Wednesday, October 21, 2009

సంవాదం-2

నార, మంగేష్ లతో

చదివి--"అవును. విశ్వామిత్ర మహర్షి సమస్త మానవాళికే కాదు ప్రకృతిలో వున్న అన్ని జీవులకూ ఇచ్చాడు! గ్రహించే ఙ్ఞానం వున్నవాళ్ళే అనుష్ఠించారు! మిమ్మల్ని ‘అధికారికం గా’ చెప్పమన్నాను గానీ ‘జీ వో’ చూపించమనలేదు! ఆవిషయం యెక్కడో అక్కడ చెప్పబడో, వ్రాయబడో వుండాలికదా? అది వినో, చదువుకొనో మీరు ఆ విషయం తెలుసుకుని వుండాలికదా? అదే చెప్పమన్నాను—అంతే! చెప్పగలిగితేనే చెప్పండి—లేకపోతే లేదు అనుకుంటాము!

'............పండితుల్ని కాక…అంటే? సద్గురువులంటే యెవరు? తెల్లగడ్డాలు, మీసాలు పెంచుకొని, నెత్తికీ, ఒంటికీ కాషాయ రంగు గుడ్డలని కట్టుకొని, ‘భగవంతుడు అంటే భగం వున్నవాడు’ ‘నేను నా సంగీతం తో, వాయిద్యం తో మీ రోగాలన్నీ నశింపచేసి, మోక్షాన్ని ఇస్తాను’—ఇలాంటి పిచ్చి వుపన్యాసాలిచ్చేవాళ్ళా?

ఇక ‘పరిమిషన్’ సంగతి—నాటపాలోనే వ్రాశాను—ఒకటి నమ్మితే, రెండోది నమ్మాలి—అని! ఇక మీ యిష్టం, చదివే, పాడే వాళ్ళిష్టం!

అని నా సమాధానం లో వ్రాశాను!

దీనికి మంగేష్ కామెంట్: Mangesh said...

చాలా సంతోషం. మీ టపాలు చదివాక నాకు అర్థమైనది ఒక్కటే. మీకు దేనిమీద నమ్మకం లేదు. ఉన్నది అనుకుంటున్నారు. సర్వము తెలుసు అనుకుంటున్నారు. ఎవరికైనా తెలియవలసినది చాలా వుంటుంది. తెలిసినది చాలా తక్కువ వుంటుంది. ఆ రెండూ కలిపితేనే పూర్ణమైన సత్యమవుతుంది. తప్పక మీకు గాయత్రి అనుగ్రహము కలగాలి అని ప్రార్థన చేస్తాను. అది వెలిగితే వున్న చీకటి తొలగిపొతుంది. సత్యము భోధ పడుతుంది. ఇదే నా చివరి కామెంట్. ఎందుకంటే ఎంత చెప్పినా ఉపయోగము లేదు కనుక. నా సమయము వృధా చేసుకోను.

మళ్ళీ నేను అన్నది--"నిజంగా నాకు దేనిమీదా నమ్మకం లేదు--వున్నది అనుకుంటున్నానని మీకు యెందుకు అనిపించిందో మరి! సర్వమూ తెలుసని నేనెప్పుడూ అనుకోలేదు--అనలేదు! అందరికీ అన్నీ తెలియవు--ఆ అవసరం కూడా లేదు.

ఐన్ స్టైన్ తన పెంపుడుపిల్లి తన ఇంట్లో అన్నిగదుల్లోకీ స్వేచగా తిరగాలని, తలుపులకి అది దూరగలిగేంత కన్నాలు పెట్టించాడట. ఆ పిల్లి ఒకేసారి యేడు పిల్లల్ని పెట్టగానే, అన్ని తలుపులకీ, తల్లి కోసం పెట్టించిన కన్నం పక్కన యేడు చిన్న చిన్న కన్నాలు పెట్టాడట!

దితి, 'ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి ' అని హోమం చేస్తుంటే, ఇంద్రుడు వెళ్ళి సరస్వతీదేవి కాళ్ళమీద పడితే, ఆవిడ దితి నోటిలో ప్రవేశించి, నాలుక తడబడేట్టు చేసి, 'ఇంద్రుడు చేతిలో చచ్చే కొడుకు కావాలి ' అనిపించిందట! పర్యవసానం అందరికీ తెలుసు కదా? ఇదైనా నమ్ముతారా?

మనిషన్నవాడు ఆమరణాంతం 'నేర్చుకుంటూనే' వుంటాడని నమ్మేవాణ్ణి నేను! నేన్నన్నీ చదువుతాను--ఆకళింపు చేసుకోడానికి ప్రయత్నిస్తాను--అది సమయం వృధా చేసుకోవడం అనుకోను!"

దీని తరవాత మంగేష్ వ్రాసింది '.........బహుశా మీకు గాయత్రి గుర్తు వచ్చినప్పుడల్లా నేను మీ మదిలో మెలుగుతానేమో. నేను మీ టపాలు చదివిన తరువాత మీ మేధస్సు అర్థమైనది. మీరు పడుతున్న శ్రమ అర్థమైనది. మీకు నా థన్యవాదములు. ................జరుగుతున్న వాటిని విమర్శిస్తేనో, బాగా తిట్టితేనో మార్పు రాదు. మార్పు సహజంగా లోపలి నుండి కలగాలి. ఎవరు ఎన్ని చెప్పినా తనకు తోచిందే నిజం అని భావించటం మానవ నైజం. కొంత మంది మాత్రమే అన్నిటిలోనున్న సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నించి కృతకృత్యులవుతారు. మనకు తెలిసిందే సత్యము కాదు. అలా అని తెలియంది కూడా సత్యము కాదు. రెండూ కలిపి సత్యము. మీ రచనలతో ప్రజలను చైతన్య వంతులను చేయండి. వారిని మేల్కొలపండి. జాగృతులను చేయండి. ప్రేమతో చెప్పండి. ప్రేమతో సమస్తమును జయించ వచ్చును. మీరు కొన్ని టపాలలో ఒక వర్గ విమర్శ చేసినందుకు చాలా విమర్శలు వచ్చాయి. మీ ఉద్దేశ్యము మంచిదే అయిననూ దానిని అందరూ మెచ్చే విధముగా తెలియచేయవలెను కదా? మనసు కాక హృదయము స్పందించ వలెను. హృదయము నందు కలిగిన మార్పే నిజమైన మార్పు. అంటూ యేమేమో వ్రాశారు!

నేను--'యేకహస్తం' (single handed)తో చేస్తున్న కృషిని అర్థం చేసుకొన్నందుకు ధన్యవాదాలు! అక్కడ గాయత్రి ముఖ్యం కాదు--మీ 'perception' ముఖ్యం నాకు. మీరు చెపుతున్నవి చాలా బాగుంటున్నాయి-'యోగములు, ధ్యానములు, మంత్రములు.....మిగిలినవారు కూడా దానిని........అందించారు' అన్నది అక్షర సత్యం!

కానీ ఆ పేరుచెప్పుకొని వ్యాపారాలు చెయ్యడం (పాపం పొట్టకూటికే అన్నాసరే), వేలంవెఱ్ఱుల్ని ప్రోత్సహించడం యెంతవరకు సబబు?

'......అందరికి కలగాలి......ప్రయత్నిద్దాం.' అనేమాటలు నా చెవుల్లో అమృతం పోశాయి!' అని వ్రాశాను నేను!

No comments: