Monday, August 23, 2010

భాగ్యమా--బంగారమా


స్పెన్సర్ రేట్లు

అప్పుడెప్పుడో, పోచారం వారి అల్లుడనుకుంటా ఆయన పనిచేసే ప్రభుత్వ శాఖకి--పిన్ కుషన్లూ, పేపర్ వెయిట్లూ లాంటివి కూడా బంగారం తో తయారైతే యెంత రేటు వుంటాయో అంత పెట్టి కొనేశాడట.

దానిపై గొడవ జరిగితే, పోచారం "మా అల్లుడు బంగారం" అన్నట్టు గుర్తు.

ఇక ఇప్పుడు--

మన కామన్వెల్త్ కమిటీ, ఈఎస్ గ్రూప్ అనే ఓ బ్రిటిష్ కంపెనీనించి క్రీడా వేదికల వద్ద వాడకానికని కొన్ని వస్తువులు, అవి ప్లాటినం తో తయారయితే యెంత రేటు వుంటాయో, అంతరేటు కి కొనేసిందట!

ఈ విషయం "గార్డియన్" పత్రిక ప్రచురించిందట.

ఆ రేట్లు ఇలా వున్నాయి :

360 కాగితం రుమాళ్ల (టిష్యూ పేపర్) డబ్బాలు ఒక్కోటీ రూ.4,631/-

176 చెత్త కుండీలు (వేస్ట్ బేస్కెట్స్) ఒక్కొక్కటీ రూ.7,256/-

20 సింకులు ఒక్కోటీ రూ.36,259/-

480 ద్రవ సబ్బు సీసాలు (లిక్విడ్ సోప్) ఒక్కోటీ రూ.9,336/-

ఇంకా మూడు స్టేడియాలూ, ఒక తాత్కాలిక స్టేడియం, 18 శిక్షణా కేంద్రాల దగ్గరా సేవలు అందించడానికి ఈ సంస్థ భారీ కాంట్రాక్టునే పొందిందట!

యేది యేమైనా, ముందు దేశ గౌరవం ముఖ్యం కాబట్టి, యే అవినీతి కుంభకోణాలమీదా ఆటలు పూర్తయ్యే వరకూ యే చర్యలూ తీసుకొనే ప్రసక్తి లేదని మంత్రులూ, ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసేశారు మరి.

కొసమెరుపేమిటంటే--మణిశంకర్ అయ్యర్, నేను నా యెత్తు ధనం పోసినా ఈ ఆటలు చూడనుగాక చూడను, అందుకోసమే విదేశాలకి వెళ్లిపోతున్నాను--అని ప్రకటించాడు!

మన నీతి ఈ గతి యేడుస్తూంటే, దేశమేగతి బాగుపడునోయ్!


No comments: