Thursday, September 3, 2009

మహాఘోరం

విధి విలాసం

సృష్టిలో జవాబులేని ప్రశ్న, ఒకవేళ జవాబు అని భావించదలుచుకుంటే 'విధి ' అని సమాధానం వచ్చే ప్రశ్న--"యెందుకు" అనేది.

సినీనటి సౌందర్య విమానం కూలిపోయి మరణించినప్పుడు, టివీలో--ఆమె అరుస్తూ, గాజు తలుపులమీద గుద్దుతూ, కాలిపోవడం చూసిన వాళ్ళందరూ--'అంతటి నిస్సహాయ మరణం పగవాళ్ళకి కూడా రాకూడదు భగవంతుడా!' అని తప్పకుండా అనుకొని వుంటారు.

మరి--ఆంధ్రరాష్ట్ర నాయకుడు శ్రీ రాజ శేఖర రెడ్డి--24 గంటలకి పైగా--యేమి అనుభవించాడో--యేదిక్కూలేని అనాథలా యెంతకాలం పడివున్నాడో--ఇదంతా యెందుకు? అంటే--జవాబులేని ప్రశ్న! అంతే!

మనిషి వున్నంతకాలం తెలీదు--కానీ--ఒకసారి 'లేడు ' అనుకోగానే--అక్కడ యెంత అగాథం యేర్పడుతుందో మనకి వాళ్ళ మీదున్న అభిమానాన్నిబట్టి తెలుస్తుంది!

ఆయన ఆత్మకి శాంతి కలుగుగాక!


No comments: