Saturday, January 2, 2010

లాలూ మూర్ఖః



అగ్రేసరీ మమత!
విన్నారా?

సోకాల్డ్ మేనేజ్ మెంట్ గురూ లాలూ, మన రైల్వేల్లో దొంగలెఖ్ఖలు వ్రాశాడట!

అసలు మిగులు 39 వేల కోట్లే అయితే, 79 వేల కోట్లకు పైగా వున్నట్టు మసిపూసి మారేడుకాయ చేశాడట!

స్వయం గా మమతాదీయే, మన పార్లమెంట్ లో ఈ ప్రకటన చేసింది!

ఇహ ఇప్పుడు తన దురంతాలతో--సారీ--'దురంతో'లతో ఆ మిగిలిన కోట్లలో యెన్ని ఆవిరైపోయాయో--మరెవరైనా రైల్వే మంత్రి అయ్యేవరకూ బయటికి రావు!

ఇక ఇప్పుడు మళ్ళీ--'యుబ' పేరుతో, అన్నీ ఏ సీ కుర్చీబోగీలే వున్న ఓ డజనో యెన్నో రైళ్ళని ప్రవేశాపెడుతోందట--అందులో మొదటిది కొలకత్తా నించి న్యూఢిల్లీ వరకూనట!

1500 కి మీ దూరం వరకూ ఒక రేటు, దాటితే 2500 కి మీ వరకూ ఇంకో రేటు వసూలు చేస్తారట! మధ్యలో యెక్కడైనా ఆ రైళ్ళు యెక్కాలంటే, పూర్తి టిక్కెట్ తీసుకోక తప్పదట!

రోజుకి సుమారు 60 వేల మంది 'యువత' కొలకత్తా-ఢిల్లీల మధ్య ప్రయాణిస్తున్నారట!

మరి గంటకి 350 కి మీ వేగంతో ప్రయాణించినా, యే పదిగంటలో ప్రయాణించినా 3000 కి మీ ప్రయాణించవే బుల్లెట్ రైళ్ళు సైతం?
మరి ఈ లెఖ్ఖన ఆ 60 వేలమందిలో మళ్ళీ సాయంత్రానికి వెనక్కి కొల్కత్తా చేరేవారెందరో! వాళ్ళలో 'యువత' యెందరో!

అసలు విషయం ఆఖరుకి వొచ్చింది--వీటిల్లో 60 శాతం సీట్లు 18-45 యేళ్ళ మధ్య వయసుగల 'యువత'కి కేటాయించారట!

మరి టిక్కెట్టు కొనేవారి వయసుని నెత్తిమీద జుట్టు రంగునిబట్టీ, కట్టు బట్టల్ని బట్టీ నిర్ణయిస్తారేమో--బుక్కింగ్ క్లర్కులు! లేదా వాళ్ళకి ప్రత్యేకమైన కళ్ళజోళ్ళేమైన సరఫరా చేస్తారేమో--మనిషిని చూడగానే వాడి వయసు ఠక్కున్న తెలిసిపోయేలాగ!

ఇప్పటి సంగతేమో తెలీదు గానీ, ఇదివరకు రైల్వే హాస్పటళ్ళు అంటే చాలా గొప్ప పేరు! అలాంటి హాస్పటళ్ళలో 'మెంటల్' విభాగాలు కూడా వుండే వుంటాయి!

మరి మమతని, ఆవిడ మాటల్ని తు. చ. తప్పకుండా పాటిస్తున్నవాళ్ళనీ పాపం అలాంటి వాటిలో చేర్పించి పుణ్యం కట్టుకొనేవాళ్ళెవరైనా వుంటే బాగుండును!

(మనం రైలెక్కాక క్షేమం గా గమ్యం చేరామంటే--మనం కృతఙ్ఞులై వుండవలసింది--తమ 'విధి'ని దైవకార్యం గా భావించో, పాపభీతివల్లో చక్కగా, సక్రమం గా నిర్వహిస్తున్న వేలాది మంది 'గాంగ్ మెన్'లలో చాలా మందికీ, ఇతర చిన్న వుద్యోగులకేగానీ, 'ఇలాంటివాళ్ళకి' కాదు!)

మన లెఖ్ఖల పండితులు, ఆర్థిక ఐంద్రజాలికులూ--మన్మోహనాదులు--ఈ విషయం ఆలోచిస్తే ఇంకెంత బాగుండును!


No comments: