Sunday, March 7, 2010

నిపుణులు


నైపుణ్యం

మన సీ పీ ఐ నారాయణ అరెస్టయి వ్యానులో విసిరేస్తే నడ్డి విరక్కొట్టించుకోడం లోనే కాకుండా ఇంకో విషయం లో కూడా ఎక్స్ పర్ట్ అని నిరూపించుకున్నాడు!

మొన్న హైదరాబాదులో 'అరటి ఆకు' అనే (ఇంగ్లీషు) పేరుతో ఒక రెష్టారెంటు ప్రారంభించి, కోడి, పీతలపులుసు ఆరగించారట. ఆయన కోడి తొడననుకుంటా కొరుకుతూ ఫోటో కూడా వేయించుకున్నారు పేపర్లో!
"ఇంట్లో మామూలుగా చెట్నీతో రెండు ఇడ్లీ, సాంబారుతో నాలుగు ఇడ్లీ లాగిస్తాను. అదే కోడికూరతో, డజను ఇడ్లీ లాగిస్తాను!" అని వ్యాఖ్యానించారు కూడా!

మనలో మనమాట--ఇడ్లీ పచ్చడిలోనో, సాంబారులోనో ముంచుకు తింటే, అది 'అల్పాహారం' అవుతుంది. కోడిని నములుతూ, డజను ఇడ్లీలని మధ్యమధ్యలో నంజుకుంటే--దాన్నేమంటారు?

ఆ పని పూర్తి చేస్తూ, 'బాబూ! పిట్ట మాంసం కూడా యేర్పాటు చేశారా?' అని క్రొశ్నించారట!

మరి ఆయన వుద్దేశ్యం ఏ పిట్ట అనో?

యే పిట్టనైనా చంపడం పర్యావరణానికి హాని కలిగిస్తుందేమో కదా!

తరవాత, గవర్నరుగారి శాకాహార విందులోననుకుంటా--చిరంజీవి 'పాపం నారాయణగారికి చికెన్ లేదు!' అని జోక్ కూడా వేశారట.

బాగుంది కదూ?


No comments: