Tuesday, December 1, 2009

లాలూ మూర్ఖహ.....


అగ్రేసరీ మమత!

కోచ్ ల కొరత కారణంగానే కొత్త రైళ్ళను నడపడం కష్టం గా మారిందని, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు శ్రీ ఎం ఎస్ జయంత్ అన్నారట.

ఆరువేల కోచ్ లు అవసరం వుండగా, మూడువేలే అందుబాటు లో వున్నాయని చెప్పారట!

రాయ్ బరేలీలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైతే, కోచ్ ల కొరత ‘కొంతమేరకు’ తీరనుందట—ఇది ముక్తాయింపు!

(రాయ్ బరేలీ అప్పట్లో ఇందిరాగాంధీ నియోజక వర్గం—ఇప్పుడు సోనియా గాంధీదనుకుంటా! అందుకని ఈ చెక్కభజన అనికూడా అనుకుంటా!)

మొన్నీ మధ్యనే ‘అన్నీ ఏసీ బోగీలు‘ తయారు చేసి ఓ ‘తురంతో’కో, ‘గరీబ్ రథ్’ కో ఇచ్చారని వార్త వచ్చింది! వున్న దురంతోల్లోనూ, గరీబ్ రథ్ లలోనూ 23 నించి 26 శాతం మాత్రమే నిండుతుండగా, ఈ కొత్త, పూర్తి ఏసీ రైలు యెలా కిట్టుబాటవుతుందో మమతకే తెలియాలి.

ఇక మూడు వేల కోచ్ లు అందుబాటులో వున్నాయంటే, బాగా పాడైపోయిన ఓ వంద రైళ్ళకి చెందిన 2300 బోగీలని కొత్తవి వేసేసినా, ఇంకా 700 బోగీలు వుంటాయి—వీటితో ఓ 30 రైళ్ళని ప్రవేశ పెట్టచ్చు కదా?

ఆడలేక మద్దెల ఓడన్నట్టు లేదూ ఈ వ్యవహారం?

కక్కుర్తి బెర్తులు తొలగించిన రైళ్ళలో పై బెర్తుని క్రిందకి దించి, పాత కన్నాల్ని పూడ్చి, కాస్త రంగులైనా వెయ్యడానికి దిక్కు లేదు గానీ, కొత్త రైళ్ళూ, పూర్తి ఏసీ రైళ్ళూ, అవీనట! మీరు దేంతో నవ్వుతారు?

మనం ఇంతకు ముందు చెప్పుకున్న 'రైల్వేలకి చెందిన (అపార) స్థలాలని' 'పబ్లిక్-ప్రైవేట్' భాగస్వామ్యం తో 'అభివృధ్ధి' చేద్దామని ఓ ఆలోచనట! ఇక వాటిని ఆ దేవుడే కాపాడాలేమో!

సంచీ లాభం చిల్లు కూడదీసినట్లు, మేనేజ్ మెంట్ గురు లాలూ డబ్బాకొట్టుకున్న లాభాలని మమత కరగేసి, తను ఇంకో సూపర్ మేనేజ్ మెంట్ గురు అయిపోతుందేమో!

అయినా ఆశ్చర్యం లేదు!

No comments: