Sunday, May 17, 2009

అనుకున్నదే....

……….అయ్యింది! టోపీలోంచి పిల్లి బయటికి వచ్చింది!

కేంద్రం లో కాంగ్రెస్ కి చక్కని మెజారిటీ వచ్చింది!
రాష్ట్రం లో కూడా, చక్కని మెజారిటీ వచ్చింది!
కాంగ్రెస్ ప్రభుత్వాలు యేర్పడడం తథ్యం!

ఈ తతంగమంతా తెలియబరచింది యేమిటి?

మహా మహా పండితులు సైతం, సామాన్య వోటరు మనసులో యేముందో ఊహించడం లో ఘోరం గా విఫలమయ్యారని!

ఇది కేవలం వ్యతిరేక వోటు అని!

ప్రభుత్వానికి కాదు—ప్రతిపక్షులకి!

1977 నాటి పరిస్థితుల్లోనే దేశం వుంది అని!

అప్పుడు మహానుభావుడు జయప్రకాష్ నారాయణ్ వున్నాడు. ప్రతిపక్షులందరినీ ఒకే తాటి మీదకి తెచ్చాడు! గాంధీ సమాధి వద్ద ప్రమాణం చేయించాడు!

సామాన్యుదు వారికి అధికారం కట్టబెట్టాడు!

(అది వాళ్ళు—ఒళ్ళు కొవ్వెక్కి నిలబెట్టుకోలేక పోయారన్నది వేరే సంగతి!)

మరి ఇప్పుడు?

సామాన్యుడెంత సణుక్కున్నా, ప్రత్యామ్నాయన్ని చూపించగల నాయకుడు లేడు!

అందుకే, తెలియని దేవతకన్నా, తెలిసున్న రాక్షసి మేలు అనుకొని, మళ్ళీ కాంగ్రెస్ నే ‘యెక్కుకున్నాడు’

‘………..ప్రజాస్వామ్యం గతి ఇంతే………’ అంటూ పాడుకుంటున్నాడు సామాన్యుడు!

ఇదంతా మా నిర్వాకమే అని చంకలు గుద్దుకుంటున్నారు—సోనియా, రాశ్శేఖర్రెడ్డీ!

దేవుడు రక్షించుగాక!

No comments: