Sunday, August 16, 2009

‘ముఖ్యమంత్రీ…..

తత్వం...
‘మాది కృష్ణ తత్వం—వారిది శకుని మార్గం. ఎన్నికల ముందు మమ్మల్ని కౌరవులని, తామే పాండవులమని ప్రధాన ప్రతిపక్షం గొప్పలు చెప్పుకుంది. చివరకు పాండవులు ఎవరో ప్రజలే తేల్చారు’ అన్నారట ముఖ్యమంత్రి!

ఇంకా ‘ధరల సంక్షోభాన్ని ముందుగానే ఊహించాం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, ఆశలు పెట్టే అలవాటు లేదు. అందుకే 90 శాతం మంది ప్రజలకు తెల్ల కార్డు అవకాశం కల్పించి, రెండు రూపాయలకే కిలో బియ్యం, రూ.103 కే నిత్యావసరాలు (కందిపప్పు, నూనెలు) సరఫరా చేశాం’ అన్నారట.

‘ధరల బెడద ప్రపంచ వ్యాప్తం గా ఉందని మేధావులు ఊరడిస్తున్నా…ఊరుకోకుండా ధరలపై యుద్ధం ప్రకటించాము’ అని, ‘కృష్ణుడు చెప్పినట్టు కర్తవ్య పాలనలో జాప్యం వుండకూడదు అనే కృష్ణ బోధనే తనకు శిరోధార్యం’ అని కూడా అన్నారట!

‘కోటివరాలతో దేవుడి అవతారం ఎత్తాలని ప్రధాన ప్రతిపక్ష నేత అనుకున్నారు. 1999 లో ఆడపిల్ల పుడితే మేనమామలా ఐదువేలు ఇస్తానని చెప్పిన ఆ మేనమామ ఇప్పుడెక్కడున్నారు? బోగస్ ఏటీఎం కార్డులతో కనికట్టుకు పాల్పడ్డారు. ప్రజలని పావులుగా వాడుకోవాలని చూశారు.’ అని విమర్శించారట.

తరవాత ముఖ్యమంత్రికి ‘వైద్య పరీక్షలు’ చేయించారట!

(ఇప్పటిదాకా యేదేదో మాట్లాడాడనా?!—యేమో)


No comments: