Thursday, February 27, 2014

కబుర్లు - 110



అవీ, ఇవీ, అన్నీ

సౌదీ అరేబియా లో ఓ 30 యేళ్ల కుమారుడు తల్లితో కలిసి కారులో వెళ్తూండగా ఒక విషయం లో ఇద్దరికీ గొడవ వచ్చి, తల్లి ముఖం పై కొట్టడంతో ఆమె ఒక పంటిని కోల్పోయిందట. ఆవిడ పోలీసులకి ఫిర్యాదు చేస్తే, న్యాయస్థానం కొడుకు పన్నొకటి పీకెయ్యవలసిందిగా శిక్ష వేయడమే కాకుండా, 2400 కొరడా దెబ్బలు, (ఇంకా బతికి వుంటే) అయిదేళ్లు జైలు శిక్ష విధించాలని న్యాయ మూర్తి ఆదేశించారట.

"నేను విధి నిర్వహణలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నా. అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల దృష్టి మరల్చాలని ప్రతిపక్షాలు చూశాయి. నేను బలహీనుణ్ణి కాను" అన్నాడట మొన్న  సుశీల్ షిండే. చూస్తే మన పాత తెలుగు సినిమాల అరవ విలన్‌  "కొట్టార్కఱ" లా వుంటాడు. అంత లావు లేడుగానీ "నెల్లూరు కాంతారావు" లా కూడా వుంటాడు. బలహీనుడు అని యెవరన్నారో మరి.

నిన్నేమో, "ఓ టీవీ ఛానెల్ వాళ్లు యేదేదో మాట్లాడుతున్నారు.......వాళ్లని అణిచేస్తాము" అన్నాడట. ఇంకా యెవరైనా అంటారా బల హీనుడు అని?

మొన్న ఒక ఉపాధ్యాయురాలు ఫరీదాబాద్ లో, హెడ్ ఫోన్‌స్ తో, మొబైల్ లో మ్యూజిక్ వింటూ పట్టాలు దాటుతుంటే, ఓ రైలు వచ్చి గుద్దేసి, వెంటనే తునాతునకలై చచ్చిపోయిందట.  ఆమెకి గతేడాదే వివాహం అయిందట. హెడ్ ఫోన్లు లేకుండావుంటే ఆ ప్రమాదమే జరిగేదికాదు అంటున్నారట పోలీసులు. చూశారా యెంత ఘోరమో! సంగీతం అంటే యెంత ఇష్టం అయినా వుండొచ్చు. అలా అని వేళా పాళా లేకుండా ఇలా చెయ్యడం యెందుకు?

రైళ్లలో కూడా చూస్తూ వుంటాం. అందరూ నిద్ర పోయే సమయం లో మొబైల్ లో పాటలు గట్టిగా పెట్టేస్తూ వుంటారు. అవి యెంత గొప్ప పాటలైనా అవ్వచ్చు, శాస్త్రీయ సంగీతం అయ్యుండవచ్చు, అందరూ మామూలుగా చాలా ఇష్టపడే పాటలే కావచ్చు. కానీ సమయం, సందర్భం ఉండొద్దూ? అంతకీ వినాలని వుంటే హెడ్ ఫోన్లు పెట్టుకొని వినొచ్చుగా? ఈ పిచ్చి మధ్యాహ్నం పూటకూడా వుంటుంది కొంతమందికి. ఏసీల్లోనూ, స్లీపర్లలోనూ ప్రయాణించేది విశ్రాంతిగా గమ్యాన్ని చేరడం కోసమే కదా? ఆలోచించండి.

Sunday, February 23, 2014

కబుర్లు - 109


అవీ, ఇవీ, అన్నీ

నందన్ నీలేకణి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించేశాడు. కాంగ్రెస్ అభ్యార్ధిగా లోక్ సభకి పోటీ చేస్తానని కూడా చెప్పేశాడు. శుభం! 

ఇంక యూ ఐ డీ ఏ ఐ ని యెవరైనా ముందుకు తీసుకెళ్లగలరు అని కూడా సెలవిచ్చారు. 2015 కల్లా (అంటే యెన్నేళ్లో?) 90 కోట్ల ఆథార్ కార్డుల జారీ పూర్తవుతుందనీ, ఇప్పటివరకూ 58.7 కోట్ల సంఖ్యల జారీ పూర్తి అయిందని కూడా సెలవిచ్చారు. (మన దేశ జనాభా యెంతో?). 

నేనైతే, వచ్చే ప్రభుత్వం ఆథార్ ని యెప్పుడు కుంభకోణం గా ప్రకటిస్తుందా, యెప్పుడు భారత ప్రజలకి మాత్రమే అని ప్రకటిస్తుందో, సంబంధీకులని జైళ్లకి యెప్పుడు పంపిస్తుందో అని యెదురు చూస్తాను.

చిత్తూరు నగరం గంగపల్లె లోని క్యాన్‌ఫర్డ్ పాఠశాలలో మగ-మగ, ఆడ-ఆడ, మగ-ఆడ, ఇలా 26 జతల కవల పిల్లలు ఉండడం, అంతర్జాతీయ కవల దినోత్సవం నాడు ఫోటో తీయించుకొని ప్రచురించడం బాగుంది.

కవలగురించి కొన్ని విచిత్రాలు........మన పురాణాల్లో ఆడ, మగ కవలలు జన్మిస్తే, వాళ్లని మిథునం అన్నారు. వాళ్లిద్దరూ పెద్దయ్యాక పెళ్లి చేసుకోవచ్చట!

కవలల్లో యెవరు పెద్ద? అనేది ఓ పెద్ద ధర్మ సందేహం. పాశ్చాత్య దేశాల్లో, గర్భం నుంచి యెవరు ముందు బయటపడితే, వాళ్లే పెద్ద అని గుర్తించేవారు.  అలా పెద్ద పెద్ద ఎస్టేట్లనీ, టైటిళ్లనీ కొద్ది సెకన్ల తేడాతో కోల్పోయిన వాళ్లున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ ప్రథాని విన్‌స్టన్ చర్చిల్ తన అన్నగారికన్నా కొన్ని క్షణాలు ముందు పుట్టి వుంటే, "9 వ డ్యూక్ ఆఫ్ మార్ల్ బరో" గా కొన్ని వందల యెకరాల ఎస్టేట్ యజమాని అయి వుండేవాడు. (కానీ అలా అయితే చరిత్రలో నిలిచిపోయేవాడు కాదు కదా?) ప్రపంచాన్ని 3 దశాబ్దాలపాటు శాసించి, తన గొప్ప దేశం ఇస్తానన్న బిరుదులన్నీ అఖ్ఖర్లేదని, చివరికి "డ్యూక్ ఆఫ్ లండన్" ని కూడా తిరస్కరించేవాడుకాదుకదా?

మన దేశ పధ్ధతి ప్రకారం, వెనుక పుట్టినవాడి "పిండమే" ముందు యేర్పడుతుంది కాబట్టి, తరవాత (ఆలస్యంగా) పుట్టినవాడే పెద్దవాడు! ఈ న్యాయం ప్రకారం మన తెలుగు సామ్రాజ్యాల చరిత్రలే మారిపోయాయి! (అడవి బాపిరాజుగారి నవలలు చదవండి). ఇవీ విచిత్రాలు. 

మొన్న మొగల్తూరు లోని రామాలయం నుంచి నరసాపురం మండలం కొప్పర్రు వరకూ రహదారి పనులకి షార్ డైరెక్టర్, "పద్మశ్రీ" డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ భూమి పూజ చేశారట. బాగుంది. కానీ, పేరు ముందు పద్మశ్రీ పెట్టుకొనే కదా మోహన్ బాబు చీవాట్లు తిని, ప్రభుత్వం వారు దాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టు చెప్పింది? పద్మశ్రీ తరవాత గ్రహీత అని వ్రాస్తే పత్రికల వాళ్ల  సొమ్మేం పోయింది?

మొన్ననే భీమవారం బైపాస్ రోడ్డుప్రక్కన గుట్టలు గుట్టలుగా 2012 లో తయారై 2012 మార్చి దాకా పనికొచ్చే నిరోధ్ ప్యాకెట్లని పారేశారని ఫోటో కూడా వేశారు ఈనాడులో. ఇదివరకు ఇవి జనాభా నియంత్రణ కోసం ఉపయోగిస్తే, ఇప్పుడు ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి వాడుతున్నారట. ఇంకెక్కడి నియంత్రణా, నిరోధం?

మా చిన్నప్పుడు నిరోధ్ లు కొత్తగా వచ్చినప్పుడు, ప్రతీ చిల్లర కొట్లోనూ 5 పైసలకే 3 నిరోధ్ లు అమ్మే యేర్పాట్లు చేశారు ప్రభుత్వం వారు. మామూలు బెలూన్లు 2 పైసలకి ఒకటి. అయినా అవి చాలా చిన్నవి. నిరోధ్ లని వూదితే, దాదాపు 2 అడుగుల పొడవూ, ఓ అడుగు వెడల్పూ తో పెద్ద బెలూన్లు వచ్చేవి! వాటిని దారంతో కట్టేసి, చివరి రింగులో ఓ పదిపైసల నాణెం దోపితే అది లేచి నిలబడేది! నాణెం సరిపోకపోతే పుల్లలు పెట్టేవాళ్లం. అలా పిల్లలు ఆడుకోడానికి ఇచ్చేసినా పరమార్థం నెరవేరేదికదా? అలా పారబొయ్యడమెందుకో?

ఆర్టాఫ్ లివింగ్ గురూ మొన్న ఓ ప్రత్యేక రైలులో వచ్చి కొవ్వూరు, తణుకు, భీమవరం, ఆకివీడు రైల్వేస్టేషన్లలో భక్తులని ఉద్దేశించి ప్రసంగించారట. విదేశాల్లోని స్విస్ బ్యాంకుల్లో మనవారిది రూ.1.45 బిలియన్స్ నల్లధనం ఉందనీ, దానిని బయటికి తీసుకు వస్తేనే దేశం లోని పరిస్తితిలో మార్పు తథ్యమనీ, ఇంకా చాలా విషయాలు చెప్పి, సమాజం లో ప్రతిఒక్కరూ ఆత్మ విశ్వాసంతో ఈశ్వరునిపై నమ్మకం కలిగి ఉండాలని బోధించారట. ఆఫ్టరాల్--హి నోస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్!

ప్రఖ్యాత వీణ విద్వాంసుడు చిట్టిబాబు కచేరీ చేస్తుంటే, యెవరైనా ఈలలు వేస్తె, నిర్మొహమాటంగా ఈలలు వేసుకునేవాళ్లు ప్రక్కవీధి లోకి వెళ్లి వేసుకోండి అనేవారు. ఆ కార్యక్రమం యెంతో పవిత్రమైనది అని ఆయన భావించడమే కాకుండా, ఆ వాతావరణమే సభలో వుండేలా చేసేవారు. కీర్తన ఇంకా క్లైమాక్స్ కి రాకుండానే ఓ సంగతి నచ్చి యెవరైనా చప్పట్లు కొడితే, మిగిలినవాళ్లు అనుసరించేవారు. కీర్తన పూర్తయ్యాక, ఇప్పుడు కొట్టండి చప్పట్లు అనేవారు. (మధ్యలో చప్పట్లు కొడితే ఆయన యేకాగ్రత దెబ్బతినే అవకాశం వుండచ్చు కదా). అక్కణ్ణుంచీ కీర్తన పూర్తయ్యే వరకూ యెవరూ చప్పట్లు కొడితే ఒట్టు. అంత బాగా జరిగేవి ఆ కచేరీలు. 

బొంబాయి సినిమాలో విదియా, తదియా అని ఉన్న ఓ పాట సెన్‌సార్ వారి దృష్టి నుంచి తప్పించుకొంది అన్నారోసారి బాల సుబ్రహ్మణ్యం. అమెరికాలో రాగసాగరిక క్రింద పాడుతా తీయగా కార్యక్రమం లో గాయని సుజాతతో ఆయన ఓ పాట పాడిన విధానం, మధ్య మధ్యలో ఒకళ్లనొకళ్లు ఉద్దేశించినట్టుగా పాటలు పాడడం నాకు నచ్చలేదు. ఇంత కంటే యేమీ అనలేను. యెందుకంటే అందరూ దీన్నో గాసిప్ కాలం అనుకొనే ప్రమాదం వుంటుంది అని. యెవరి మనో భావాలనైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ని.


Friday, February 21, 2014

కబుర్లు - 108


అవీ, ఇవీ, అన్నీ

మొన్న మన బడ్జెట్లో చిదంబరం కార్ల పరిశ్రమకి ఉద్దీపనలు ప్రకటించగానే, కార్ల రేట్లు తగ్గుతున్నాయి. మరి సామాన్యులకి ఆమాత్రం వెసులుబాటు కలిగించొ్ద్దూ ఎలక్షన్ల ముందు? సామాన్యులకి యేమి ఒరిగింది అంటారా? పాపం బైక్ లు 2.65 లక్షల నుంచి 58 లక్షల వరకూ (హార్లే డేవిడ్ సన్ బైక్ ల ధరలు చూడండి), కార్లు 5.56 కోట్ల నుంచి 46 కోట్లవరకూ (లాంబోర్గినీ వాడు ఇప్పటికే 200 కార్లు అమ్మి, సం వత్సరాంతం లోపల ఇంకో 400 అమ్మేస్తానని మొన్నెప్పుడో చెప్పాడు) చెల్లించి కొనేసి కష్టపడుతున్నారు కదా మరి?

2 వేల రూపాయల లోపు సెల్ ఫోన్ల రేట్లు యెందుకు పెంచాడంటారా? మరి ప్రతీ తమిళ తంబీ ఆయన సెల్ నంబరు సంపాదించేసి, ఇరవైనాలుగు గంటలూ ఆయన్ని విషయించేస్తున్నారట! (మనవాళ్లకి అంత సీను లేదు లెండి.)

అదీ సంగతి.

అన్నట్టు తిండి విషయం లో మాత్రం అరవ్వాళ్లనే ఆదర్శంగా తీసుకోవాలి అందరూ. "అమ్మ" హోటెళ్లలో చాలా చవకగా భోజనాలూ, టిఫిన్లూ పెట్టేస్తున్నారు. ఇప్పుడొకాయన ఒక కిలో ఇడ్లీలు 35 రూపాయలకి అమ్మేస్తున్నాడట! కిలోకి 24 ఇడ్లీలు తూగుతున్నాయట. సాంబారు విడిగా కొనుక్కోవాలటలెండి. ఓ 50 రూపాయలు పెడితే, 5 గురికి కడుపు నిండుతోందట. ఆయన ఆధునిక యంత్రాలతో వాయికి నాలుగువందలో యెన్నో తయారు చేసేస్తున్నాడట. మరి మనవాళ్లు యేమైనా ప్రయత్నిస్తారేమో చూడాలి. (యెవరైనా ప్రయత్నించినా యేమౌతుందో అందరికీ తెలుసు).

రైళ్లు "దురంతం" చెందడానికి బ్రహ్మాండంగా దోహదం చేసిన మమతాదీ ప్రభుత్వ బంగళా లో వుండడం లేదట, రూపాయే జీతం తీసుకుంటోందట. ఇంకా ఇరవైమూడో యెన్నో ఉన్న ఆయన కార్యక్రమాలన్నీ అమలు చేస్తానందట. అందుకని అన్నా హజారే ఆమెకి పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా, రేపు ప్రచారం కూడా చేస్తానన్నాడట.

నాకో విషయం గుర్తుకు వస్తోంది. సంజయ్ గాంధీ తన విపరీత ధోరణులతో జనాగ్రహం చవిచూస్తున్న రోజుల్లో ఓ సారి ఇందిర తో వెళ్లి, ఆచార్య వినోబాభావే ని కలిశాడట. ' నా కొడుకు, పేరు సంజయ్ ' అని చెప్పగానే, ఆయన ' చాలా మంచి పేరు. భగవద్గీతలో 32 సార్లు ఆ పేరు వస్తుంది ' అన్నాట్ట సంతోషంగా! (ముఫ్ఫైరెండో యెన్నో నాకు సరిగ్గా గుర్తులేదు.) అలాగ, వీళ్లు పూర్తిగా సన్యాసుల్లా వున్నా బాగుండును--అనవసరంగా రాజకీయాల్లో కలగజేసుకోకుండా. అబ్బే!

రాజీవ్ హంతకులుగా శిక్ష పడ్డవారిని విడుదల చేస్తామని జయలలితా ప్రకటించగానే, సుప్రీం కోర్టుకి పరుగెత్తి, స్టే తెచ్చుకొని, పరువు కాపాడు కున్నారు ప్రభుత్వo వారు. ఈ సందర్భం లో, ఓ ప్రబుధ్దుడు ' బీజేపీ వాళ్లు కసబ్ ని ఉరి తీసేవరకూ ఊరుకోలేదు, ఇప్పుడు మాట్లాడటం లేదు ' అన్నాడట! ఈ రెండు సందర్భాలనీ ఒకే గాట కట్టడం లోనే తెలియడం లేదూ వాడి తెలివి? వీళ్లకి ఉరి శిక్ష పడినా అమలు చెయ్యకుండా 23 యేళ్లుగా మగ్గబెడుతుంటే, సుప్రీం కోర్టు ఆ శిక్షని యావజ్జీవ శిక్షగా మార్చాక కదా, మానవతా దృక్పథం అనే రాజకీయ ఆలోచనతో ఈ పాచిక వేసింది ఆవిడ? రాహుల్ చెల్లెలు ప్రత్యేకంగా జైలుకి వెళ్లి, నళిని కలిసి, ఆవిడ చిన్న పిల్లతో వుంది కనక ఉరిశిక్ష వెయ్యకూడదు అంటే, ఆ తరవాత కదా ఆవిడ శిక్షని తగ్గించింది ప్రభుత్వం?

మా జిల్లాలో ఈ నెలాఖరులోపల రేషం కార్డులని ఆథార్ తో అనుసంధానం చేసుకోకపోతే ఒచ్చే నెల నుంచి సరుకులు ఇవ్వబోమని ప్రకటించేశారు. రాహుల్! వింటున్నావా? నారాయణ స్వామి యేం చెప్పాడో గమనించావా? మళ్లీ ఓ సారి ' ప్రథాన్ మంత్రీజీ ' అంటావా?



Wednesday, February 19, 2014

కబుర్లు - 107


అవీ, ఇవీ, అన్నీ

మొన్న లోక్ సభలో ఒక ఎం పీ పెప్పర్ స్ప్రే జల్లాక, మన ప్రథాని "నా  హృదయం ముక్కలయింది" అన్నాడట! ఇలాంటివాళ్లనే పి నా కొ లంటారు. (ఒక్కో అబధ్ధం ఆడినప్పుడల్లా వాడి ముక్కు కొంచెం పొడుగు పెరుగుతుందట). ఈయన ముక్కు పెరగదులే అని ధైర్యం మరి. కనీసం ఆ స్ప్రే చల్లిన, వాళ్ల పార్టీ వాడే అయిన ఎం పీ ని 'అలా యెందుకు చేశావు' అని అడిగాడా? రాణీగారి కోటరీలోని కమల్ నాథ్ ని 'కత్తి తెచ్చాడన్నావు. యేమిటి నిజం?' అనైనా అడిగాడా? మొహాన చిరునవ్వు కూడాలేని ఆయన మౌనంతో్ యెంతమంది హృదయాలు యెన్నిసార్లు ముక్కలయ్యాయో యెప్పుడైనా పట్టించుకున్నాడా?

గడచిన 8 యేళ్ల యూ పీ ఏ పాలనలో (2005-13) దేశవ్యాప్తంగా 1,94,500 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నేలపాలయ్యాయట. అందులో 84% (1,63,576 మె.ట) బియ్యం, 14% (26,543 మె.ట) గోధుమలు ట. ఇలా అని సాక్షాత్తూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా "సమాచార హక్కు చట్టం క్రింద" అడిగితే చెప్పిందట! సాక్షాత్తూ సుప్రీం కోర్టు వాటిని ఉచితంగా పంచి పెట్టమన్నా పెడచెవిని పెట్టి వాళ్లు వెలగబెట్టిన నిర్వాకమిది! ఇప్పటికీ, నిల్వ చేసే గోదాములు నిర్మించడం, ఉన్నవాటిలో అధ్వాన్న పరిస్థితులని చక్కదిద్దడం గురించి ఈ ప్రభుత్వాలకి పట్టడం లేదు. 

పిల్ల కాకేమో (పిల్ల రాబందు అనొచ్చేమో) "స. హ. చట్టం నేనే తెచ్చాను, అవినీతి బిల్లూ, అదేదో మత సామరస్యం బిల్లూ, ఇంకేవో అన్ని బిల్లులూ నేనే తెచ్చాను" అంటున్నాడు. అనేక రాష్ట్రాల్లో, అనేకమంది సాంఘిక కార్యకర్తలు చేసిన కృషి తో వచ్చిన చట్టాన్ని తానే తెచ్చానని యెవరి చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నాడో! (వాళ్లలో ముఖ్య కార్యకర్త జాతీయ సలహా సంఘం నుంచికూడా బయటికి వెళ్లిపోయారు)

లక్షలు పోయి కోట్లు వస్తాయని అప్పుడెప్పుడో సణిగాను. ఇప్పుడు 'లక్ష' స్థానం లో 'కోటి కుంకుమార్చనలు'  వచ్చాయి. అసలు ఈ కోటి యెలా లెక్కేస్తారో నాకు సందేహం. లక్ష రేణువులో, లక్ష చిటికెలో, లక్ష గుప్పెళ్లో, దోసెళ్లో అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా లక్ష కేజీలో, టన్నులో అన్నా అర్థం చేసుకోవచ్చు. మరి వీటినెలా లెక్కెయ్యాలో!

మొన్న ఈనాడు లో ఓ చిత్రమైన వార్త వచ్చింది. ఓ ఆధ్యాత్మిక పీఠం అధిపతి, డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు "వర్ధంతి సభలో" మాట్లాడుతూ ఇలా చెప్పారు అని. చెప్పినాయన పేరు ఉమర్ ఆలీషా సద్గురు అని వ్రాశారు. ఇదెలా సాధ్యమో మరి.

ఇంకో చోట ఇంకో స్వామీజీ "మారుతున్న సమాజం లో మానవ శరీరానికి, మనస్సుకు శాంతి అవసరం" అనీ, "తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నవారికి అతిథి సత్కారం చేయడం తెలియదు" అనీ అన్నారట. మరి విన్నవాళ్లు యేమి అర్థం చేసుకున్నారో!

మా వూరి ఇంజనీరింగ్ కాలేజీ యువ శాస్త్రవేత్తలు "గార్లెన్ డివైజ్" అనే ఓ పరికరం కనిపెట్టారట. దానితో యెంత యెత్తులో వున్న విగ్రహానికైనా పూల మాల వేసెయ్యచ్చుట. విగ్రహానికి మెట్లూ, నిచ్చెనలూ అవసరం వుండదట. మన అన్ని పార్టీల రా నా ల నుంచీ మంచి డిమాండ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా వుంటాయి కదూ?   



Tuesday, February 11, 2014

కబుర్లు - 106


అవీ, ఇవీ, అన్నీ

ఈ మధ్య దేవుళ్ల, దేవతల విగ్రహాల అలంకారాలలో వెరయిటీ ప్రవేశపెట్టారు. నవనీతం (అంటే వెన్న అనుకుంటా), చెర్రీ పళ్లూ, బాదం, పిస్తా, జీడిపప్పులూ వగైరాలతో అలంకారం చేస్తున్నారు. (ఆ వ్యాపారుల లాబీలు బాగానే పనిచేస్తున్నాయన్నమాట. ఇంక వాటికి కూడా ద్రవ్యోల్బణం దెబ్బ తగులుతుందన్నమాట).

అన్నట్టు, మొన్న రథసప్తమి సందర్భంగా, 06-02-2014 న శ్రీగిరి శ్రీవారి గరుడవాహనం వూరేగింపులో గరుడుడి చేతులు "ఖాళీ" గా వున్నాయి! అంటే స్వామికి కృత్రిమకాళ్లు తగిలించి, గరుడుడి చేతుల్లో పెట్టలేదన్నమాట. మరి హనుమంత వాహనం సంగతి తెలీదు. 

ఈ వచ్చిన బుధ్ధిని కొనసాగిస్తే బాగుంటుంది.

మన ఆచారాలగురించీ, సాంప్రదాయాలగురించీ, పండుగల గురించీ, ప్రతీమాసం, అందులో ప్రతి తిథీ వాటి గొప్పతనం గురించీ వ్రాసేవాళ్లు, చెప్పేవాళ్లు యెక్కువైపోయారీమధ్య. తప్పులేదు లెండి. యెవరి గొప్పతనం వారిది.

రథ సప్తమిరోజు తలమీద 7 జిల్లేడు ఆకులూ గానీ, రాగి ఆకులుగానీ (రావి ఆకులని కవి హృదయం అనుకుంటా) పెట్టుకొని స్నానం చేయడం సంప్రదాయం అంటాడొకడు. రేగు పండు సంగతి జ్ఞాపకం లేదు వాళ్లకి. పైగా ఒక్క ఆకు సరిపోతుందనీ తెలియదు.

సూర్యకాంతిలో యేడు రంగులనీ, అవే రథానికి 7 గుర్రాలు అనీ, ఒకే చక్రం--అదే కాల చక్రం అనీ చెపుతారు. ఇంకొకడు ఒకే గుర్రం అనీ, దాని పేరు "సప్త" అనీ, అందుకే "సప్తాశ్వుడు" అనీ అంటాడు.

ఈ మధ్య షణ్ముఖ శర్మ గారు (అదేదో సినిమాలో ఒకడి పేరడిగితే, తలుముక తెలమ అని పలుకుతాడు) "నల్లనువ్వులూ" "తెల్లనువ్వులూ" అన్నాడని వ్రాస్తున్నారు. ఆయన అలా అన్నాడో లేదో గానీ, "దుక్కి దున్నావా, విత్తుజల్లావా, పైరు కోశావా, నూనె తీశావా....." లాంటి డైలాగు వెయ్యాలనిపిస్తుంది. 

బ్యాంకాక్ లో ఆరువేలకోట్ల రూపాయల ఖర్చుతో, దమ్మకాయ సంస్థ ఓ బుధ్ధ స్థూపాన్ని నిర్మించారట. దాని మీద 3 లక్షల బుధ్ధ ప్రతిమలు ఒకే సైజు, ఆకారం లో నిర్మించారట. చూస్తుంటే, పైన చుక్కల చుక్కల డిజైన్ వేసినట్టు కనిపిస్తుందట. స్థూపం లోపల మరో 7 లక్షల విగ్రహాలని పెట్టే పనిలో వున్నారట. యెంత బుధ్ధ భక్తో!


Saturday, February 1, 2014

కబుర్లు - 105


అవీ, ఇవీ, అన్నీ

గాంధీగారి వర్ధంతి సందర్భంగా మళ్లీ అందరూ "రాజ్ ఘాట్" సందర్శించారు. నాకో చిన్న సందేహం. బ్రిటిష్ వాళ్ల రాజ్యాన్ని "రాజ్" అని వ్యవహరిస్తారు. వాళ్ల కాలంలో ఆ ప్రాంతాన్ని రాజ్ ఘాట్ అనే వారేమో. ఆ పేరు ఇంకా మన బానిసత్వానికి గుర్తుగా అలాగే వుండాలా? కనీసం ఇన్నేళ్ల తరవాతైనా, యే "మహాత్మా ఘాట్" అనో పేరు మార్చచ్చు కదా?

పటేల్ మా పార్టీవాడు, నేతాజీ మా పార్టీవాడు అనడమే గానీ, వీళ్లకి కనీస స్వతంత్ర అలోచనలు వుండవెందుకో? (పాపం ప్రథాని "పటేల్ గొప్ప సెక్యులరిస్ట్" అంటే, మోడీ వెంటనే "అందుకే ఆయన ముందు సోమనాథ దేవాలయాన్ని పునరుధ్ధరించాడు!" అన్నాడు. మరి కాంగీలు కుయిక్కుమంటే ఒట్టు!)

మళ్లీ ఈసారి భారత రత్నలూ అవీ వాల్మీకికీ, వ్యాసుడికీ, బుధ్ధుడికీ వగైరాలకి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. నిజం చెప్పొద్దూ, నాక్కూడా ఇచ్చేస్తారేమో అని భయపడ్డాను. యెందుకంటే, నా పేరున "అకాడమీలు" యేమీ లేవుకదా? (హాకీ వీరుడు ధ్యాన్ చంద్ పేరున చాలా అకాడమీలు వున్నాయి కాబట్టే ఆయనకివ్వకుండా సచ్చిన టెండూల్కర్ కి ఇచ్చామన్నాడో మంత్రి!). యేదోలెండి, ఈసారికిలా సరిపెట్టుకున్నాం.

'అవినీతి పెరిగిపోతోందంటూ జనాలు ఆక్రోశించడానికి (కాగ్ లాంటి) "రాజ్యాంగ వ్యవస్థలే" కారణం తప్ప, యూపీయే లో అవినీతి చాల తక్కువ' అన్నాడట పిచ్చిదంబరం. ఇంకా అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ అన్నట్టు, అవినీతి "గ్లోబల్ ఫినామినన్" అనికూడా అన్నాట్ట! మనం పేపర్లలో చదువుతున్న వివిధ దేశాల్లో జరుగుతున్న అవినీతి తో పోలిస్తే, మనది (సముద్రంలో కాకిరెట్టే అనలేదుగానీ) చాలా తక్కువ అని కూడా అన్నాట్ట. 

మొన్నామధ్య ప్రథాని, "ప్రథాని మీద ఆరోపణలు యెక్కడైనా చేస్తారా?" అంటూ ఆక్రోశించాడు.

మరి విదేశాల్లో అధ్యక్షులనీ, ప్రథానులనీ, రాజకుటుంబాలవారినీ కూడా అవినీతి ఆరోపణలపై యావజ్జీవ శిక్షలూ, ఉరిశిక్షలూ విధించారని కూడా మనం ఆ పేపర్లలోనే చదివాము. మనకెంత సిగ్గులేదో మరి!

ఒకప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (ఇప్పుడు ఐజీ ట లెండి--చెయ్యడానికి ఉద్యోగమే లేదు!) రకరకాల మీటింగులకి ముఖ్య అతిథిగా వెళుతూ, ఉపాధ్యాయులనీ, విద్యార్థులనీ పొగుడుతూ, పాఠశాల స్థాపిస్తాను అంటూ, గడిపేస్తున్నాడు. మీడియా వాళ్లు మాత్రం, నిజాయితీ పరులకి అంతేనేమో అంటున్నారు.

అన్నట్టు, ఆయన ఒక్కో కేసులోనూ కనీసం రెండు మూడు మినీలారీల్లో కోర్టులకి అప్పజెప్పిన "పత్రాలు" అన్నీ యెక్కడ యెలా వున్నాయో. (నేను ముందే చెప్పాను, ఓవరాక్షన్ వల్ల వుపయోగం వుండదు అని. వింటేనా!)

మనలోమన మాట--కంప్యూటర్లు వచ్చాక-- మన మిల్లులు మూసేసుకోవలసిందే అని దాదాపు ఓ నిశ్చయానికి వొచ్చేసిన పేపరు మిల్లువాళ్లు, ఈ మధ్య వాళ్ల కాగితం డిమాండ్ రెట్టింపయ్యేటప్పటికి ఆశ్చర్యపోయి, మళ్లీ యేడాదికి మళ్లీ రెట్టింపు కావచ్చు అని సంతోషించేస్తున్నారట! ఆహా! యేమి ప్రభుత్వ లీలలు!

నిన్న అందరూ "గ్యాస్ ఊరట" అని సంతోషించేశారు గానీ, ఇవాళ "అథార్ అనుసంధానం రద్దు చెయ్యలేదు. కేవలం కొన్నాళ్లు ప్రక్కన పెట్టామంతే" అంటున్నాడు మంత్రి నారాయణ స్వామి! అసలు ఆయన మానవ వనరుల శాఖకీ, గ్యాస్ సిలిండర్లకీ యేమిటి సంబంధమో! రాహుల్ ని యెన్నుకోకపోతే, మళ్లీ ఆథార్ తో కక్ష తీర్చుకుంటాము అని బెదిరిస్తున్నట్టున్నాడు. ఇలాంటి బెదిరింపులతో మొదటికే మోసం వస్తుందని వాళ్లకి తట్టడంలేదు యెందుకో!