Tuesday, August 30, 2011

కబుర్లు - 66



అవీ, ఇవీ, అన్నీ

పాపం కి కు రె మొదటిసారిగా (ముక్కుమంత్రిగా) తనపేరుమీద "యువకిరణాలు" అనే పథకం ప్రవేశపెట్టాలని ముచ్చటపడితే, బొచ్చె దానికి ముందు "రాజీవ్" పేరు చేర్చేవరకూ వూరుకోలేదు.

ఇప్పుడేమో బొచ్చె పర్యటనలు మొదలెడితే, "మీ ప్రభుత్వానికీ, నీ పదవికీ ఆక్సిజన్ అందించిన మా చిరు ఫోటో పెట్టుకోకుండా వెళతావా? ఖబడ్దార్!" అంటున్నారు.

పాపం అధిష్టానానికి వొంట్లో బాగాలేదు, ఓ మూడు నెలలు మన వుద్యమానికి సెలవు ప్రకటిద్దాం--అన్నాట్టో పెద్దమనిషి. 

వుద్యమం చల్లబడుతున్నట్టు కనిపిస్తోంది, ఇంక రాస్తా/రోడ్డు రోకోలతో పని కాదు, "ఢిల్లీ వెళ్లే" రైళ్ల రోకోలూ, "విమానం" రోకోలూ చేద్దామంటున్నాడు--అప్పట్లో చందారెడ్డి చెంచా కొండా లక్ష్మణ్ బాపూజీ!

కొంతం (మం)దిలీపులు యెవరో సమాలోచన వాళ్లో యెవరో--రాజకీయుల మాటలని కొన్ని దశాబ్దాలనుంచీ కోట్ చేస్తూ, '600 మంది అమాయకులు ఆత్మాహుతి చేసుకున్నారు......అవి ఆపడానికి కృషి చేద్దాం....' అనడాన్ని కొనియ 'ఆడుతున్నారు '!

బీజేపీవాళ్లు--కాంగీవాళ్లు "యెవరైనా తమకి అనుకూలంగా వున్నన్నాళ్లూ నెత్తికెత్తుకొంటారు, వ్యతిరేకమైతే, కోర్టులనీ, సీబీఐ నీ వుసికొల్పుతారు" అంటే, ఇదో మేచ్ ఫిక్సింగ్ అంటున్నారు కొంతమంది!

జర్నలిస్టులకి, నాయకులని వెర్రిమొర్రి ప్రశ్నలేసి, "నోకామెంట్లు" రాబట్టడం తప్ప తెలియడం లేదు. "గురువా.....శిష్యా..."; "బాబాయ్.....అబ్బాయ్"; "మామా....అల్లుడూ..." లాంటి క్యామెడీ--అనేక పేర్లతో వ్రాసే వాళ్లు మార్క్ టులీ లాంటివాళ్లని ఆదర్శంగా తీసుకుంటే బాగుండును. 

   

No comments: