Saturday, August 28, 2010

కల్మాడీ.....


........కామన్వెల్తూ

వేలకోట్ల రూపాయలతో ముడివడిన కామన్వెల్తు క్రీడల నిర్వహణ వ్యవహారం లో, ఆ కమిటీ చైర్మన్ కల్మాడీనే పాపాల భైరవుణ్ని చేస్తున్నారందరూ.

కానీ, అసలు వాస్తవాలు వేరే వున్నాయట.

కల్మాడీ చేతిలో కేవలం 670 కోట్లు మాత్రమే వున్నాయట.

ఢిల్లీ ముఖ్యమంత్రిణి చేతిలో అక్షరాలా 16,560 కోట్లు పెట్టారట. జైపాల్ రెడ్డి చేతిలో మరిన్ని కోట్లు వున్నాయట.

షీలా సర్కారు పూలు, పూల కుండీల పైనే రూ.135 కోట్లు వెచ్చిస్తోందట!

కేంద్ర క్రీడల మంత్రి మనోహర్ సింగ్ గిల్ స్వయం గా--క్రీడా గ్రామాన్ని ముఖ్య క్రీడా ప్రాంగణం నెహ్రూ స్టేడియం సమీపం లో కాకుండా, తూర్పు ఢిల్లీ ప్రాంతం లో యమునా నది ఒడ్డున నిర్మించడం అంత బుధ్ధితక్కువ తనం లేదు--అన్నాడట!

దీనివల్ల--క్రీడా బృందాలకి రక్షణ కల్పించడానికే చాలా ఖర్చూ, కష్టం అవుతాయని భద్రతా బలగాలే వ్యాఖ్యానించాయట!

అసలు ఇది యెందుకు? అంటే, యమునానదికి అవతలివైపు ప్రాంతానికి ఎం పీ గా ఆవిడ కొడుకు సందీప్ దీక్షిత్ ప్రతినిధి కావడం వల్ల, ఆయన డబ్బాకొట్టుకోడానికి వుపయోగిస్తుందనిట!

ఈ నిర్మాణాలకి తనతో వొప్పందం చేసుకున్న నిధులు సరిపోవని చేతులెత్తేసి వైదొలగిన గుత్తేదారు స్థానం లో మరొకణ్ని వెతుక్కోకుండా, వాడికే మరిన్ని వందల కోట్లిస్తాం, బాబ్బాబూ, పని పూర్తి చెయ్యి అని బ్రతిమాలుకున్నారట! యెందుకో మరి?

క్రీడలు అయిపోయాక, ఈ ఫ్లాట్లని చదరపు గజం రూ.1,20,000/- కి అమ్మాలని ఆలోచనట--కానీ, చిన్నపాటి గాలి వీచినా, వర్షం వచ్చినా కదలబారిపోయే విధం గా నిర్మాణమవుతున్న వీటికి--యెంత వస్తుందో యెవరైనా ఆలోచించవచ్చు.

వీటి నిర్మాణం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆధ్వర్యం లోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ చేస్తోందట!

క్రీడలకి కేటాయించబడిన మొత్తం బడ్జెట్ రూ.28,054/- కోట్లు అయితే, ఇంకా చాలా యెక్కువే ఖర్చు పెడుతున్నారట!

ఇంతకీ, కల్మాడీ ముసుగులో యెందరో అవినీతిపరులు!

విచారణ మాత్రం--తీరికగా--క్రీడలు అయిపోయాకేనట.

దేశ గౌరవం ముఖ్యం కాదూ!


Monday, August 23, 2010

భాగ్యమా--బంగారమా


స్పెన్సర్ రేట్లు

అప్పుడెప్పుడో, పోచారం వారి అల్లుడనుకుంటా ఆయన పనిచేసే ప్రభుత్వ శాఖకి--పిన్ కుషన్లూ, పేపర్ వెయిట్లూ లాంటివి కూడా బంగారం తో తయారైతే యెంత రేటు వుంటాయో అంత పెట్టి కొనేశాడట.

దానిపై గొడవ జరిగితే, పోచారం "మా అల్లుడు బంగారం" అన్నట్టు గుర్తు.

ఇక ఇప్పుడు--

మన కామన్వెల్త్ కమిటీ, ఈఎస్ గ్రూప్ అనే ఓ బ్రిటిష్ కంపెనీనించి క్రీడా వేదికల వద్ద వాడకానికని కొన్ని వస్తువులు, అవి ప్లాటినం తో తయారయితే యెంత రేటు వుంటాయో, అంతరేటు కి కొనేసిందట!

ఈ విషయం "గార్డియన్" పత్రిక ప్రచురించిందట.

ఆ రేట్లు ఇలా వున్నాయి :

360 కాగితం రుమాళ్ల (టిష్యూ పేపర్) డబ్బాలు ఒక్కోటీ రూ.4,631/-

176 చెత్త కుండీలు (వేస్ట్ బేస్కెట్స్) ఒక్కొక్కటీ రూ.7,256/-

20 సింకులు ఒక్కోటీ రూ.36,259/-

480 ద్రవ సబ్బు సీసాలు (లిక్విడ్ సోప్) ఒక్కోటీ రూ.9,336/-

ఇంకా మూడు స్టేడియాలూ, ఒక తాత్కాలిక స్టేడియం, 18 శిక్షణా కేంద్రాల దగ్గరా సేవలు అందించడానికి ఈ సంస్థ భారీ కాంట్రాక్టునే పొందిందట!

యేది యేమైనా, ముందు దేశ గౌరవం ముఖ్యం కాబట్టి, యే అవినీతి కుంభకోణాలమీదా ఆటలు పూర్తయ్యే వరకూ యే చర్యలూ తీసుకొనే ప్రసక్తి లేదని మంత్రులూ, ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసేశారు మరి.

కొసమెరుపేమిటంటే--మణిశంకర్ అయ్యర్, నేను నా యెత్తు ధనం పోసినా ఈ ఆటలు చూడనుగాక చూడను, అందుకోసమే విదేశాలకి వెళ్లిపోతున్నాను--అని ప్రకటించాడు!

మన నీతి ఈ గతి యేడుస్తూంటే, దేశమేగతి బాగుపడునోయ్!


Thursday, August 12, 2010

మావిస్టుల కంచుకోటలో మమత


బాగా యెడం ప్రక్కకి తిరిగిన తృణమూలాలు

ఈ పిచ్చక్కకి చిలకమర్తివారి గణపతి వాళ్లమ్మకి చేయించిన వైద్యం చేయిస్తేనే గానీ కుదరదనుకుంటా!

2004లో రాశ్శేఖర్రెడి యెన్నుకున్న 'పులిమీద స్వారీ'నే తన విజయానికి బాటగా స్వీకరించినట్టుంది ఈవిడ.

యేచూరీ! నారాయణా! మిష్టర్ & మిసెస్ కారత్! బర్ధన్!--వాట్ ఈజ్ యువర్ స్ట్రేటజీ?

దిగ్విజయ్! మొయిలీ! ఆంటొనీ! వయలార్! షీలా! ప్రణబ్! మన్మోహన్! సోనియా! వాట్ ఈజ్ యువర్.......?