాలు వెర్రి పుచ్చకాయలు అనుకుంటారో యేమిటో ఇలాంటి కుహనా మేధావులు!

"కాస్త నదురుగా వున్న ఓ బ్లాగులో ఓ అడ్డమైన కామెంటు వ్రాసేస్తే, నాకు పాపులారిటీ వస్తుందని అలా చేశాను....నన్ను క్షమించండి" అన్నాడిదివరకో కుర్రాడు. ఆ కుర్రాడికీ, ఈవిడకీ తేడా యేమీ కనిపించడంలేదు నాకు.

మా వూళ్లో, గణపతి వుత్సవాల సందర్భంగా "రాష్ ట్ర స్థాయి సినీ డ్యాన్స్; పాటల పోటీలు" పెట్టారు! బహుమతులు వరుసగా, రూ.1500/-, షీల్డు; రూ.1000/-, షీల్డు; రూ.600/-, షీల్డు; ఇంకా "కన్సొలేషన్" ఇచ్చారట. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికీ రూ.50/- మాత్రమేనట. 

ఇంక యెలా నిర్వహించారో మీరే వూహించుకోండి! 

భక్తి వ్యాపారులూ--జిందాబాద్!

"చిరు" కాంగీలో విలీనం అయినా, "తనదైన ముద్ర" కోసం "వ్యూహాత్మకంగా" అడుగులు కదుపుతున్నాట్ట! ప్రత్యేకంగా ఓ క్యాంపు కార్యాలయం యేర్పాటు (అంటే--ఇంతకు ముందు ప్రరాపా ప్రథాన కార్యాలయం పేరు మార్పు!), త్వరలో ఒక టీవీ ఛానెల్ (దీనికి "ఎస్ న్యూస్" అని పేరు పెడతారట. "ఎస్" కి సంబంధించిన సెంటిమెంట్ యేమిటో మరి!) యేర్పాటు, వివిధ కేంద్రాల్లో "ప్రాంతీయ విలీన మహాసభలు" నిర్వహించడం (పనిలో పనిగా బలప్రదర్శనకి వాటిని వేదికలుగా వుపయోగించుకోవడం), ఇంకా ఓ న్యూస్ పేపరు పెట్టడం--ఇలా పడుతున్నాయట ఆ అడుగులు.

యెన్నికల ప్రచారంలోనూ, ఆ తరవాతా, పాటీయా....పిచ్చా....?రోజుకి ఓ అరలక్షమందికి తీర్థ ప్రసాదాలు (అనేక వెరయిటీల్లో) అందించి, కాటాకి వచ్చేసి, కాంగీలో చేరినందుకు వాళ్లు ఇచ్చిన (తొడుక్కునే) కోట్లు--ఈ పథకాలన్నింటికీ సరిపోతాయా? యేమో!

"స్వంత పనుల" నిమిత్తం మలేషియా ప్రయాణం కూడా పెట్టుకొన్నాట్ట.

ఇవన్నీ "అధిష్టానం" సీసీ కెమేరాల్లో రికార్డు అవుతున్నాయనీ, తోక కాదు--దానిలోని వెండ్రుకలు కదిలినా, తోక మొత్తం తెగిపోతుందనీ గుర్తుంచుకొంటాడా?

చూద్దాం!  

Sunday, September 11, 2011

కబుర్లు - 68

అవీ, ఇవీ, అన్నీ

"వేమన్న", పాపం తన జీవితమంతా "పరుసవేది" అన్వేషణలోనే గడిపి, తీరా అది పట్టుబడ్డాక విరాగి అయిపోయాడట!

టైము బాగుంటే, మట్టి పట్టినా బంగారం అయిపోతుందంటారు. అలాగే, యేల్నాటి శని సమయంలో బంగారం పట్టుకున్నా, మట్టి అయిపోతుందనీ అంటారు!

"ఇనుము" రాళ్లనీ, ఇనప "మట్టినీ" బంగారంగా మార్చే పరుసవేది విద్యని వంటబట్టించుకున్న గాలి జనార్దన రెడ్డి మాత్రం, "భక్తి" దాకానే వెళ్లాడు. భక్తికి పరాకాష్ట అయిన "వైరాగ్యం" చేరుకోకుండానే, కృష్ణ జన్మస్థానంలో వైరాగ్య బోధ జరిపించాలని ప్లాను వేశారు సీబీఐ వాళ్లు. (యెవరు ఆ యేర్పాటు చెయ్యమన్నారో ఇంకా తేలాల్సి వుంది).

పేపర్లూ, టీవీలూ హోరెత్తి పోతున్నాయి--"గని గజనీ స్వర్ణ విలాసం" వగైరాలతో!  

బాగుందండీ--ఆయనకి విద్య తెలిసింది, వుపయోగించుకున్నాడు. భక్తి పెరిగింది--ఇంట్లో పూజా సామాగ్రీ, దేవుళ్ల విగ్రహాలూ అన్నీ బంగారంతో చేయించుకున్నాడు. తిరుమలేశునికి ఓ కిరీటం కూడా చేయించాడు.

ఇప్పుడు, ఆ కిరీటం పెడితే, స్వామికి "శిరోభారం" వస్తుందేమో అని అనుమానం రావడంతో, దాన్ని ప్రక్కన పెట్టారట. దాన్నేం చెయ్యాలో ఇంకా నిర్ణయించలేదట! నిత్యాభిషేకాలతో ఆయనకి "పడిశం" పట్టడం లేదుకదా? మరి శిరోభారం యెందుకు వస్తుందో వాళ్లే చెప్పాలి!

(ఆమధ్య పంచారామాల్లోని శివలింగాలు అభిషేకాలతో "అరిగి" పోయాయని టీవీలు కోళ్లయి కూశాయి. ఫలితం హళ్లికి హళ్లి, సున్నకి సున్న! తిరుమలేశుడు "అరిగి"పోతున్నాడని నేనంటే, మూలవిరాట్టుకి అభిషేకాలు చెయ్యం అన్నారు. అమలవుతోందో లేదో మరి! ముసలాన్ని యెంత అరగదీసినా, ఓ బాణం పుల్లంతైనా మిగలదా--ఫరవాలేదులెండి--అనేవాళ్లూ వున్నారు.)

స్వామికి ఆభరణాలు చేయించదలుచుకున్నవాళ్లు, ముందు తితిదేవారిని సంప్రదించి, వారి అనుమతితో "కొలతలు తీసుకొని", ఆభరణాలు చేయించి మరీ సమర్పిస్తారు. ఈ తతంగం నడిచినప్పుడూ, తిరుమాడ వీధుల్లో కిరీటాన్ని, దేవుడి కన్నా ముందో ప్రత్యేక వాహనమ్మీద  వూరేగించినప్పుడు, ఆయన బిల్లులు ఇవ్వలేదు అని యెవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన 45 కోట్లన్నాడు, మదింపుచేసింది 22 కోట్లు మాత్రమే అంటున్నారు!

కొంచెం తేడా అనిపిస్తే, ప్రతీవాడూ "నన్ను ముట్టుకోకు నామాల కాకీ" అనేవాడే!

మరణశిక్షల్ని రద్దు చేయాలంటున్నారు "సమయానుకూల" వాదులు. నిజానికి, మరణ శిక్ష పడి, అది యెప్పుడు అమలు చేస్తారో తెలియకపోవడం, దినదిన గండంగా బ్రతకడం అనేది, రౌరవాది నరకాలని మించిన శిక్ష! అలాంటిది, యేళ్లతరబడీ క్షమాభిక్ష విఙ్ఞప్తులని, యేవిషయం తేల్చకుండా, జాగు చేసిన, మన సర్వోత్తమ రాజ్యాంగాధినేతలకి యేమిటి శిక్ష? (బహుశా అంబేద్కర్ కి ఈ విషయంలో యెలాంటి కనీస అనుమానం కూడా రాలేదు. వచ్చివుంటే, ఆ శిక్షకి తగ్గ యేర్పాటు చేసి వుండేవాడు రాజ్యాంగంలోనే!)

"అమాయకుల్ని చంపడానికి యేమతమూ అంగీకరించదు. ఢిల్లీ హైకోర్టు వద్ద బాంబు ప్రేలుడు--ఆటవిక చర్య" అన్నాట్ట--యెవరోకాదు పార్లమెంటు మీద దాడిలో కొంతమందిని విచక్షణారహితంగా కాల్చేసి, వురిశిక్షపడి, "నన్ను వురితియ్యండ్రా మొర్రో! లేకపోతే, అద్వానీ ని ప్రథాని చెయ్యండ్రా! ఆయనైతే నన్ను క్షణాల్లో వురి తీయించేస్తాడు!" అని మొరపెట్టుకొన్న "అఫ్జల్ గురు"!

ఇప్పటికి వాడి మతబోధలు వాడి తలకెక్కాయనుకుందామా? లేక....!

"వురుమురిమి, మంగలం మీద పడిందట!"

పాపం రోశయ్య, తాను ముఖ్యమంత్రిగా వుండగా, "అన్ని విషయాలూ అధిష్టానం (అమ్మ) చూసుకొంటుంది. నేను నిమిత్తమాత్రుణ్ని" అంటూ, ఖర్మకాలి, ఓ నిర్ణయం తీసుకొన్నాడట తనంత తానే!

ఇప్పుడదే మెడకు చుట్టుకొనేలా వుంది. ఓ లాయరెవరో "యేసీబీ వారు రోశయ్యకి క్లీన్ చిట్ యెలా ఇచ్చారు?" అంటూ యేసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు కేసు వేస్తే, క్లీన్ చిట్ కి సంబంధించిన ఆధార పత్రాలని సమర్పించమన్నారట. యెటుపోయి యెటు వస్తుందో! ఈ వయసులో గవర్నర్ గారిని అంత క్షోభ పెట్టడం అవసరమా జగన్నాథులూ? (అవునులే, నాన్న ప్రసాదాన్ని గ్రద్దలా తన్నుకుపోయాడుగా మరి!)

ఆధారమంటే మళ్లీ గుర్తొచ్చింది--బెంగుళూరులో "ఆథార్" గురించి ఇదివరకో టపా వ్రాశానుగా....ఈమధ్య "ఫణిబాబుగారు"--తమ ఆథార్ వివరాల సమర్పణ త్వరలోనే ముగిసిందని ఓ టపా వ్రాస్తే, ఆహా! అని సంతోషించాను. (బాబుగారూ! మీ అనుమతిలేకుండా, మీ పేరు వాడుకోవడం కోసమే ఇక్కడ మీ ప్రస్తావన తెచ్చానని భావించక, క్షమించండి!).

నిన్న (10-09-2011), విజయవాడ ప్రథాన తపాలా కార్యాలయంలో, ఈరోజు "ఆథార్ దరఖాస్తులని సాయంత్రం 5.30 కి" జారీ చేస్తామని "పక్షం" రోజులకి ముందే ప్రకటిస్తే, అప్పటికి ఓ 1500 మంది అక్కడికి చేరారట! వున్న వొకేవొక్క కవుంటరు తెరవగానే--తోపులాట, తొక్కిసలాట, ప్రథాన ద్వారం అద్దాలూ, పూలకుండీలూ ధ్వంసం, ముగ్గురికి అద్దమ్ముక్కల గాయాలు, ఓ వృధ్ధుడు సొమ్మసిలడం, వూపిరాడక అనేకమంది చిన్నారులూ, మహిళల ఆర్తనాదాలూ, ఇవన్నీ మూడు గంటలపాటు కొనసా....గడం, పోలీసులెవరూ లేకపోవడం, వెరశి--200 మందికి కూడా దరఖాస్తులు అందించలేకపోవడం........ఇదండీ జరిగినది!

ఆ ప్రకటన జారీ చేసినవాడెవడో, వాడికి--నేనిదివరకు "అజ్మల్ కసబ్"కి విధించమన్న శిక్ష --విధిస్తే, మీకేమయినా అభ్యంతరమా?!

ఆలోచించండి మరి!   

   

Thursday, September 1, 2011

కబుర్లు - 67



అవీ, ఇవీ, అన్నీ


నిన్నో, మొన్నో, బోధి వృక్షం క్రింద నిద్రించినట్టున్నాడు మన కి కు రె. చాలా బాగా ఙ్ఞానోదయం అయ్యింది ఆయనకి.

"రైతుకి కనీసం 70-80 శాతం ఆదాయం వస్తేగానీ, గిట్టుబాటుకాదు--ఆదిశగా 'కేంద్ర, రాష్ట్ర ' ప్రభుత్వాలు ఆలోచించకపోవడం తప్పే!" అంటున్నారు.

మరి తానూ ఓ రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశకుడూ, ముక్కుమంత్రీ అని మరచిపోయారా?

మన"సు" కవి చెప్పినట్టు, 'యెదటి మనిషికీ చెప్పేటందుకే నీతులు వున్నాయి" అందామా?

కరప్షన్ పితామహుడు కరుణ, మంచి సమయంలో వుద్యమం మొదలెట్టించాడు--వురిశిక్ష రద్దు చెయ్యాలి అని. (రేప్పొద్దున్న రాజాకీ, కనిమొళికీ వురి వేస్తారేమో అని భయమేమో! అదే కాకుండా, సాక్షాత్తూ "రాజీవ్" హంతకులకి ఆ శిక్ష పడింది కదా.....ఇంతకన్నా కాంగీల మీద కక్ష తీర్చుకోడానికి ఇంకేం అవకాశం వస్తుంది?!)

పచ్చివెలక్కాయ పడింది కాంగీల గొంతులో!

వుద్యమం వుధృతం అవుతోంది. సరే.

మేమూ వున్నామంటూ, కమ్మీనిస్టులు తయారయ్యారు(ట). యెప్పటినించో ప్లాన్ చేసుకొన్న వాళ్ల మీటింగులని ఇప్పుడు నిర్వహిస్తున్నారట--వురి కి వ్యతిరేకంగా!

అన్నా దీక్ష తరవాత యేమిటి? లోక్ పాల్ తరవాత యేమిటి? అనేవాళ్లకి నేను చెప్పేది--వురిశిక్ష రద్దు చెయ్యండి. దాని స్థానంలో--నాలుగు రోడ్ల కూడళ్లలో, పదునైన కత్తితో, వాళ్ల గొంతుకలు కోసే (జబా అనో యేదో అంటారు.....కోళ్లని అలా నరకడాన్ని మన "ముస్లిం సోదరులు")......శిక్షని ప్రవేశపెట్టండి--అని!

యేమంటారు?

తాజా కలం: ఈనాడువారు తాము "ముస్లిం సోదరులు" అనే ప్రత్యేక "జాతి"ని "డీ రికగ్నైజ్" చేసినట్టున్నారు--ఇవాళ్టి (01-09-2011) పేపర్లో, ఫోటోల క్రింద "ముస్లింలు" అని మాత్రమే వ్రాశారు! కీపిటప్ ఈనాడూ!