Saturday, December 11, 2010

....కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ!

ఏటీయెం లో 1500/- డ్రా చెయ్యడానికి వెళితే, డబ్బురాకుండానే, యెకవుంట్లో ఖర్చు వ్రాయబడిందట ఒకాయనకి ఆంధ్రా బ్యాంకు ఖాతాలో. ఆయన లబో దిబో మన్నా, జవాబు రాలేదట.

చివరికి బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ ఆ 1500 తోపాటు, రోజుకి 100 చొప్పున పరిహారం కూడా చెల్లించమని ఆదేశిస్తే, సంఘటన జరిగిన 322 రోజుల తరవాత, అలాగే 32,200 కూడా 'పువ్వుల్లో పెట్టి' ఖాతాలో జమ చేశారట!

దీనికి "సహకరించిన" వినియోగదారుల సంఘం జిల్లా వుపాధ్యక్షుడుకీ, బ్యాంకు వున్నతాధికారులకీ (తోక కోసి సున్నం పెట్టి?!) కృతఙ్ఞతలు చెప్పారట సదరు బాధితుడు!

భళా వి సం లూ & ఆంబుడ్స్ మన్!

ఇదొక "అదనపు" సంపాదనా మార్గమా!? వచ్చే రెండేళ్లపాటు "రిలయన్స్" సంస్థ మానవ వనరుల అవసరాలకోసం, రామ చంద్రా ఇంజనీరింగ్ కళాశాల (ఏలూరు) క్యాంపస్ లోనే, వారి విద్యార్థులనే ఇంటర్వ్యూ చేసి, నియమించుకొంటామని ఆ రెండు సంస్థల మధ్యా "అవగాహనా ఒప్పందం" జరిగిందట! 

బాగుంది కదూ? సీట్లమ్ముకొని సంపాదిస్తున్న సంస్థలకి ఇంకా యెంత వెసులుబాటు!

సింపుల్! ఎం పీ 3 లేదు; అప్లికేషన్లు లేవు; ఇంటర్నెట్ సంగతి తెలీదు; కనీసం సంక్షిప్త సందేశాలు పంపుకొనే వెసులుబాటు కూడా లేదు! కేవలం ఫోన్లు చేసుకోడానికీ, వస్తే వినడానికి మాత్రమే వుపయోగించే సెల్ ఫోన్ తయారు చేసిందటో కంపెనీ! బ్రిటన్ కు చెందిన ఆ సంస్థ పేరు 'జాన్స్ ఫోన్' ట! (సరిగ్గా, అబ్దుల్ కలాం లెవెల్లో నేను కలలు కన్నది అలాంటి ఫోన్ కోసమే! కానీ నేను వాడుతున్న దాంట్లో ఎసెమ్మెస్ వుండి, "8946 రూపాయల వాచీని కేవలం 894 చెల్లించి సొంతం చేసుకోండి" లాంటి సందేశాలతో ఛస్తున్నాను--డిలీట్ చెయ్యలేక!)

ఇలాంటి ఫోన్లు యే 100 రూపాయలకొకటో అమ్మేస్తే, 1929 నాటి ఆర్థిక సంక్షోభం మళ్లీ వచ్చి, "అంగళ్ల సెల్ ఫోన్లు అమ్ముకున్నారిచట" అని పాడుకొనే అవకాశం నోకియా, శామ్‌సంగ్ వగైరాలకొస్తుందేమో! (నాకు భలే సంతోషం!)

అరుణ్ దుగ్గల్ అనే ఆయన 18-11-2010 న ఈనాడు దినపత్రిక యెనిమిదో పేజీలో "అర్థిక సంఘటితం" మీద ఓ వ్యాసం వ్రాశాడు. చదవండి. దానిపై నేను వీలువెంబడి ఓ టపా వ్రాస్తాను. అదీ చదవండి.

"వ్యతిరేక వాది" మణిశంకర్ అయ్యర్ తనను తాను "పిలూ మోడీ" కంటే అధికుడిననుకుంటాడు.....కానీ.....ఆయనకి వస్తున్న "సమాచారం" దేశం లోని అత్యధిక వున్నతాధికారులైన "తమిళ" బుర్రోవాదులనించే అని అందరికీ తెలుసు!

ఈ మధ్య ఆయన భారత్ యెప్పటికీ ఓ ప్రపంచ శక్తి గా యెదగలేదు--అది ఓ భ్రమ--కల్పిస్తున్నవాడు ఒబామా! అని ఓ చిన్నసైజు టపాకాయ పేల్చాడు! (ఆయన కవి హృదయం--ఈ కాంగీల పాలనలో అని అయి వుండవచ్చు!)

నేను చెపుతున్నాను--సరైన దీశానిర్దేశం వుంటే, 2020 కల్లా మనదేశం చీనాను కూడా (అమెరికా జపాన్లతోసహా) అధిగమించగలదు! యెదురులేని మిలిటరీ శక్తిగాకూడా! (అబ్దుల్ కలాం పంథాలోనో, ప్రతిభా పాటిల్ పంథాలోనో కాదండోయ్! నెపోలియన్ పంథాలో!)

యేమంటారు?

తృటిలో తప్పిన......లు

06-12-2010 న, విశాఖపట్నం నుంచి సికిందరాబాదు వెళ్లే జన్మభూమి (2805) కి చాగల్లు వచ్చేసరికి ఫైబర్ బ్రేక్ స్థంభించడంతో, స్టేషన్లో సుమారు 8 నిమిషాలు నిలిపేసి.......(అట!)

డ్రైవర్ అప్రమత్తంతో, పెను ప్రమాదం తప్పిందని స్టేషన్ సిబ్బంది చెప్పారట!
(లేకపోతే.....అని వారు చెప్పఖ్ఖర్లేదుగా?)

No comments: