Tuesday, November 24, 2009

చాదస్తాలు

యోగాలూ అవీ

15-11-2009 నాటి ఈనాడు ఆదివారం సంచికలో, 28వ పేజీలో ‘ఇప్పటికింకా మావయసు’ శీర్షిక క్రింద నలుగురు వృధ్ధుల గురించి ఫోటోలతో సహా ప్రచురించారు.

70 యేళ్ళ రాజోదేవీ లోహన్ అనేఆవిడకి, పెళ్ళైన 50 యేళ్ళ నించీ పిల్లలు లేకపోతే, ఢిల్లీలోని సంతాన సాఫల్య కేంద్రం సాయం తో ఇప్పుడు ‘తల్లి’ అయిందట.

తొంభైయేళ్ళ నానూరాం జోగీ మొన్నమొన్ననే నాలుగో భార్య ద్వారా మరో కూతుర్ని కన్నాడట! ఇంతకుముందు ఆయనకి 12 మంది కొడుకులూ, 9 మంది కూతుళ్ళూ వున్నారట. పైగా, వందేళ్ళొచ్చేవరకూ పిల్లల్ని కంటూనే వుంటానన్నాడట!

ఇక 80 యేళ్ళ వయసులో కూడా డిజైనర్ డ్రెస్సులూ అవీ వేసుకొని, ‘క్యాట్ వాక్’ చేస్తోందట ఒకావిడ. అంతేకాదు, ప్రపంచం లోనే అతిపెద్ద వయస్కురాలైన మోడల్ గా రికార్డులకి యెక్కిందట!

ఇక నాలుగో ఆయన (ఫోటోల్లోనూ, పేజీలోనూ ఈయనే మొదటివాడుగా ప్రచురింపబడ్డాడు—నేనే ఆఖరికి గెంటేశాను) 90 యేళ్ళ—ప్రపంచంలోనే అత్యంత వృధ్ధుడైన యోగా గురువుట. ఈయనపేరుమీద, ఆయన తరహా శిక్షణకి ‘అయ్యంగార్ యోగా’ అంటున్నారట. ఆయన వ్రాసిన పుస్తకం 18 భాషల్లోకి అనువాదం అయ్యిందట. ఇంకా, ఆయనవల్లే ‘అయ్యంగార్’ అనే పదం ఆక్స్ ఫర్డ్ డిక్ష్ నరీలో చోటుచేసుకొందట.

అదే కథనం లో భాగం గా, మహిళల్లో ఆ ఘనత వహించిన ఇంకో ఆవిడ గురించి వ్రాశారు—ఆవిడ వయసు 83 యేళ్ళట. ఇందులో కొసమెరుపేమిటంటే, ఆవిడదగ్గర శిక్షణ పొందినవాళ్ళు చాలామంది ‘యోగా ట్రైనర్లుగా’ ఉపాధి పొందుతున్నారట!

నా పాయింటేమిటంటే, మొదట చెప్పిన మూగ్గురికీ ఈ యోగాలూ అవీ తెలిసినట్టుగానీ, వాళ్ళు అవి సాధన చేసినట్టుగానీ, దాఖలాలు లేవు! (యెందుకంటే వాళ్ళలో కనీసం ఇద్దరు—మనదేశం లోని వాళ్ళు నిరక్షరాస్యులు!) పైగా, యోగా నేర్చుకున్నవాళ్ళు ‘ఉపాధి పొందడానికే’ దాన్ని వుపయోగించుకుంటున్నారు! అని.

మీరేమంటారు?


Friday, November 13, 2009

సంవాదం--6

నార, మంగేష్ లతో
సంవాదం ముగించే ముందు, 'నార' లాంటివాళ్ళకి కనువిప్పుగా మంగేష్ గారి బ్లాగు నించి కొన్ని--(దయచేసి నేను వారిని విమర్శిస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు!)

వారి టపా పై ఒకరి ప్రశ్న, వారి జవాబు:

subrahmanyam said...

Dear Guru Bandhu,

Many thanks for sharing the great teachings of the Masters. Could you please mention the source also, like name of the book, so that it would be possible for the interested readers to get more details.

Regards,
Subrahmanyam.
October 6, 2009 5:25 AM

Mangesh said...

Dear Subrahmanyam,

Thanks for your comment. I frequently listen Master K.Parvati Kumar's and Master EK's lectures and noting interested and important points and then writing these posts. If you are interested you can listen them by registering yourself in http://www.masters-call.net/.

Thanks
Mangesh
October 6, 2009 5:01 PM

(వాక్యాలు అండర్ లైన్ చేసింది నేను--పాఠకులు సత్యం గ్రహిస్తారని. నిజానికి ఆ మాస్టర్ల గురించి నేనెప్పుడూ విని వుండలేదు! శ్రీ జిడ్డు కృష్ణమూర్తి తత్వం అయినా బోధపడుతుందేమో కాస్త కష్ట పడితే--కానీ వీళ్ళు చెప్పినది యెవరికీ అర్థం అయ్యేట్టు వుండదు.)
మనం సామాన్యం గా యెవరైనా ఒక విషయం లో యెక్కువ నైపుణ్యాన్ని సాధిస్తే, అది వారి 'ప్రఙ్ఞ ' అంటాము.

మరి మంగేష్ చెపుతున్న మాస్టర్లు 'త్రిగుణ ప్రజ్ఞలు మూడును (ద్రవ్య రూపము, దేవతా ప్రజ్ఞలు, క్రియా రూపమైన ప్రజ్ఞలు) జీవునికి ఆశ్రయములుగా పనిచేయుచున్నవి.' అంటారు. 'నిద్ర లేవంగానే మనము దైవము ఒడిలోనుండి వచ్చాము అని గుర్తు వుండదు. అది ఒక ఆవరణ. అది సంకర్షణ వ్యూహము.' అంటారు. '...........మూడు బంధముల వల్లనూ మూడు ఆవరణలు ఏర్పడి మూడు శరీరములు ఏర్పడతాయి............అదే స్థూల శరీరము.........' ఇలా అందరికీ నాలుగో యెన్నో స్థూల శరీరాలు వుంటాయంటారు వీరు!

(నార! గమనించావా? నేను జీవుడు అంటేనే, నీకు 'TrAsh' అనిపించింది--ఇవన్నీ చదివితే ఇంకేమంటావో?--బహుశా--'బుల్ డంగ్', 'హార్స్ షిట్', "డైనొసార్స్ నైట్ సాయిల్", 'షిట్ హిట్టింగ్ ది ఫాన్ ' అంటారేమో!)

ఇంకా 'సప్త ఋషులు' అంటూ కొన్ని పేర్లూ, వారి లక్షణాలూ చెప్పారు. వారికి మరేమైనా పేర్లు వున్నాయేమో--అవి కూదా ఇస్తే బాగుండేది--యెందుకంటే, 'పులిసే వాడు' మొదలైనవాళ్ళు సామాన్యులకి తెలియరుగా? సామాన్యులకి తెలిసిన సప్త ఋషుల పేర్లు వేరు. ఇంకా ఆకాశం లో మనక కనిపించే సప్త ఋషి మండలం లో నక్షత్రాలని--యేనక్షత్రం యే ఋషో చెపితే ఇంకా బాగుండేది! కాదంటారా?

ఇంకా చాలా వున్నాయి--స్వయం గా చదవండి--లింక్ కావాలంటే, నా టపాలమీద ఆయన కామెంట్లలో దొచుకుతుంది మీకు!

ఇంకో ముఖ్యమైన సంగతి--భవబంధాలు వీడి, సన్యాసం పుచ్చుకొనేవారు--'జంధ్యాలు తెంపుకొని' స్వీకరిస్తారు! వారిక 'గాయత్రి' ని అనుష్టించరు. గాయత్రి గొప్పతనాన్ని కీర్తించరు! ఆత్మానందం కోసం అన్వేషించి, ఆ అలౌకిక ఆనందానుభూతిని అనుభవిస్తూ శేష జీవితాలని (కొన్ని వందల యేళ్ళు కావచ్చు) గడుపుతారు! పుష్కరాల సందర్భం లో నగ్నంగా ప్రత్యక్షమయ్యే 'యోగులు' వాళ్ళు--నిజమైన సర్వ సంగ పరిత్యాగులు--అంతేగానీ--ఆశ్రమాలు స్థాపించి, వెర్రి వెర్రి ఉపన్యాసాలూ, హావభావ ప్రకటనలూ, కొండొకచో గానాలూ, వాయిద్య వాదనలూ చేస్తూ, డబ్బు సంపాదనలో మునిగి తేలడానికి అక్రమాలకి సైతం వెనుకాడనివారు--సన్యాసులు కాదు--గురువులు అంతకంటే కాదు!

(ఇక మన తెలుగులో 'పుంజాలు తెంపుకుని' పారిపోవడం అనేదొకటుంది. మాట వినని గొడ్లని, నాలుగు కాళ్ళకీ నాలుగు పొడవాటి త్రాళ్ళు కట్టి, నాలుగు పక్కలా నాలుగు గుంజలకి కట్టేవారు! అవీ 'పుంజాలు' అంటే. పుంజా లేదా పుంజీ అంటే నాలుగు అని అర్థం. ఈ విధంగా ఆ గొడ్డుకి తను బంధించబడ్డానని అనిపించకుండానే, యేపక్కకి కొంత దూరం వెళ్ళినా, ఇంకో పక్క త్రాడు బిగిస్తుంది! దాన్ని అంతకన్నా యెక్కువ ఆ వైపు కదలకుండా చేస్తుంది! ఇక వాటికి--విపరీతమైన భయం వేస్తే మాత్రం, ఆ పుంజాలు తెంపుకుని పారిపోయేవి! ఈ ప్రయోగాన్ని మన ఇదివరకటి కథల్లో, సాహిత్యం లోనూ, బాపు కార్టూనుల్లోనూ చూస్తాం!)
దీంతో, న్యాయ మూర్తులైన పాఠక దేవుళ్ళ ముందు నా వాదనని ముగిస్తున్నాను.

తీర్పు యేమైనా, శిరసావహిస్తాను!

ఇక మీ ఇష్టం.



Wednesday, November 11, 2009

సంవాదం--5


నార, మంగేష్ లతో

అక్కడితో మా సంవాదానికి 'ఫుల్ స్టాప్' అనుకున్నాను!

అప్పుడు ప్రవేశించాడు, 'నార '.

నేను 'సంవాదం' టపాలకి ముందు--అర్థంపర్థంలేని వ్యాఖ్యలు అని వ్రాసిన టపాలో చెప్పిన అన్ని అవలక్షణాలూ వున్నాయి ఈయనకి!

నేను ఆత్మ గురించి వ్రాయగానే,

Nara said...
ఇది నిజం అనటానికి ఆథారాలు ఎమైనా వున్నాయా? ఆథారాలు లేకుండా దాన్ని ఎలా నమ్మటం?

--అని వ్యాఖ్య!

నేను,--'ఆధారాలు' అంటూ వ్రాశారంటే, మీరు నా ముందు టపా చదవలేదు అని తెలుస్తూంది. అందులో ముందే వ్రాశాను 'గరుడ పురాణం' అని!

వెంటనే అది సంపాదించి చదవడానికి ప్రయత్నించకండి! దాని పేరు సైతం తలవడం ఆశుభం గా భావించేవాళ్ళున్నారు!

అయినా నేను ముందునించీ చెపుతున్నాను--మనం నమ్మినా, నమ్మకపోయినా, ఇవన్నీ మన సంస్కృతిలో భాగమని!

చదువుతూ వుండండి!--అని సమాధానం ఇచ్చాను.

మధ్యలో 'పవన్' సమాధానం ఇచ్చారుగానీ, స్వయం గా నేను కలగజేసుకోడంతో అనుకుంటా, తరవాత వూరుకున్నారు.

మళ్ళీ, నార,--'మీరే మీ హేతువాదం బ్లాగులో అవెందుకు, ఇవెందుకు, అంతా వేలం వెర్రులు, శాస్త్రాలు, యోగాలు, అవసరమా అని వ్రాసారు. అలాంటప్పుడు వీటిని ఎలా నమ్మటం? అందుకనే ఆథారాలు వున్నాయా అన్నాను.........గరుడపురాణం ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతారు...........అప్పుడే ఎందుకు చదువుతారు?........చదివితే అశుభం ఎలా అవుతుంది. మీరు చదవుతూ వుండండి అన్నారు. నేను రెండు, మూడు సార్లు చదివాను.'

(నేను వ్రాసింది, నా తరవాత టపాలు చదివితే మంచిదని! పాపం ఈయనకి అది కూడా అర్థం కాలేదు.....వారి బొంద!)

'......... జీవుడు (ఆత్మ) శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటాడట." అని చెప్పారు.........భువర్లోకము అంటే ఏమిటి? అది ఎక్కడ వుంటుంది?........' అంటూ వ్రాశారు.

తీరా ఆయన వివరాలు చూద్దామని ప్రయత్నిస్తే, 'profile not available'!

అందుకే, "నేను వ్రాసేవాటికీ--నేను చదివి, విని, చెప్పాలనుకున్నవాటికీ తేడా గ్రహించలేని వాళ్ళకీ, ముఖ్యంగా ముక్కూ మొహం లేని నారలూ, పీచులూ లాంటివాళ్ళకీ సమాధానం ఇచ్చి నా సమయం వృధా చేసుకోలేను!

క్షంతవ్యుణ్ణి!........" అని వ్రాశాను.

అక్కణ్ణించి, యెలా రెచ్చిపోయాడో చూడండి --'సమాధానము చెప్పలేనప్పుడు ఇలాంటి బూటకపు రాతలు రాయవద్దు. మిమ్మల్ని ఎవడు రాసి ఏడవమన్నాడు. నీకు వయసే తప్ప బుద్ది పెరగలేదు. నువ్వు రాసిన దానిని వివరణ అడిగితే చెప్పలేని అసమర్థుడవని అర్థమైనది. నిన్ను క్షమించవలసిన పనిలేదు. అంతా నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.'

అని వాగి, తన మిత్రులకి--'అర్థమైనదిగా. ఎవరైనా వివరణ అడిగితే తిడతాడు. జాగ్రత్త. ఎదుటి వాళ్ళను గౌరవించలేని వాడు ఎవడో గ్రహించండి. ఈయన బుద్దికి తోచినది రాస్తాడు. అదేమిటంటే నీలాంటి వాడికి సమాథానము ఇచ్చి నా సమయం వృథా చేసుకోను అంటాడు. ఇక మీరే అర్థం చేసుకోండి. అంటే ఈయన రాసింది గుడ్డిగా చదవాలి. అందుండి ఏమైనా ప్రశ్న వస్తే తిరిగి చెప్పలేడు. పాపం. ఇలాంటివి చదివి మీ సమయం వృథా చేసుకోకండి. అనవసరంగా మాట పడాల్సి వస్తుంది.'

అని సలహా కూడా ఇచ్చారు!

అంతవరకే అయినా ఓ రకం గా వుండును--కానీ, ఈయనకి మంగేష్ వత్తాసు పలుకుతూ, 'చాలా బాగా చెప్పారు. అయన ఏదో రాస్తారు.. కానీ సందేహములను తీర్చలేరు. అవి తీర్చలేకే విసుగు చెందుతూ వుంటారు.........మీకు కలిగిన సందేహాలు నాకు బాగా నచ్చాయి. ఎక్కడైనా సమాధానములు దొరికితే ఇక్కడ తెలియ పరచండి.'

అని వ్రాశారు!

మళ్ళీ, నార, 'మీ మద్య జరిగినవి చూసాను. అవి చదివాక మీరు చెప్పినది నిజమే అనిపించినది.

ముక్కు మొహం లేనివాళ్ళకి అంటారు ఈయన.. అంటే కృష్ణశ్రీ గారికి తెలియని వాళ్ళెవరు కూడా ఈ బ్లాగు చదవకుడదేమో?...........అహ.. ఓహో అనేవాళ్ళు మాత్రమే చదవాలి అని బ్లాగులో చెప్పండి.' అన్నారు.

ఇలా తానా అంటే తందానా అనుకున్నారిద్దరూ!

నేను పాఠక దేవుళ్ళముందు ఇదంతా బయటపెట్టడం మొదలుపెట్టగానే, పాపం మంగేష్--

నన్ను మనస్పూర్తిగా క్షమించండి. ఇంకెప్పుడూ మీలాంటి పెద్దలను బాధ పెట్టను.
October 13, 2009 10:18 AM
అని వ్రాశారు.

వెంటనే ఆయనకి 'మనలో మనకి క్షమాపణలు వద్దు! కొంచెమైనా అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి--చాలు!'

అని జవాబు వ్రాశాను!

మరి నార కి ఇంకా ఙ్ఞానోదయం అయినట్టులేదు!



Saturday, November 7, 2009

సంవాదం-4

నార, మంగేష్ లతో
తరవాత నా సమాధానం లో "అదుగో! మళ్ళీ విమర్శిస్తున్నానంటున్నారు! 'గాయత్రి గుర్తుకొచ్చినప్పుడల్లా.........' అని మీరంటే, అది కాదు మీ perception ముఖ్యం అన్నానని మరిచిపోతే యెలా? రెండుసార్లు వాడినా, '.......లాంటి వాళ్ళు ' అని అందర్నీ అన్నాను--మిమ్మల్ని ప్రత్యేకించలేదే?.............యోగాలూ వగైరాలవల్ల యేదో వుంటుందని విపరీత ప్రచారం చేసేవాళ్ళు సమాధానం చెప్పవలసే వుంటుంది--లేదా ప్రచారం మానుకోవాలి! 'యెందుకు' అనే ప్రశ్నే లేకపోతే, ఇప్పటి సమాజ వునికే లేదు! అది హాని చేస్తోందన్నారంటే.....!" అని వ్రాశాను.

దానికి ఆయన 'ఇంకొకరిని ఒకనితో పోలిస్తే ఇద్దరూ ఒకటనే కదా?........ఎవరికి సమాథానము చెప్పాలి? వారు చెప్పినది కరెక్టే అని ఎవరు నిర్ణయిస్తారు? అవతలి వారు చెప్పినది నిజం అని చెప్పాలంటే ప్రశ్నించినవానికి తెలిసి వుండాలి కదా? తెలినప్పుడు ఎవరు ఏది చెప్పినా తప్పే అని పిస్తుంది.............. యెందుకు అనే ప్రశ్న యెందుకు వేసుకోవాలి? ఎవరు వేసుకోవాలి? ఎవరికి వేయాలి? జవాబును ఎవరు నిర్ణయిస్తారు? నేను ఎవరు? యెందుకు ఇలా వున్నాను అనేదే నిజమైన ప్రశ్న. దాని జవాబు కొరకు ప్రయత్నించాలి. అంతే కాని ప్రపంచము ఇలా యెందుకు వుంది అంటే అది అంతె.. జవాబు దొరకదు.. వెతకటమే మిగులుతుంది. హాని అంటే నిర్వచనమేమిటి? అది ఎవరికి చేస్తుంది? ఎవరు చేస్తారు? యోగాలు వగైరాల వల్ల హాని ఎలా జరుగుతుంది? అసలు యోగం అంటే నిజమైన అర్థము ఏమిటి?' అన్నారు.

యెంతబాగున్నాయో కదా ప్రశ్నలు! వాటికి సమాధానాలెవరికైనా తెలుసా?

ఈ లోపల నా మరో బ్లాగులో 'ఆత్మ ' గురించి వ్రాస్తే, వెంటనే దానికి ఆయన కామెంట్: 'ఆత్మ గురించి కొంచము రాస్తే బాగుంటుంది అన్నారు. మరి ఎమీ రాయలేదే? నేను, మా మాస్టరు ఎదో గజిబిజి చేశాము అన్నారేగాని, మీరు ఏమీ చెప్పలేదే? ఎందుకనో ఒక్కసారి ఆలోచించండి? చూసిందే నమ్ముతాను అంటే దేన్ని కూడా నమ్మలేము........మనకు అర్థము కాలేదు కాబట్టి లేదు అని, అంతా తప్పు అని అనకూడదు, అనుకోకూడదు. అనంత విశ్వములో మన భూమి అణువంత. దాన్ని ఆశ్రయించి వున్న మనము ఎంత వుంటామో ఒక్కసారి ఊహించండి. అలాగే మనకు తెలిసిన జ్ఞానము కూడ. శరీరములో నుండి బయటకు వెళ్ళి మళ్ళి శరీరము లోనికి వచ్చిన వారు ఉన్నారు. దాన్ని చక్కగా వివరించిన వారూ వున్నారు.................' అని వ్రాశారు.

దానికి నా సమాధానం "ఆత్మ గురించి వ్రాద్దామనుకుని, ఈనాడు వ్యాసం గురించి ముగించబట్టి 'ఆత్మ గురించి మరోసారి ' అని వ్రాశాను కదా! మీరన్న ఆఖరి వాక్యాన్నే కదా నాటపాలో నేను వ్రాసింది? ఇక నేను 'చూసిందే నమ్మడం....' లాంటి వాటి గురించి యేమీ వ్రాయలేదే! శరీరం లోంచి బయటికి వెళ్ళడం అంటే మరణమే! మళ్ళీ శరీరం లోకి వచ్చి, చక్కగా వివరించారు అంటే నేను నమ్మను. మీరుమాత్రం యెందుకు నమ్ముతారు? దాఖలాలెందుకు చూపించరు--మీరని కాదు--ఇలాంటివి వ్రాసేవాళ్ళూ, ప్రచారం చేసేవాళ్ళూ?" అని వ్రాశాను.

మళ్ళీ ఆయన,'Please search for Death Experiences in Google then you will get many links and from there you can get more information. It is our bad luck that we don't believe our scriptures, but if the same thing is explained by foreigners then we believe with surprise face. I hope the articles from Google can make you to believe.' అన్నారు.

నేను, 'You seem to be much influenced by 'tabloids' like our erstwhile 'Blitz' and not to know, death Experiences are different from 'actual death'! All stories I have heard and read in my last 45 to 50 years are simply 'trash'! Why should I search for more trash? If you believe to have any concrete information, please don't hesitate to send me the link, so that I can try to find out the truth in their claims! Please also don't mix up 'scriptures', 'explained by foreigners' etc. with the subject we are concerned with at present.' అని వ్రాశాను.

ఆయన మళ్ళీ,'You are a fixed man not flexible.' అంటే, నేను, "మీరు చిన్నవయసులోనే fixed అయిపోవడం 'ముదావహం'" అన్నాను.

ఆయన సమాధానం, 'You are right and accept your comment. I am fixed and very much fixed but at the same time I am flexible also.........TRUTH is like two sides of coin. Single side of coin never become full coin.................I tried to give more information reg. the Light of GAYATRI. But you mis-understood and unable to go thru the TRUTH.' అంటూ వ్రాశారు.

దానికి నేను, 'In any matter, there is one and only one absolute Truth. It has no two sides! Our sages and mahatmaas tried and succeeded to find that. So, you stick on to whatever you feel is the truth, while I proceed to find out the absolute truth!' అని వ్రాశాను.

ఆయన మళ్ళీ, 'నేను చెప్పిన two sides ద్వందములు. వెలుగు -చీకటి, ఆడ -మగ, సుఖము - దుఃఖము, కష్టము - నష్టము, పగలు - రాత్రి, ఉత్తరాయనము - దక్షిణాయనము, ధన (+ve) - ఋణ (-ve) .... మొదలగునవి అన్నీ కలిపి సత్యము..............దేవుడు ఎంత నిజమో దెయ్యము కూడా అంతే నిజము.........చనిపోయినంత మాత్రాన వాడు లేడు అనుకోకూడదు. లేకుండా మళ్ళీ ఎలా వస్తాడు. మనందరము అలా వచ్చినవాళ్ళమే కదా? సమన్వయాత్మకంగా చూచినప్పుడే పూర్ణత్వము అందుతుంది అని నా భావన' (ఈ వాక్యం నేను అండర్ లైన్ చేశాను--యెందుకంటే, ఈ మహానుభావుడు, నారని సపోర్ట్ చేస్తూ, 'మీకు వచ్చిన సందేహాలు నాకు బాగా నచ్చాయి ' అనివ్రాశాడు మరి!)

దానికి నేను, 'మళ్ళీ మొదటికే వచ్చి, 'దేవుడు యెంత నిజమో, దెయ్యం కూడా అంతే నిజము' అని వొప్పుకున్నారుకదా? మరి 'మంత్రాలు' మంచిని చేస్తే, వాటిని ఇష్టం వచ్చినట్టు వాగితే బెడిసికొడతాయని కూడా నమ్ముతారా, నమ్మరా? దీనికి అవును--కాదు అని సమాధానం చెప్పలేకపోతే, మీది అనవసర వాదన అని నిరూపింపబడుతుంది! అవునా? కాదా?' అని అడిగాను! దానికి ఆయన యెంత చిత్రంగా సమాధానం చెప్పరో చూశారా? 'ఎవరికి బెడిసి కొడతాయి? దానిని బట్టి అవునో-కాదో చెబుతాను.'--ఇదీ ఆయన వ్రాత!

(దీనికి నేను 'మాతాతకి ' అనో, 'విశ్వామితృడికి ' అనో సమాధానం ఇచ్చి వుంటే, ఆయన సంతోషించి, 'హ హ హా! కొట్టవు!' అనేవారేమో!) దానికి నా సమాధానం--'తేలిపోయిందికదా--మీరు సమాధానం చెప్పరని! పైగా అమాయకం గా యెదురు ప్రశ్నలు వేస్తారని! వాదనకోసమే వాదించే వాళ్ళతో నా సమయం వృధా చెయ్యదలుచుకోలేదు! నమస్కారం! (నా తెలుగు రాడికల్ లోని మీ వాదనకి కూడా ఇదే నా సమాధానం అని గ్రహించండి!)'.....అని. అప్పటిక్కూడా, ఆయన మళ్ళీ, 'నేను కూడా అదే అనుకుంటున్నాను. నాప్రశ్న మీకు పూర్తిగా అర్ధం కాలేదు అని.. మీ దగ్గర సమాధానం లేదు అని. సమాధానం లేనప్పుడే ఎదుటి వాళ్ళది వాదన అనిపిస్తుంది. ఫరవాలేదు.. మీ సమయం వృధా చేసుకోకండి... తెలిసినప్పుడే చెప్పండి.' అని. (ఇదికూడా నేనే అండర్ లైన్ చేశాను.....నేను దేనికి సమాధానం తెలుసుకోవాలో.....ఆయనకి చెప్పాలో--కనీసం మీలో యెవరైనా తెలియచెపుతారేమోనని!)

ఇవండీ ఆయన డొంక తిరుగుడు వ్యాఖ్యలు; ప్రశ్నలు, సమాధానాలు!

Monday, November 2, 2009

సంవాదం-3



నార, మంగేష్ లతో

తరవాత ఆయన వ్రాసినది--

"గాయత్రి గురించి నా perception మీకు ఎందుకు నచ్చలేదు. నచ్చక పోవటానికి ఏమైనా ఆథారాలు వున్నాయా? నాకు ఆనందాన్ని ఇచ్చిన దాన్ని ఇంకొంత మందికి పంచే ప్రయత్నము చేశాను. అంతే కానీ అందులో వున్నది సరికాదు అని ఎలా చెప్ప గలరు. చాలా సందర్బములలో నేను వ్రాసిన గాయత్రి టపా గురించి మీరు చాలా వ్యంగముగా విమర్శించారు. అది ఎంత వరకు సబబు. ఎవరి దర్శనము వారిది కదా? అందులో కూడా సత్యము వున్నదని మీకు ఎందుకు అనిపించలేదు. అది అవగాహానా లోపమే కదా? కుండలినికి గాయత్రికు ముడి పెట్టి అన్నారు. సమస్త యోగములకు కూడా గాయత్రే మూలము. అందువల్ల దాన్ని దేన్తో ముడి వేసినా తప్పు లేదు. అన్నీ అందులో నుండి వచ్చినవే.. అందులోనికి వెళ్ళి పోయేవే...

ఇంకా.....

"వేలంవెఱ్ఱుల్ని ప్రోత్నహించమని చెప్పటం లేదు. కోటి విద్యలు కూటి కొరకే కదా? ఎవరు ఎన్ని చేసినా పొట్ట నింపుకోటానికే కదా? ఇక వ్యాపారం అంటారా! అది వారి వారి సంస్కారము బట్టి వుంటుంది. చేసే పని, చెప్పే మాట అన్నీ కూడా ఆ వ్యక్తికి వున్న అవగాహనను తెలియచేస్తాయి. వ్యక్తిలోని అపరిపూర్ణతే అతని చేత కర్మలు చేయిస్తుంది. అది పూర్తి అయితే దాని వైపు వెళ్ళడు. ఇది అందరికి వర్తిస్తుంది. దీనికి ఎవరూ అతీతులు కారు. ఇతరులకు ఏరకంగా కూడా హాని చేయకుండా జీవనము కోసము ఏ పని ఐనా చెయ్య వచ్చును. అంతఃకరణ శుద్ది వుండాలి."

అర్థ సందర్భాలేమైనా బోధపడ్డాయా?

ఆయనకి నేనిచ్చిన సమాధానం....

"Perception--అంటే, మళ్ళీ--'గాయత్రిగురించి నా ' అంటారు!

నేను మీ 'గాయత్రి టపాని ' వ్యంగ్యం గా విమర్శించానంటారు! (యెప్పుడో యెక్కడో మీకే తెలియాలి!)

'........ముడివెయ్యడం' తప్పనలేదు--యేమైనా సాధించారా? అన్నాను!

'ఇతరులకి హాని చెయ్యకుండా........'--నిజం! కానీ వేలంవెఱ్ఱులు సమాజానికి హాని చేస్తున్నాయే!

నా వుద్దేశ్యంలో మీ perception కి ఇవే దాఖలాలు!"

దానికి మళ్ళీ ఆయన....

"మీరు విమర్శించినది "నా" perception నే కదా? కాబట్టి గాయత్రి గురించి "నా" అన్నాను..........."

"వేలం వెఱ్ఱులు సమాజానికి హాని చేస్తున్నాయి అన్నారు. అవి మాత్రమే చేసున్నాయా?.........ఏదీ అనవసరముగా లేదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలియనప్పుడు అది అవసరము లేదు. పనికి మాలినది.. అందరూ ఎమిటో .... వెఱ్ఱి అని పిస్తుంది. తెలిసినప్పుడు ఏది ఎందుకు వుపయోగపడుతుందో తెలుస్తుంది. సృష్టిలో అనవసరమైనది ఏమీ లేదు. దానియందు అవగాహనా లోపము వల్ల మనకు అనవసరం అని పిస్తుంది. ఆలోచించండి..."

దీనికైనా అర్థ సందర్భాలేమైనా బోధపడ్డాయా?