Wednesday, February 19, 2014

కబుర్లు - 107


అవీ, ఇవీ, అన్నీ

మొన్న లోక్ సభలో ఒక ఎం పీ పెప్పర్ స్ప్రే జల్లాక, మన ప్రథాని "నా  హృదయం ముక్కలయింది" అన్నాడట! ఇలాంటివాళ్లనే పి నా కొ లంటారు. (ఒక్కో అబధ్ధం ఆడినప్పుడల్లా వాడి ముక్కు కొంచెం పొడుగు పెరుగుతుందట). ఈయన ముక్కు పెరగదులే అని ధైర్యం మరి. కనీసం ఆ స్ప్రే చల్లిన, వాళ్ల పార్టీ వాడే అయిన ఎం పీ ని 'అలా యెందుకు చేశావు' అని అడిగాడా? రాణీగారి కోటరీలోని కమల్ నాథ్ ని 'కత్తి తెచ్చాడన్నావు. యేమిటి నిజం?' అనైనా అడిగాడా? మొహాన చిరునవ్వు కూడాలేని ఆయన మౌనంతో్ యెంతమంది హృదయాలు యెన్నిసార్లు ముక్కలయ్యాయో యెప్పుడైనా పట్టించుకున్నాడా?

గడచిన 8 యేళ్ల యూ పీ ఏ పాలనలో (2005-13) దేశవ్యాప్తంగా 1,94,500 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నేలపాలయ్యాయట. అందులో 84% (1,63,576 మె.ట) బియ్యం, 14% (26,543 మె.ట) గోధుమలు ట. ఇలా అని సాక్షాత్తూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా "సమాచార హక్కు చట్టం క్రింద" అడిగితే చెప్పిందట! సాక్షాత్తూ సుప్రీం కోర్టు వాటిని ఉచితంగా పంచి పెట్టమన్నా పెడచెవిని పెట్టి వాళ్లు వెలగబెట్టిన నిర్వాకమిది! ఇప్పటికీ, నిల్వ చేసే గోదాములు నిర్మించడం, ఉన్నవాటిలో అధ్వాన్న పరిస్థితులని చక్కదిద్దడం గురించి ఈ ప్రభుత్వాలకి పట్టడం లేదు. 

పిల్ల కాకేమో (పిల్ల రాబందు అనొచ్చేమో) "స. హ. చట్టం నేనే తెచ్చాను, అవినీతి బిల్లూ, అదేదో మత సామరస్యం బిల్లూ, ఇంకేవో అన్ని బిల్లులూ నేనే తెచ్చాను" అంటున్నాడు. అనేక రాష్ట్రాల్లో, అనేకమంది సాంఘిక కార్యకర్తలు చేసిన కృషి తో వచ్చిన చట్టాన్ని తానే తెచ్చానని యెవరి చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నాడో! (వాళ్లలో ముఖ్య కార్యకర్త జాతీయ సలహా సంఘం నుంచికూడా బయటికి వెళ్లిపోయారు)

లక్షలు పోయి కోట్లు వస్తాయని అప్పుడెప్పుడో సణిగాను. ఇప్పుడు 'లక్ష' స్థానం లో 'కోటి కుంకుమార్చనలు'  వచ్చాయి. అసలు ఈ కోటి యెలా లెక్కేస్తారో నాకు సందేహం. లక్ష రేణువులో, లక్ష చిటికెలో, లక్ష గుప్పెళ్లో, దోసెళ్లో అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా లక్ష కేజీలో, టన్నులో అన్నా అర్థం చేసుకోవచ్చు. మరి వీటినెలా లెక్కెయ్యాలో!

మొన్న ఈనాడు లో ఓ చిత్రమైన వార్త వచ్చింది. ఓ ఆధ్యాత్మిక పీఠం అధిపతి, డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు "వర్ధంతి సభలో" మాట్లాడుతూ ఇలా చెప్పారు అని. చెప్పినాయన పేరు ఉమర్ ఆలీషా సద్గురు అని వ్రాశారు. ఇదెలా సాధ్యమో మరి.

ఇంకో చోట ఇంకో స్వామీజీ "మారుతున్న సమాజం లో మానవ శరీరానికి, మనస్సుకు శాంతి అవసరం" అనీ, "తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నవారికి అతిథి సత్కారం చేయడం తెలియదు" అనీ అన్నారట. మరి విన్నవాళ్లు యేమి అర్థం చేసుకున్నారో!

మా వూరి ఇంజనీరింగ్ కాలేజీ యువ శాస్త్రవేత్తలు "గార్లెన్ డివైజ్" అనే ఓ పరికరం కనిపెట్టారట. దానితో యెంత యెత్తులో వున్న విగ్రహానికైనా పూల మాల వేసెయ్యచ్చుట. విగ్రహానికి మెట్లూ, నిచ్చెనలూ అవసరం వుండదట. మన అన్ని పార్టీల రా నా ల నుంచీ మంచి డిమాండ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా వుంటాయి కదూ?   



1 comment:

TVS SASTRY said...

బాగుంది శాస్త్రి గారు