Friday, October 22, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ


మొన్నెప్పుడో తమిళనాడులో దొంగలబడి గురించి విన్నాం.

ఇప్పుడు "వుగ్రవాదులకి" అల్ ఖైదా "ఆన్ లైన్" లో పాఠాలు మొదలెట్టిందట. 74 పేజీల "ఇన్స్ పైర్" అనే ఇంగ్లీష్ పత్రికని నిర్వహిస్తోందట. దీనికి ముందుమాట--ఇంకెవరు--ఒసామా బిన్ లాడెన్ వ్రాస్తూ, "అమెరికన్లనీ, పాశ్చాత్యులనీ చంపడానికి 'వ్యక్తిగత జిహాద్ ' చేపట్టాలి" అని పిలుపునిచ్చాడట!

"అల్టిమేట్ మౌవింగ్ మెషీన్" పేరుతో చిట్కాలు బోధిస్తున్నారట. ట్రక్కులతో విధ్వంసం యెలా? మొదలైన పాఠాలు నేర్పుతున్నారట. వీటికన్నా, భోజనవేళ, రద్దీగా వున్న రెస్టారెంట్లలో జొరబడి, తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరపడం వుత్తమమైనది అని కూడా చెపుతున్నారట!

ఇలాంటి రాక్షసులకి ఇంకా ఈ భూమిమీద నూకలు యెన్నాళ్లు వున్నాయో కదా!

==> హైదరాబాదు ఔటర్ రింగురోడ్డుకి సంబంధించిన కార్యాలయంలోని భూసేకరణకి సంబంధించిన దస్త్ రాలు మాత్రమే ఓ అగ్ని ప్రమాదం లో "దగ్ధమయ్యాయట!"

వింతేమితంటే, పది ఇనుప బీరువాలు దస్త్ రాలతోసహా మసైపోతే, ప్రక్కనే చెక్కబల్లలపై వున్న దస్త్ రాలు భద్రంగా వున్నాయట. ఇంకా, కోర్టులలో కేసులు నడుస్తున్న భూముల గురించిన దస్త్రాలు మాత్రమే కాలిపోయాయట. 

కార్యాలయం లో యేడు విభాగాలు ఒకే హాలులో వుండి, అన్నింటికీ విద్యుత్ ఒకే బోర్డులోంచి వెళుతున్నా, ఒక ప్రాంతానికే మంటలు పరిమితమయ్యాయట. బోర్డులోని ఎం సీ బీ లు "ట్రిప్" అయి వున్నాయట!

వాటిలో చాలామటుకు "పని అయిపోయినవే" అనీ, ఇంకా పని కావలసినవి ఓ నలభై, యాభై వుండచ్చనీ, వాటిని పునర్నిర్మించడం, కలెక్టరేట్లలో వుండే కాపీల ఆధారం గా పునరుధ్ధరించడం తేలికే అని వుప కలెక్టరు సెలవిచ్చారట!

==>ఆ మధ్య తూ గో జి పర్యటనలో చంద్రబాబు వంతాడ గ్రామం లోని లీజుల వ్యవహారం గురించి వెళితే, అక్కడకి ముందే సాక్షి టీ వీ వ్యాన్ వెళ్లి, కొంతమందిని రెచ్చగొట్టి, పంపించడం, "వాళ్లలో" అని చెప్పి, లక్ష్మి అనే గిరిజన మహిళమీద ఆయన చేయి చేసుకున్నాడనీ, దౌర్జన్యం చేశాడనీ, ఓ చిన్న విజువల్ ని పదే పదే చూపించి గోల చేసింది.

దాంతో కాంగీ లు, ఛీఫ్ విప్ శైలజానాధ్ లాంటివాళ్లూ "ఆయన మానసిక వ్యాధితో వున్నాడు" అనేంతవరకూ వెళ్లారు. 

మరి తరవాత ఆ మహిళే జరిగింది చెప్పి, ప్రెస్ కౌన్సిల్ లో కూడా సాక్షి మీద ఫిర్యాదు చేసింది!

మరి మానసిక వ్యాధి గ్రస్తులెవరో?

==> తూ గో జి, కాట్రేని కోన లో, సాకా పాపారావు అనే వ్యక్తి, గల్ఫ్ లో పెద్ద వుద్యోగాలిప్పిస్తానని, నిరుద్యోగుల నించి 6.5 లక్షలు నొక్కేశాడట. అతన్నించి 37 మంది పాస్పోర్టులు స్వాధీనం చేసుకొని, పోలీసులు కోర్టులో హాజరుపరిచారట.

No comments: