Thursday, September 1, 2011

కబుర్లు - 67



అవీ, ఇవీ, అన్నీ


నిన్నో, మొన్నో, బోధి వృక్షం క్రింద నిద్రించినట్టున్నాడు మన కి కు రె. చాలా బాగా ఙ్ఞానోదయం అయ్యింది ఆయనకి.

"రైతుకి కనీసం 70-80 శాతం ఆదాయం వస్తేగానీ, గిట్టుబాటుకాదు--ఆదిశగా 'కేంద్ర, రాష్ట్ర ' ప్రభుత్వాలు ఆలోచించకపోవడం తప్పే!" అంటున్నారు.

మరి తానూ ఓ రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశకుడూ, ముక్కుమంత్రీ అని మరచిపోయారా?

మన"సు" కవి చెప్పినట్టు, 'యెదటి మనిషికీ చెప్పేటందుకే నీతులు వున్నాయి" అందామా?

కరప్షన్ పితామహుడు కరుణ, మంచి సమయంలో వుద్యమం మొదలెట్టించాడు--వురిశిక్ష రద్దు చెయ్యాలి అని. (రేప్పొద్దున్న రాజాకీ, కనిమొళికీ వురి వేస్తారేమో అని భయమేమో! అదే కాకుండా, సాక్షాత్తూ "రాజీవ్" హంతకులకి ఆ శిక్ష పడింది కదా.....ఇంతకన్నా కాంగీల మీద కక్ష తీర్చుకోడానికి ఇంకేం అవకాశం వస్తుంది?!)

పచ్చివెలక్కాయ పడింది కాంగీల గొంతులో!

వుద్యమం వుధృతం అవుతోంది. సరే.

మేమూ వున్నామంటూ, కమ్మీనిస్టులు తయారయ్యారు(ట). యెప్పటినించో ప్లాన్ చేసుకొన్న వాళ్ల మీటింగులని ఇప్పుడు నిర్వహిస్తున్నారట--వురి కి వ్యతిరేకంగా!

అన్నా దీక్ష తరవాత యేమిటి? లోక్ పాల్ తరవాత యేమిటి? అనేవాళ్లకి నేను చెప్పేది--వురిశిక్ష రద్దు చెయ్యండి. దాని స్థానంలో--నాలుగు రోడ్ల కూడళ్లలో, పదునైన కత్తితో, వాళ్ల గొంతుకలు కోసే (జబా అనో యేదో అంటారు.....కోళ్లని అలా నరకడాన్ని మన "ముస్లిం సోదరులు")......శిక్షని ప్రవేశపెట్టండి--అని!

యేమంటారు?

తాజా కలం: ఈనాడువారు తాము "ముస్లిం సోదరులు" అనే ప్రత్యేక "జాతి"ని "డీ రికగ్నైజ్" చేసినట్టున్నారు--ఇవాళ్టి (01-09-2011) పేపర్లో, ఫోటోల క్రింద "ముస్లింలు" అని మాత్రమే వ్రాశారు! కీపిటప్ ఈనాడూ!

2 comments:

Indian Minerva said...

:-D

A K Sastry said...

డియర్ Indian Minerva!

సంతోషం.

ధన్యవాదాలు.