Wednesday, October 5, 2011

కబుర్లు - 77

అవీ, ఇవీ, అన్నీ

సకలజనుల సమ్మె చేసుకుంటున్నారు......తమ ప్రజలకి వ్యతిరేకంగా తామే! అని సంతోషిస్తున్నారా? రేపు యే పిచ్చిదంబరమో ఇంకో ప్రకటన చేసేవరకూ గాజులు తొడుక్కొని కూర్చుంటారా? ఇప్పుడే మీ సత్తా ప్రకటిస్తారా? తేల్చుకోండి! అంటున్నాడట కోడెల.

యేదీ, యెవడబ్బ సొమ్మూ కాదు! "ఈ దరిద్రం వదలాలంటే, వాడు అడిగిన తెలంగాణా ఇచ్చేస్తే పోను కదా......హైద్రాబాదు తప్ప"....అని సామాన్య జనాలు అంటున్నారంటే, యెంత విసిగిపోయారో ఓ సారి ఆలోచించండి!

కేసీఆర్ తన తోక తాను లేపలేకపోయినా, జానా రెడ్డి ని "తెలంగాణా వస్తే, ముఖ్యమంత్రివి నీవే" అని యెగదోసి, తెలంగాణా కాంగ్రెస్ మంత్రులనీ, ఎమ్మెల్యేలనీ, నాయకులనీ "వూతకర్రలుగా" చేసుకొని, తానో మహాత్ముడి స్టేజికి యెదగాలని వాడి స్ట్రేటజీ! దానికి పిల్లిగడ్డమోడొకడు మధ్యవర్తి! ఇప్పుడు, "తెలంగాణా ఇచ్చేస్తే, మా పార్టీని మీ పార్టీలో విలీనం చేసేస్తా"నంటాడా? "నీ విలీనం యెవడికి కావాలి--చిరంజీవి సపోర్టు మాకుండగా!" అని కాంగీవాళ్లంటూంటే, కొందరు మాత్రం, "బలేమామా బలే! అదే మన తక్షణ కర్తవ్యం" అంటున్నారు! ఇంకో ప్రక్క, కురువృధ్ధ జైపాల్ రెడ్డిని 'మీ నాయకత్వం అవసరం ' అంటున్నారు. మరి ఇంక బొర్రముక్కోడూ, మిడి గుడ్లోడూ, అంతమందిని బలిపెట్టి యేమి సాధించినట్టు?

మామూలుగా కాకపోతే, కుంచం తిరగేసి కొలవమన్నారు--అన్నాడు గిరీశం.

"ఆటునుంచి నరుక్కురమ్మన్నారు" అని కూడా అన్నాడు!

గాంధీ మార్గం ఫలితాన్నివ్వకపోతే, శివాజీ మార్గం ఆదర్శం అవుతుందన్నారు "అన్నా హజారే"! ఇప్పుడు అదే మార్గం పడుతున్నారేమో! "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా" అని చెప్పి, "వచ్చే యెన్నికల్లో కాంగీలకి వోటు వెయ్యొద్దు" అని ప్రచారం చెయ్యడానికి బయలుదేరుతానన్నాడు! దెబ్బకి దిమ్మతిరిగి, బొమ్మ గూట్లో పడింది......సల్మాన్ ఖుర్షీద్ అప్పుడే ప్రకటించేశాడు......"వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే "లోక్ పాల్" బిల్లుని ప్రవేశపెట్టి, ఆమోదింపచెయ్యడానికి ప్రయత్నిస్తాము" అని!

జై గాంధీ మార్గం! జై శివాజీ మార్గం! జై జై అన్నా హజారే!

సెన్సెక్స్ 16 వేలకన్నా క్రిందికి పడిపోయింది. ఇదివరకోసారి, 8 వేలకన్నా పడిపోతే సంతోషిస్తాను అని వ్రాశాను. యెందుకంటే, అది బలుపు కాదు వాపు అని ఖచ్చితంగా చెప్పాను. ఇప్పుడు నిజం అవుతోంది కదా? మూడీస్ ఎస్ బీ ఐ రేటింగుని తగ్గించేసింది. పిచ్చిదంబరం అనవసరంగా మార్కెట్లని వాచేలా చేసి, అదంతా బలుపు అనుకోమన్నాడు!

"నిరర్ధక ఆస్థుల" కాన్సెప్ట్ వచ్చినప్పటినుంచీ, యెలాగో అలా మేనేజి చేసి, (ఆడిటర్లకి ఆడీ కార్లు కొనిచ్చి) బ్యాంకులన్నీ తమకి నిరర్ధక ఆస్థులు దాదాపు లేవు అని ప్రకటించుకుంటూవస్తున్నాయి. ఇప్పుడు, మానవ ప్రమేయం లేకుండా, కంప్యూటర్లే ఈ ఆస్థుల నిర్ధారణ చేస్తున్నాయి. రేపు మార్చికి చూడాలి--ఈ బ్యాంకుల పరిస్థితి! యెన్నింటి గోడలూ, పునాదులూ చెదలు తినేశాయో!

ఇంకో ప్రక్క, "ఇంక కీలక రేట్లని పెంచొద్దు మహాప్రభో" అంటున్నారు పారిశ్రామిక వేత్తలు! దువ్వూరివారూ....ఆలకించకండి. మరోసారి వీళ్లకి పెద్ద యెత్తున షాక్ ఇవ్వండి! వృధ్ధి రేటు యేనెలకానెల జీరో అయినా, వృధ్ధి అంటూ జరక్కమానదు!

ప్రణొబ్ ముఖొర్జీ, తన కార్యాలయంలో దొంగ కెమేరాలు పెట్టించారు అని మొత్తుకొంటే, "దానితో వాడికి సంబంధం లేదు" అన్నారు. వాళ్ల శాఖ అప్పుడెప్పుడో వాడికి లేఖ వ్రాసింది అంటే, ఇప్పుడు "వాళ్లిద్దరూ ఫ్రెండ్స్!" అని షేక్ హేండులిప్పించేశారు! అసలు అది వాళ్ల మధ్య సమస్యా? మొత్తం దేశం సమస్యా?

ఇప్పుడు నెమ్మదిగా బయటకొస్తూంది......ఈ దరిద్రాలన్నింటికీ కారణం "అధిష్టానమే" అనీ, అక్కడ నేషనల్ ఎడ్వైజరీ కౌన్సిల్ పేర ఓ 17 మందితో "సూపర్ కేబినెట్" నడుస్తూంది అనీ, మంత్రులనీ, శాఖలనీ, పార్లమెంటులో బిల్లులనీ చదరంగంలో పావులని కదిపినట్టు ఆడిస్తోంది అనీ!

అరుణారాయ్ అనే ఆవిడ (తన సొంత లోక్ పాల్ బిల్ ఫేం) అందులో ముఖ్యురాలట. ఇంకా, హర్ష్ మందిర్ అనే మాజీ ఐయేఎస్ అధికారి ఓ సూపర్ కాప్ ట (బీజేపీని యెదుర్కొనే సత్తా వాడికే వుంది అని ఆవిడ నమ్మకంట)--ఆ కౌన్సిల్లో!

ఇంక రాజ్యాంగం యెందుకూ, మంత్రివర్గం యెందుకూ......అన్నీ కూడా యెందుకూ? పోనిద్దురూ!

2 comments:

Anonymous said...

"వాడు"
అడిగిన తెలంగాణా ఇచ్చేస్తే పోను కదా....
తానో మహాత్ముడి స్టేజికి యెదగాలని
"వాడి" స్ట్రేటజీ!
మరి ఇంక
"బొర్రముక్కోడూ",
"మిడి గుడ్లోడూ,"
అంతమందిని బలిపెట్టి యేమి సాధించినట్టు?
>>>>
ఆహా ఎం రాస్తున్నారు కృష్ణా జీ
ఏం సంస్కారం, ఏం అహంకారం, ఏం కండకావరం ....
మీ పెన్ను లోంచి అశుద్ధం జాలువారు తోంది. !!!

A K Sastry said...

"యద్భావం తద్భవతి!"

"అది" కక్కకుండా, ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే బాగుండేది!