Showing posts with label విందు. Show all posts
Showing posts with label విందు. Show all posts

Saturday, February 27, 2010

వివాహ భోజనంబు


ఘటోత్క(రో)శయ్య

ముఖ్యమంత్రిగా రోశయ్య మొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకి వస్తున్నారట--27-02-2010 న.

ఆ సందర్భం గా, ఆరోజున ఆయన మధ్యాహ్న భోజనం కోసం క్రింది మెనూ ని సిధ్ధం చేశారట.

"అన్నంతో పాటు కొబ్బరి అన్నం, మరో యెనిమిది రకాల అన్నాలు, పులిహోర, చక్రపొంగలి, పెరుగావడ, గారె, గుత్తివంకాయ కూర, అరటికాయ కూర, బెండకాయ పులుసు, తోటకూర పెరుగు, బొబ్బట్లు, బిర్యానీ, కారప్పొడి, కరివేపాకు పొడి, శనగపొడి, నేతి ఆనపకాయ కూర, టమోటా...మునక్కాడ...జీడిపప్పు కూర, పెసరట్టు, మజ్జిగ చారు, పెరుగు, ఉలవచారు, సాంబారు, రసం, దొండకాయ కూర, ఆలూ చిప్స్, పన్నీపూల్ మఖాన్, మిక్స్ డ్ ఆవకాయ, బీరకాయ పుదీనా పచ్చడి, తాలింపు పప్పు, అప్పడాలు, వడియాలు, మామిడికాయ పప్పు, చల్ల మిర్చి, మిరపకాయ బజ్జి, పండ్లు...........ప్రత్యేక తాంబూలం!

పాపం ఆయనకి ఓ పంటిక్రిందకైనా వస్తాయో లేదో!

నేనే ముఖ్యమంత్రినైతే, అలాంటి మెనూ పురమాయించినవాడికీ, దానికి ఖర్చు పెట్టిన వాడికీ--ఓ వారం పాటు 'పావురాల కొండ ' చుట్టుపక్కలో, ఛత్తీస్ గఢ్ అడవుల్లోనో--కందమూలాలు తిని బతికే శిక్ష వేసేవాణ్ణి.

యెలా వుంది నా అయిడియా?