Sunday, July 20, 2008

ద్రవ్యోల్బణం

అనగానగా అప్పుడెప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం డిల్లీలో రాజ్యమేలుతుండగా, ద్రవ్యోల్బణం రెండంకెలలో వుండేదట! అప్పుడు విత్తమంత్రి శ్రీ మన్మోహన్ సింగు గారూ, వాణిజ్య మంత్రి శ్రీ చిదంబరం గారూ, ప్రణాళికా సంఘానికో దేనికో, మాంటేక్ సింగ్ అహ్లువాలియా గారూ .........వుండేవారట!

మళ్ళీ ఇప్పుడు వారు ముగ్గురి హయాంలోనే ద్రవ్యోల్బణం 12 శాతానికి దగ్గర్లో వుంది!
30 ఏళ్ళ క్రితం ప్రజలు మరిచిపోయిన "ప్రత్యేక తెలంగాణ" మళ్ళీ 2004 యెన్నికల ముందు ప్రత్యక్షమయింది!
ప్రజలు ఎప్పుడో చూసిన మతకలహాలు మళ్ళీ కనిపిస్తున్నాయి!
ఈ దరిద్రాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ప్రత్యక్షం అవుతాయి?
అలాగే, అయోధ్య అంశాన్ని ప్రధానిగా దేవె గౌడ పార్లమెంటులొ ప్రస్తావించే వరకూ అందరూ మరిచి పోయారు!

మధ్యలో అప్పుడప్పుడూ నేను బతికే వున్నానంటూ, వీపీసింగు గారు వెనుకబడిన వర్గాలకి రిజర్వేషనులు అంటూ కందిరీగల తుట్టె మీద ఓ రాయి వేస్తూ వుంటారు.

వెంటనే, అర్జున్ సింగ్ గారు ఓ చిన్న బిల్లు తయారు చెసేస్తూ వుంటారు!
చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే శివరాజ్ పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ లాంటివాళ్ళు!
పీవీ నరసిం హారావు నుంచి సూట్కేసులు అందుకున్నందుకు శిక్ష పడిన, మళ్ళీ ఎంపీలైన వాళ్ళు, మళ్ళీ సూట్కేసులకీ, మంత్రి పదవులకీ సిద్ధం!

న్యాయస్థానాలచే తప్పుపట్టబడిన వాళ్ళు, కీలక రాజ్యాంగ పదవుల్లో!
ద్రవ్యోల్బణానికీ, మార్కెట్లకీ సంబంధించిన విషయాల్లో మాత్రం 'మూడు కోతుల ' సూత్రాన్ని పాటించే రిజర్వ్ బాంక్ గవర్నర్!

వీళ్ళందరికీ ఓ చేటపెయ్య--సోనియా గాంధీ!

ఇవన్నీ చూస్తుంటే 'బిషప్ హ్యాటో' చేసిన పని గుర్తు రావడంలేదూ?
వాడు ముష్టి వాళ్ళని చేసినట్టు ఈ గాంగునందరినీ ఎవరైనా చేస్తే సంతోషించే వాళ్ళలొ మొదటివాణ్ణి నేనే!

No comments: