Wednesday, April 13, 2011

కబుర్లు - 40

అవీ, ఇవీ, అన్నీ

కేవలం 'నికమ్మాలే' జనాలకి పిలుపులిస్తారు.....అంటే మీరొప్పుకోరని తెలుసు. 

పిలుపులిచ్చేవాళ్లందరూ "సకమ్మాలు" అనీ మీరొప్పుకోరని తెలుసు. మరి.......

మొన్న ఓ ప్రక్కన అన్నా హజారే నిరాహారదీక్షలో వుండి, దేశం అట్టుడుకుతున్నవేళ, మన గవర్నర్ నరసిం హం గారు, "అవినీతిని తరిమి కొట్టండి" అని పిలుపునిచ్చారు. 

అంతేకాదు. పోలీసులని "ఒక్కరు తప్పు చేసినా, అది శాఖలోని అందరితోపాటు, ప్రభుత్వానికీ 'చెడ్డపేరు' తెస్తుందనీ, అందుకు గురువారం (07-04-2011) 'ఆశా' వర్కర్లపై జరిగిన 'ఘటనే' వుదాహరణ అనీ పేర్కొన్నారట. 

(సస్పెండు చెయ్యడం తప్ప, ఆడవాళ్ల కటి స్థానాలనీ, యెముకలనీ చితక్కొట్టిన ఆ సీ ఐ ని ఇప్పటివరకూ యేమి చేశారు? అయినా వాడికంత 'సరదా' యేమిటో యెవరైనా కనుక్కున్నారా? వాడి పెళ్లాం యేమంటుంది?)

*   *   *

మళ్లీ అప్రాచ్యుడు చెపితేనే మనకు తెలుస్తూంది--యువతకి 'సాంకేతిక ' వ్యసనం వంట పడుతోందని. 

మొత్తం 10 దేశాల యువతీ యువకులపై అధ్యయనం చేస్తే, అందులో 79% ల్యాప్ టాప్ కీ, మొబైల్ ఫోన్ కీ, ఇంటర్నెట్ కీ 24 గంటలపాటు దూరం చేస్తే, "పిచ్చెక్కి కొట్టుకుంటున్నారట". 

కొందరు మాత్రం, అవి లేనప్పుడు తమ సహచరుల్తో "సుదీర్ఘ" చర్చలు చేస్తున్నాము అని చెప్పారట! యెంత బాగుందో కదా?!

*   *   *

"మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం!"

అన్నా హజారే దీక్ష ఫలప్రదం అయ్యింది(ట).

ఆయనే అన్నట్టు 'ముందుంది ముసళ్ల పండగ!' 

చూద్దాం! కపిల్ సిబాల్ యెన్నిసార్లు 'థూఛ్ అంటాడో, మిగిలినవాళ్లు ఇంకెన్నిసార్లు, యేమేమి అంటారో!

*   *   *

"ఈనాడు" వారికి బుధ్ధి వచ్చినట్టే వచ్చి, మళ్లీ పోతూంటుందేమో.

"మొదటి వివాహ", "63వ వివాహ"--లాంటి శుభాకాంక్షలు చెప్పడం మానటం లేదు!

మనం కూడా, ఆ "పెళ్లికొడుకులు" త్వరలో "రెండవ" వివాహ, "64వ వివాహ" శుభాకాంక్షలు అందుకోవాలని (ఆశీర్వదించేసి) ఆశిద్దామా???!!!

No comments: