Monday, October 19, 2009

సంవాదం

నార--మంగేష్ లతో
గాయత్రీ మంత్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న తీరు గురించి నా టపాలో నేను వ్రాసినదానికి--

ఈయన వ్యాఖ్యలో: "గాయత్రి అనగా వెలుగు." గాయత్రిని గానము చేయుటకు జాతి, మత, కుల, వర్గ విభేదములు ఎమీ లేవు. ఆడా వారు కూడా మగవారిలా గాయత్రి మంత్రము చేసుకోవచ్చు. దీనిని మన ఋషులే అంగీకరించారు. అనేక దేశములలో ఎంతో మంది గాయత్రి మంత్ర గానము చేయుచున్నారు.' అని వ్రాసి, తన బ్లాగుకి లింకులు ఇచ్చారు!

ఆయన బ్లాగులోకి వెళితే, 'Masters Voice' అని లింక్ కనిపించింది. సరే, అదేమిటో చుద్దాం అనుకుంటే, దానికో గాడ్రెజ్ తాళం కప్ప!

(నిన్న మొన్న మళ్ళీ ఆ టపా దగ్గరకి వెళితే, ఆయన 'About Me' లో ఇప్పుడు వాళ్ళ మాస్టర్ల పేర్లు కనిపిస్తున్నాయి--అప్పుడు అవి లేవు!)

హెచ్ ఎం వీ అని ఓ గ్రామఫోన్ రికార్డుల కంపెనీ వుండేది. దాని చిహ్నం ఓ కుక్క గ్రామఫోను రికార్డు ద్వారా, స్పీకరులోంచి తన యజమాని గొంతు వింటున్నట్లు ఓ బొమ్మ! (గ్రామఫోన్ రికార్డుల మీద 'అథారిటీ' శ్రీ వీ యే కే రంగారావుగారు, ఆయనకి కోపం వచ్చినప్పుడు దాన్ని 'కుక్క కంపెనీ' అని తిట్టేవారు!). ఈయన బ్లాగు యేదో అలాంటి వ్యవహారమేమో అనిపించింది!

అందుకే నేను చాలా మర్యాదగా అడిగాను! ".................మీ 'మాస్టర్లు' యెవరో తెలియ లేదు............ గాయత్రిని ‘గానం’ చెయ్యచ్చు అనీ, ఆడా మగా తేడా లేకుండా, జాతి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ చదవచ్చు, పాడచ్చు అనడానికి ఆ విషయం యెవరు యెక్కడ చెప్పారో అధికారికం గా వ్రాయరేం?..........ముందు ‘గురు బ్రహ్మ’ చదవాలని చెప్పారు. బాగుంది. మరి ఆ పాడువారందరికీ యే గురువు వుపదేశించాడని వాడికి వందనం చెయ్యాలి? వివరిస్తే బాగుండేది. అని.

దానికి ఆయన తిరిగిన డొంకలూ, ఇచ్చిన సమాధానం చదవండి! "అధికార పత్రం చూపించటానికి గాయత్రి మంత్రము గవర్నమెంట్ G.O కాదు........ఇక గురువు ఎవరికి వందనము చేయాలి అన్నారు. గురువు ఒక్కడే............ఆ దైవమునే English లో "master" అంటారు. master అంటే స్వామి అని అర్దము. "గురు బ్రహ్మ" మంత్రములో చెప్పబడిన గురువు అతడే...........వ్యక్తము కాని దైవము వ్యక్తము ఐనపుడు వెలుగై వ్యక్తమౌతాడు............."

యేమైనా తలా, తోకా దొరుకుతున్నాయా? 1. ముందు 'దైవమూ అనబడే, ఇంగ్లీషులో మాస్టర్ అనబడే,........చెప్పబడిన గురువు.......(కి వందనం చెయ్యాలి--తరువాత గాయత్రి చదవాలి/పాడాలి.) 2. దైవము వ్యక్తము ఐనప్పుడు వెలుగై వ్యక్తమౌతాడు......(అంటే, గాయత్రి చదివిన తరవాతగానీ వ్యక్తమవడుకదా?) 3. అదే మూల ప్రకృతి. అతడు పురుషుడైతే ఆమె ప్రకృతి. అంటే....వెలుగై వ్యక్తమయే'వాడూ మూల ప్రకృతి. మరి అతడు 'పురుషుడైతే', ఆమె ప్రకృతి!?!

విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రమును సమస్త మానవజాతికి ఇచ్చాడు. అందులో అందరూ వస్తారు. భేదాలు ఎమీలేవు. పండితుల్ని కాక సద్గుగువులనెవరినైనా అడిగి తెలుసుకొన గలరు. ఇదీ ఆయన సమాధానం!

(మిగతా మరోసారి)

2 comments:

kiran said...

I understand your point in it

A K Sastry said...

డియర్ kiran!

వెంటనే మీ వ్యాఖ్యకి సమాధానం వ్రాయనందుకేమీ అనుకోవద్దు.
యెలాగూ ఇంకా వ్రాయాలనుకున్నాను కాబట్టి, పూర్తయ్యాక వ్రాద్దాములే అనుకున్నాను.

ఇప్పుడు నా సంవాదం టపాలు ముగిశాయి. ఇక మీ వ్యాఖ్యలే తరువాయి.

ధన్యవాదాలు.