Thursday, July 17, 2008


గడ్డి తినే బుధ్ధి



చారిత్రాత్మక తప్పిదాలు చెయ్యడంలో ఆరితేరిన C.P.I (M) పార్టీకి చెందిన శ్రీ ఇంద్రజిత్ గుప్తా గారు లోక్ సభ స్పీకరుగా యెన్నికయ్యాక, ఇక ఏ పార్టీకి చెందినవారు కారట. వారి పార్టీ రాజీనామా చెయ్యమంటే అది చెల్లదట. ఆయన అసలు బాధంతా రేపు పార్టీ విప్ ప్రకారం ప్రభుత్వం ప్రవేశ పెట్టే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలనేనట! సరే, ఒప్పుకుందాం!


మరి B.J.P తో 'కలిసి ' ఎలా ఓటు చేస్తాను అంటాడేమిటి? మిగిలిన పార్టీల గొడవ నీకెందుకయ్యా? నీ పార్టీ పెద్దలు ఎలా చెపితే అలా వింటావా? లేక నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అన్నదే పాయింటు. అంతేగాని, ఇవేమి వంకలు? మీ పార్టీ బుఱ్ఱ గొరిగించుకోమంటే, బుధ్ధిగా గొరిగించుకుంటావా? ఫలానా పార్టీ వాడు బుఱ్ఱ గొరిగించుకుంటాడుట. వాడితో 'కలిసి ' నేను ఎలా గొరిగించుకుంటాను అంటావా!


ఇది భలే బాగుందయ్యా!


రేపు విశ్వాస తీర్మానం మీద ఓటింగులో రెండువైపులా సమంగా వస్తే, అప్పుడు? నీ నిర్ణయాత్మక (deciding) ఓటు ఏం చేస్తావు? ప్రభుత్వానికి ఓటు వేసి, 'అంతరాత్మ ప్రబోధం ప్రకారం వేసేనంటావా?' లేక "ఫలానా పార్టీ అనుకూలంగా వేసింది. దాంతో 'కలిసి ' ఎలా వేస్తాను?" అంటావా?


అసలు నీకు మళ్ళీ ఎన్నీకల్లో పోటీ చేసే చాన్స్ వస్తుందంటావా? వస్తే మీ మాజీ పార్టీ నుంచా? లేక కాంగ్రెస్ నుంచా? లేకపొతే ఏకంగా రాష్ట్రపతి ఛాన్స్ కొట్టెయ్యచ్చు అని కలగంటున్నావా? ఎవరి చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నావూ?


తేల్చి చెబితే బాగుంటుంది! మరెప్పుడు చెబుతావు?


సామాన్యుడు ఎదురు చూస్తూన్నాడు మరి!

No comments: