Tuesday, January 27, 2009

నిర్వాకాలు

మన ప్రభుత్వాల నిర్వాకాన్ని గమనించండి!

ఈ రోజుకూడా, (మన మాజీ విత్త), హోం మంత్రి పాకిస్థాన్ ని హెచ్చరిస్తున్నాడు—“మరోసారి ఇలాంటి సాహసం చేస్తే, పరిణామాలు తీవ్రంగా వుంటాయి!” అని! (ముంబాయి దాడుల విషయంలో)
ఇదెలాగుందంటారు?

“నేను లేస్తే మనిషిని కాను! తెలుసా?” అన్నట్టు లేదూ?

 1947 లో పాక్ దాడి లో 30,000 చదరపు మైళ్ళ ప్రాంతాన్ని కోల్పోయిన విషయాన్ని భారత్ మరిచిపోకుండా ఉండి ఉంటే, 1965 యుద్ధం జరిగి వుండేది కాదు!

 1965 యుద్ధానంతరం మనం స్థిరంగా ధైర్యంగా వ్యవహరించివుంటే, 1971 లో మన మీద దాడి చేయగల సాహసానికి పాక్ ఒడిగట్టి ఉండేదే కాదు!

 1971 నాటి యుద్ధం దరిమిలా, 93,000 మంది పాక్ యుద్ధ ఖైదీలు మన చేతుల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా కొరడా ఝళిపించి వుంటే, 1999 లో కార్గిల్ దురాక్రమణకి పాక్ కలలో కూడా దిగి వుండేది కాదు!

 కార్గిల్ చొరబాటుని భారత్ మరిచిపోయి వుండకపోతే, 2001 లో భారత పార్లమెంట్ పై దాడి జరిగి వుండేది కాదు! ఆ దాడినీ భారత్ మరిచిపోయి పాక్ ని క్షమించి వుండకపోతే,(కనీసం అఫ్జల్ గురు ని ఉరి తీసి వుంటే)(బ్రాకెట్లమధ్య వ్రాసినది నేను) ఇటీవలి ముంబాయి ఘోరం చోటు చేసుకునేదే కాదు!

ఈ మాటలతో యేకీభవించని పిచ్చి వెధవలెవరైనా వుంటారంటారా?

(ఇవి ఈనాడు 04-01-2009 నాటి ఎ. సూర్య ప్రకాష్ వ్యాసంలోని మాటలు.)

మరి ‘ఏ బూచి’ కి భయ పడ్డాయి మన ప్రభుత్వాలు?

ఇంకెవరు? మన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగీరేసులు, పుట్టించి, పెంచి, పోషిస్తున్న ప్రత్యేక జాతి ‘ముస్లిం సోదరులు’ అనే ఓటు బ్యాంకు అనే బూచి కాదా?

2 comments:

అనుదీప్ said...

బాగా రాసారు.
సూర్య ప్రకాష్ గారు రాసిన వ్యాసం కూడా మనం చదివితే బావుంటుంది. లింకు
http://www.eenadu.net/archives/archive-4-1-2009/opiniondisplay.asp?myqry=opini2.htm&opid=2&reccount=2

A K Sastry said...

డియర్ దీప!

బాగుందన్నందుకు సంతోషం!

లింకు ఇచ్చినందుకు థాంక్స్!

అసలు పేపర్లూ, పుస్తకాలూ చదివే ఓపిక చాలా మందికి వుండటంలేదు! పైగా వ్యాసాలు చదవడమా--బార్బేరియస్! (గిరీశం కోటెడ్ ఔటాఫ్ కాంటెక్స్ట్)

అందుకే నేను ఇలా.......!